వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఆయనపై సొంత పార్టీ ప్రభుత్వం అనుసరించిన తీరును వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన ప్రముఖ నటి, ఎంపీ సుమలత, మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ రఘురామపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమా? అని విస్మయం వ్యక్తం చేశారు.
అంతేకాదు, మున్ముందు.. ఎంపీ రఘురామకు తాము మద్దతుగా ఉంటామని కూడా సుమలత స్పష్టం చేశారు. ఇక, ఢిల్లీకి చెందిన ఎంపీలు కూడా రఘురామ పై జరిగిన సీఐడీ దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటని వారు కూడా నిలదీశారు. ఇక, ఇప్పుడు తాజాగా కేరళకు చెందిన ఎంపీ ప్రేమ్ చంద్రన్ కూడా రఘురామపై దాడికి తీవ్రంగా స్పందించారు.
ఈ దాడి కేవలం ఎంపీ రఘురామపై జరిగింది కాదని.. ఏకంగా మొత్తం పార్లమెంటుకు జరిగిన అవమానంగా ఎంపీ ప్రేమ్ చంద్రన్ అభివర్ణించారు. తాజాగా ప్రేమ్ చంద్రన్ తన ట్విట్టర్ ద్వారా రఘురామరాజుకు మద్దతు పలికారు. రఘురామ రాసిన లేఖ తనను ఎంతో కలచి వేసిందని.. ఏపీ పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమని.. వ్యాఖ్యానించారు.
ప్రజాప్రతినిధి, అందునా ఎంపీ అయిన వ్యక్తిపై లాఠీలు ఎలా ప్రయోగిస్తారని ప్రేమ్ చంద్రన్ నిలదీశారు. అంతేకాదు… ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రత్యేక ప్రస్తావన చేస్తానన్న ఎంపీ.. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేసే ప్రసక్తి లేదని.. రేపు మరో రాష్ట్రంలో ఇలా జరగదని గ్యారెంటీ ఏంటని.. దీనిపై స్పీకర్నే తాము నిలదీస్తామని ప్రేమ్ చంద్రన్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో సీఎం జగన్ చుట్టూ.. రఘురామరాజు వ్యవహారం మరింత బిగిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 6, 2021 2:13 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…