బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకి భారీ ఆదరణ లభిస్తుంటుంది. ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 15వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. అయితే ఈసారి పాల్గొనే కంటెస్టెంట్ లలో నటి రియా చక్రవర్తి కూడా ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తోన్న ఈ షో కోసం కొంతమంది సెలబ్రిటీల లిస్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారిలో రియా చక్రవర్తి కూడా ఉన్నారట. బాలీవుడ్ లో నటిగా సినిమాలు చేస్తోన్న సమయంలో సుశాంత్ రాజ్ పుత్ తో ప్రేమ, ఆ తరువాత అతడు సూసైడ్ చేసుకోవడం వంటి విషయాలతో రియా వార్తల్లో నిలిచింది.
సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్త డ్రగ్స్ వ్యవహారానికి దారి తీయడంతో ఈ కేసులో రియాను అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైలులో ఉంచారు. ఆ తరువాత ఆమె బయటకు వచ్చినప్పటికీ.. గతేడాది కాలంగా ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షో కోసం ఆమెని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఆమె గనుక అంగీకరిస్తే ఈసారి షో మరింత రసవత్తరంగా సాగడం ఖాయం. కానీ ఈ విషయంలో రియా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
మరోపక్క రియా టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈమెకి టాలీవుడ్ లో కొంత మంది హీరోలతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో ఇక్కడి వారికి ఫోన్లు చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తుందట. ఇప్పట్లో ఆమెకి బాలీవుడ్ ఆఫర్లు వచ్చే ఛాన్స్ లేదు. అందుకే తెలుగులో ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో ఈమె ‘తూనీగ తూనీగ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రియాకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో ఆమె ముంబైకి వెళ్లిపోయింది.
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…