వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఆయనపై సొంత పార్టీ ప్రభుత్వం అనుసరించిన తీరును వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన ప్రముఖ నటి, ఎంపీ సుమలత, మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ రఘురామపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమా? అని విస్మయం వ్యక్తం చేశారు.
అంతేకాదు, మున్ముందు.. ఎంపీ రఘురామకు తాము మద్దతుగా ఉంటామని కూడా సుమలత స్పష్టం చేశారు. ఇక, ఢిల్లీకి చెందిన ఎంపీలు కూడా రఘురామ పై జరిగిన సీఐడీ దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటని వారు కూడా నిలదీశారు. ఇక, ఇప్పుడు తాజాగా కేరళకు చెందిన ఎంపీ ప్రేమ్ చంద్రన్ కూడా రఘురామపై దాడికి తీవ్రంగా స్పందించారు.
ఈ దాడి కేవలం ఎంపీ రఘురామపై జరిగింది కాదని.. ఏకంగా మొత్తం పార్లమెంటుకు జరిగిన అవమానంగా ఎంపీ ప్రేమ్ చంద్రన్ అభివర్ణించారు. తాజాగా ప్రేమ్ చంద్రన్ తన ట్విట్టర్ ద్వారా రఘురామరాజుకు మద్దతు పలికారు. రఘురామ రాసిన లేఖ తనను ఎంతో కలచి వేసిందని.. ఏపీ పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమని.. వ్యాఖ్యానించారు.
ప్రజాప్రతినిధి, అందునా ఎంపీ అయిన వ్యక్తిపై లాఠీలు ఎలా ప్రయోగిస్తారని ప్రేమ్ చంద్రన్ నిలదీశారు. అంతేకాదు… ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రత్యేక ప్రస్తావన చేస్తానన్న ఎంపీ.. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసే ప్రసక్తి లేదని.. రేపు మరో రాష్ట్రంలో ఇలా జరగదని గ్యారెంటీ ఏంటని.. దీనిపై స్పీకర్నే తాము నిలదీస్తామని ప్రేమ్ చంద్రన్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో సీఎం జగన్ చుట్టూ.. రఘురామరాజు వ్యవహారం మరింత బిగిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 6, 2021 2:13 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…