బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకి భారీ ఆదరణ లభిస్తుంటుంది. ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 15వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈసారి పాల్గొనే కంటెస్టెంట్ లలో నటి రియా చక్రవర్తి కూడా ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న ఈ షో కోసం కొంతమంది సెలబ్రిటీల లిస్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారిలో రియా చక్రవర్తి కూడా ఉన్నారట. బాలీవుడ్ లో నటిగా సినిమాలు చేస్తోన్న సమయంలో సుశాంత్ రాజ్ పుత్ తో ప్రేమ, ఆ తరువాత అతడు సూసైడ్ చేసుకోవడం వంటి విషయాలతో రియా వార్తల్లో నిలిచింది.
సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్త డ్రగ్స్ వ్యవహారానికి దారి తీయడంతో ఈ కేసులో రియాను అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైలులో ఉంచారు. ఆ తరువాత ఆమె బయటకు వచ్చినప్పటికీ.. గతేడాది కాలంగా ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షో కోసం ఆమెని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఆమె గనుక అంగీకరిస్తే ఈసారి షో మరింత రసవత్తరంగా సాగడం ఖాయం. కానీ ఈ విషయంలో రియా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
మరోపక్క రియా టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈమెకి టాలీవుడ్ లో కొంత మంది హీరోలతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో ఇక్కడి వారికి ఫోన్లు చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తుందట. ఇప్పట్లో ఆమెకి బాలీవుడ్ ఆఫర్లు వచ్చే ఛాన్స్ లేదు. అందుకే తెలుగులో ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ఈమె ‘తూనీగ తూనీగ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రియాకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె ముంబైకి వెళ్లిపోయింది.
This post was last modified on June 5, 2021 2:29 pm
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…