Political News

బెజ‌వాడ టీడీపీ నేత‌ల మ‌ధ్య ‘సీటు’ ర‌గ‌డ‌..

విజ‌య‌వాడ టీడీపీ నేత‌ల మ‌ధ్య రాజ‌కీయాలు ఇంకా దారిలో ప‌డ‌లేదు. ఎంపీ కేశినేని నాని కేంద్రంగా నాయకులు విడిపోయిన విష‌యం తెలిసిందే. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌లెత్తాయ‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ.. దీనికి ముందు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం నుంచే నేత‌ల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఇవి మ‌రింత ముదిరి వీధిన‌ప‌డ్డాయి. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ అభ్య‌ర్థిగా.. కేశినేని త‌న కుమార్తె శ్వేత‌ను ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారిగా ఈ వివాదాలు బ్లాస్ట్ అయ్యాయి.

ఈ క్ర‌మంలోనే పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు జోక్యం చేసుకుని.. అప్ప‌టికి స‌ర్దు బాటు చేశారు. అయితే.. అస‌లు ర‌గ‌డ మాత్రం.. ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దీనికి కార‌ణం.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల నాటికి.. ప‌శ్చిమ నియోజ‌క వ‌ర్గం సీటుపై కేశినేని నాని దృష్టి పెట్ట‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి గ‌త 2019 ఎన్నిక‌ల్లో నే ఇక్క‌డ నుంచి త‌న కుమార్తె శ్వేత‌ను రంగంలోకి దింపాల‌ని భావించారని, కానీ, వైసీపీ నుంచి వ‌చ్చిన జలీల్ ఖాన్‌.. త‌న కుమార్తెకు ముందుగానే రిజ‌ర్వ్ చేయించుకోవ‌డంతో.. కేశినేని ప్ర‌య‌త్నాలు ఆదిలోనే ఆగిపోయాయి.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన జ‌లీల్ కుమార్తె ఖతూన్ ఓట‌మి త‌ర్వాత‌.. అజా లేకుండా పోయారు. దీంతో ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగే నాయ‌కులు లేకుండా పోయారు. ఈ నేప‌థ్యంలోనే ఎంపీ కేశినేని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న కుమార్తెను ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిపాల‌నే వ్యూహం ర‌చిస్తున్నార‌నేది కొన్నాళ్లుగా టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. దీనిని ప‌శ్చిమ‌లో కీల‌క నేత‌లుగా ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా.. వంటివారు వ్య‌తిరేకిస్తున్నారు.

ఇక‌, వీరికి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా తోడ‌య్యారు. దీంతోనే ఎంపీ కేంద్రంగా వివాదం రాజుకుందని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఎంపీగా ఉన్న కేశినేని నాని దూకుడుతో.. చాలా మంది నాయ‌కులు సైలెంట్ అయిపోయార‌ని.. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ కుటుంబం నుంచి ఇద్ద‌రు గెలిస్తే.. మ‌రింత నేత‌ల‌కు ఇబ్బందేన‌ని వీరు భావిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికే కార్పొరేట‌ర్‌గా విజ‌యం ద‌క్కించుకున్న శ్వేత‌.. దూకుడు త‌గ్గించుకుని.. కింది స్థాయి వారికి కూడా ప్రాధాన్యం ఇస్తే.. అప్ప‌టికి కొంత రాజ‌కీయాలు అనుకూలంగా మారే అవ‌కాశం ఉంటుంద‌నే విశ్లేష‌ణ‌లు కూడా ఉన్నాయి.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం.. బెజ‌వాడ నేత‌ల మ‌ధ్య ప‌శ్చిమ సీటు విష‌యం మాత్రం ర‌గ‌డగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై అటు చంద్ర‌బాబు కానీ, నారా లోకేష్ కానీ.. స్పందించ‌క‌పోవ‌డం.. కేశినేని దూకుడుగా ఉండ‌డం వంటివి.. పార్టీకి ఇబ్బందిగా ప‌రిణ‌మించాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. త‌న సీటు త‌న కుటుంబానికే కేటాయించాల‌ని జ‌లీల్ ఖాన్ ప‌ట్టుబ‌డుతున్నారు. మొత్తంగా చూస్తే.. ప‌శ్చిమ సీటు టీడీపీలో వివాదాల‌కు కేంద్రంగా మారింద‌నేది వాస్త‌వం.

This post was last modified on June 6, 2021 7:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ డే – కంటెంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం

టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…

3 hours ago

మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…

4 hours ago

పేర్ని నాని… ఎవరికైనా వార్నింగ్ ఇచ్చేయగలరా?

రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…

5 hours ago

హైదరాబాద్ ‘హై’ వోల్టేజ్ పెర్ఫార్మెన్స్.. కానీ..

ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్‌లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్‌కతాలోని…

7 hours ago

అలా చెప్పుకోవడం కరెక్టేనా సీఎం గారు?

కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…

10 hours ago

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

12 hours ago