కరోనా కలకలం నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన లాక్డౌన్-3.0 ఆదివారంతో పూర్తి కానుండటంతో సోమవారం నుండి లాక్డౌన్ కొనసాగిస్తారా లేక సడలిస్తారా అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈనెల 11న ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు.
అయితే, మెజార్టీ రాష్ట్రాలు లాక్డౌన్ కొనసాగింపును సమర్ధిస్తూనే కేంద్రం రాష్ట్రాలకు అవసరమైన ఆర్ధిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలపై ఉత్కంఠ నెలకొంది.
వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, నాలుగో విడుత లాక్డౌన్లో మరిన్ని ఆంక్షలను సడలించనున్నారు. గ్రీన్జోన్లలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంది. ఆరెంజ్ జోన్లలో పరిమిత స్థాయిలో, కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలను అమలుచేయనున్నారు.
రైల్వే, దేశీయ విమాన రాకపోకలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు కేంద్ర అధికారి ఒకరు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా విద్యాసంస్థలు, మాల్స్, సినిమా హాళ్లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా రెడ్జోన్లలోనూ క్షౌరశాలలు, ఆప్టికల్ దుకాణాలను తెరువనున్నట్లు చెప్పారు.
ఇదిలాఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ను ఈనెలాఖరు వరకూ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదే అంశంపై శనివారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సందర్భంగా సాధారణ కార్యకలాపాలకు ఎస్ఓపీ తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఏపీలో లాక్డౌన్ 4.0 సడలింపులతో ఉండబోతుందని ఒక సంకేతాన్ని పంపారు. కంటైన్ మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్లలోనూ సాధారణ కార్యకలాపాలు నిర్వహించేందుకు రాష్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
This post was last modified on May 17, 2020 10:54 am
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…