Political News

జగన్‌ పై ఎంపీలు దండెత్తబోతున్నారా?

ఏడాది నుంచి అదే పనిగా తనను, తన ప్రభుత్వాన్ని, అలాగే తన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వచ్చిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆయన పుట్టిన రోజు నాడే అరెస్టు చేయించడం ద్వారా ఆయనకు గట్టి ఝలక్ ఇచ్చాననుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరెస్టుతో సరిపెట్టుకుండా కస్టడీలో ఉన్నపుడు రఘురామను పోలీసులు హింసించినట్లుగా ఆర్మీ ఆసుపత్రిలో నిర్ధారణ కావడం, దీనిపై ముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్య కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా తేలడంతో జగన్ సర్కారుకు ఇబ్బందులు తప్పేలా లేవు.

రఘురామ మీదికి సీఐడీని ఉసిగొల్పితే ఆయన నోరు మూతపడుతుందని అనుకున్నారు కానీ.. అలా జరక్కపోగా జగన్ సర్కారును రఘురామ మరింతగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక ఎంపీని పుట్టిన రోజు నాడు అరెస్టు చేయడం, ఆయన పై భౌతిక దాడి జరిగినట్లు సుప్రీం కోర్టే నిర్ణయించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

రఘురామ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా లేరు. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా రెండు రోజుల కిందటే ఆయన దేశంలోని సహచర ఎంపీలందరికీ తనకు జరిగిన అన్యాయంపై లేఖ రాశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ విమర్శలు చేసినందుకు తన పై ఎలా కక్ష గట్టి పుట్టిన రోజు నాడు అరెస్టు చేయించారో, తనను ఎలా హింసించారో అందులో వివరించారు. గత రెండేళ్లలో జగన్ సర్కారుకు 150 సార్లు కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. తనపై రాజద్రోహం కింద కేసులు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ.. రేప్పొద్దున ఏ ఎంపీకైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తవచ్చని, కాబట్టి సహచర సభ్యులు ఇలాంటి విషయాలను ఖండించాలని కోరారు.

ఆయన లేఖపై వరుసగా ఎంపీలు ఒక్కొక్కరు స్పందిస్తుండటం గమనార్హం. ఒకప్పటి టాలీవుడ్ కథానాయిక, ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సుమలత అంబరీష్ ముందుగా ఈ లేఖ స్పందించారు. జగన్ ప్రభుత్వ తీరును ఖండించారు. ఒక ఎంపీ పట్ల ఇలా వ్యవహరించడం షాక్‌కు గురి చేసిందన్నారు. తన పూర్తి మద్దతు రఘురామకు ఉందని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే ఏపీ పోలీసులు, ప్రభుత్వం ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బ తింటుందని హెచ్చరించారు.

అలాగే మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం రఘురామ లేఖ ప్రతిని జత చేస్తూ ట్వీట్ వేశారు. జగన్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రఘురామకు మద్దతు పలికారు. ఇలా మరికొందరు ఎంపీలు గళం విప్పి, ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తితే జగన్ సర్కారుకు తీవ్ర ఇబ్బందిరక పరిస్థితులు తలెత్తడం ఖాయం.

This post was last modified on June 5, 2021 2:24 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

54 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago