Political News

బెజ‌వాడ టీడీపీ నేత‌ల మ‌ధ్య ‘సీటు’ ర‌గ‌డ‌..

విజ‌య‌వాడ టీడీపీ నేత‌ల మ‌ధ్య రాజ‌కీయాలు ఇంకా దారిలో ప‌డ‌లేదు. ఎంపీ కేశినేని నాని కేంద్రంగా నాయకులు విడిపోయిన విష‌యం తెలిసిందే. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌లెత్తాయ‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ.. దీనికి ముందు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం నుంచే నేత‌ల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఇవి మ‌రింత ముదిరి వీధిన‌ప‌డ్డాయి. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ అభ్య‌ర్థిగా.. కేశినేని త‌న కుమార్తె శ్వేత‌ను ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారిగా ఈ వివాదాలు బ్లాస్ట్ అయ్యాయి.

ఈ క్ర‌మంలోనే పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు జోక్యం చేసుకుని.. అప్ప‌టికి స‌ర్దు బాటు చేశారు. అయితే.. అస‌లు ర‌గ‌డ మాత్రం.. ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దీనికి కార‌ణం.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల నాటికి.. ప‌శ్చిమ నియోజ‌క వ‌ర్గం సీటుపై కేశినేని నాని దృష్టి పెట్ట‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి గ‌త 2019 ఎన్నిక‌ల్లో నే ఇక్క‌డ నుంచి త‌న కుమార్తె శ్వేత‌ను రంగంలోకి దింపాల‌ని భావించారని, కానీ, వైసీపీ నుంచి వ‌చ్చిన జలీల్ ఖాన్‌.. త‌న కుమార్తెకు ముందుగానే రిజ‌ర్వ్ చేయించుకోవ‌డంతో.. కేశినేని ప్ర‌య‌త్నాలు ఆదిలోనే ఆగిపోయాయి.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన జ‌లీల్ కుమార్తె ఖతూన్ ఓట‌మి త‌ర్వాత‌.. అజా లేకుండా పోయారు. దీంతో ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగే నాయ‌కులు లేకుండా పోయారు. ఈ నేప‌థ్యంలోనే ఎంపీ కేశినేని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న కుమార్తెను ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలిపాల‌నే వ్యూహం ర‌చిస్తున్నార‌నేది కొన్నాళ్లుగా టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. దీనిని ప‌శ్చిమ‌లో కీల‌క నేత‌లుగా ఉన్న ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా.. వంటివారు వ్య‌తిరేకిస్తున్నారు.

ఇక‌, వీరికి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా తోడ‌య్యారు. దీంతోనే ఎంపీ కేంద్రంగా వివాదం రాజుకుందని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఎంపీగా ఉన్న కేశినేని నాని దూకుడుతో.. చాలా మంది నాయ‌కులు సైలెంట్ అయిపోయార‌ని.. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ కుటుంబం నుంచి ఇద్ద‌రు గెలిస్తే.. మ‌రింత నేత‌ల‌కు ఇబ్బందేన‌ని వీరు భావిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికే కార్పొరేట‌ర్‌గా విజ‌యం ద‌క్కించుకున్న శ్వేత‌.. దూకుడు త‌గ్గించుకుని.. కింది స్థాయి వారికి కూడా ప్రాధాన్యం ఇస్తే.. అప్ప‌టికి కొంత రాజ‌కీయాలు అనుకూలంగా మారే అవ‌కాశం ఉంటుంద‌నే విశ్లేష‌ణ‌లు కూడా ఉన్నాయి.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం.. బెజ‌వాడ నేత‌ల మ‌ధ్య ప‌శ్చిమ సీటు విష‌యం మాత్రం ర‌గ‌డగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై అటు చంద్ర‌బాబు కానీ, నారా లోకేష్ కానీ.. స్పందించ‌క‌పోవ‌డం.. కేశినేని దూకుడుగా ఉండ‌డం వంటివి.. పార్టీకి ఇబ్బందిగా ప‌రిణ‌మించాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. త‌న సీటు త‌న కుటుంబానికే కేటాయించాల‌ని జ‌లీల్ ఖాన్ ప‌ట్టుబ‌డుతున్నారు. మొత్తంగా చూస్తే.. ప‌శ్చిమ సీటు టీడీపీలో వివాదాల‌కు కేంద్రంగా మారింద‌నేది వాస్త‌వం.

This post was last modified on June 6, 2021 7:21 am

Share

Recent Posts

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

30 seconds ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

13 minutes ago

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

17 minutes ago

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

37 minutes ago

చిరంజీవి గారూ… వీళ్ల‌ను ఆపాలి మీరు

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ హీరోగా నిల‌వ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…

59 minutes ago

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

2 hours ago