Political News

జగన్‌ పై ఎంపీలు దండెత్తబోతున్నారా?

ఏడాది నుంచి అదే పనిగా తనను, తన ప్రభుత్వాన్ని, అలాగే తన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వచ్చిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆయన పుట్టిన రోజు నాడే అరెస్టు చేయించడం ద్వారా ఆయనకు గట్టి ఝలక్ ఇచ్చాననుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరెస్టుతో సరిపెట్టుకుండా కస్టడీలో ఉన్నపుడు రఘురామను పోలీసులు హింసించినట్లుగా ఆర్మీ ఆసుపత్రిలో నిర్ధారణ కావడం, దీనిపై ముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్య కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా తేలడంతో జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పేలా లేవు.

రఘురామ మీదికి సీఐడీని ఉసిగొల్పితే ఆయన నోరు మూతపడుతుందని అనుకున్నారు కానీ.. అలా జరక్కపోగా జగన్ సర్కారును రఘురామ మరింతగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక ఎంపీని పుట్టిన రోజు నాడు అరెస్టు చేయడం, ఆయన పై భౌతిక దాడి జరిగినట్లు సుప్రీం కోర్టే నిర్ణయించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

రఘురామ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా లేరు. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా రెండు రోజుల కిందటే ఆయన దేశంలోని సహచర ఎంపీలందరికీ తనకు జరిగిన అన్యాయంపై లేఖ రాశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ విమర్శలు చేసినందుకు తన పై ఎలా కక్ష గట్టి పుట్టిన రోజు నాడు అరెస్టు చేయించారో, తనను ఎలా హింసించారో అందులో వివరించారు. గత రెండేళ్లలో జగన్ సర్కారుకు 150 సార్లు కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. తనపై రాజద్రోహం కింద కేసులు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ.. రేప్పొద్దున ఏ ఎంపీకైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తవచ్చని, కాబట్టి సహచర సభ్యులు ఇలాంటి విషయాలను ఖండించాలని కోరారు.

ఆయన లేఖపై వరుసగా ఎంపీలు ఒక్కొక్కరు స్పందిస్తుండటం గమనార్హం. ఒకప్పటి టాలీవుడ్ కథానాయిక, ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సుమలత అంబరీష్ ముందుగా ఈ లేఖ స్పందించారు. జగన్ ప్రభుత్వ తీరును ఖండించారు. ఒక ఎంపీ పట్ల ఇలా వ్యవహరించడం షాక్‌కు గురి చేసిందన్నారు. తన పూర్తి మద్దతు రఘురామకు ఉందని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే ఏపీ పోలీసులు, ప్రభుత్వం ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బ తింటుందని హెచ్చరించారు.

అలాగే మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం రఘురామ లేఖ ప్రతిని జత చేస్తూ ట్వీట్ వేశారు. జగన్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రఘురామకు మద్దతు పలికారు. ఇలా మరికొందరు ఎంపీలు గళం విప్పి, ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తితే జగన్ సర్కారుకు తీవ్ర ఇబ్బందిరక పరిస్థితులు తలెత్తడం ఖాయం.

This post was last modified on June 5, 2021 2:24 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

9 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

10 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

13 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

13 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

14 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

14 hours ago