మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. దాదాపు టీఆర్ఎస్ తో ఆయనకు 19ఏళ్ల అనుబంధం. ఆ అనుబంధానికి ఈ రోజుతో తిలోదకాలు పలికారు. కాగా.. గత కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది.
అయితే ఏనాడు ఆయన ఈ విషయంపై స్పందించింది లేదు. కాగా.. తాజాగా.. తాను బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. వారం రోజుల్లో ఢిల్లీలో బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు.
తనది కమ్యూనిస్టు డీఎన్ఏ అయినప్పటికీ… ప్రజల ఒత్తిడి మేరకే బీజేపీలోకి వెళ్తున్నానని, కమ్యూనిస్టులంతా కేసీఆర్ మార్గనిర్దేశంలో పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వ్యవస్థతో ఒక వ్యక్తి పోటీ పడగలడా…? అందుకే నా పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.
అయితే, బీజేపీతో టీఆర్ఎస్ సంబంధాలు… భవిష్యత్ పొత్తులు అవసరం అయితే తమలాంటి నాయకుల పరిస్థితి ఏంటీ అన్న విషయాలపై పార్టీ పెద్దలతో చర్చించానని ఈటల తెలిపారు. హుజురాబాద్ లో తన వర్గం వారిని లోబరుచుకునేందుకు టీఆర్ఎస్ ఇప్పటికే 50కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలను నమ్ముకున్న బిడ్డగా వారి ముందుకే వెళ్తున్నానని, ఎన్నో కఠిన సమయాల్లో అండగా నిలిచిన వారు ఇప్పుడు కూడా తన వైపు ఉంటారని నమ్మకం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…