Political News

లాక్ డౌన్ 4.0..ఇవే కొత్త రూల్స్‌

కరోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌-3.0 ఆదివారంతో పూర్తి కానుండటంతో సోమవారం నుండి లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా లేక సడలిస్తారా అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈనెల 11న ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించారు.

అయితే, మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ కొనసాగింపును సమర్ధిస్తూనే కేంద్రం రాష్ట్రాలకు అవసరమైన ఆర్ధిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ నేప‌థ్యంలో కొత్త నిబంధ‌న‌ల‌పై ఉత్కంఠ నెల‌కొంది.

వివిధ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం, నాలుగో విడుత లాక్‌డౌన్‌లో మరిన్ని ఆంక్షలను సడలించనున్నారు. గ్రీన్‌జోన్లలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంది. ఆరెంజ్‌ జోన్లలో పరిమిత స్థాయిలో, కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం కఠిన ఆంక్షలను అమలుచేయనున్నారు.

రైల్వే, దేశీయ విమాన రాకపోకలను దశలవారీగా ప్రారంభించనున్నట్లు కేంద్ర అధికారి ఒకరు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా విద్యాసంస్థలు, మాల్స్‌, సినిమా హాళ్లను తెరిచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అయితే కంటైన్మెంట్‌ ప్రాంతాలు మినహా రెడ్‌జోన్లలోనూ క్షౌరశాలలు, ఆప్టికల్‌ దుకాణాలను తెరువనున్నట్లు చెప్పారు.

ఇదిలాఉండ‌గా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఈనెలాఖరు వరకూ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదే అంశంపై శనివారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ నిర్వహించిన సమీక్ష సందర్భంగా సాధారణ కార్యకలాపాలకు ఎస్ఓపీ తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఏపీలో లాక్‌డౌన్‌ 4.0 సడలింపులతో ఉండబోతుందని ఒక సంకేతాన్ని పంపారు. కంటైన్‌ మెంట్‌ జోన్లు మినహా మిగిలిన అన్ని జోన్లలోనూ సాధారణ కార్యకలాపాలు నిర్వహించేందుకు రాష్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

This post was last modified on May 17, 2020 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘జంపింగ్’లపై మల్లారెడ్డి మాటలు విన్నారా?

చామకూర మల్లారెడ్డి... నిత్యం వార్తల్లో ఉండే రాజకీయ నాయకుడు. పూలమ్మాను, పాలమ్మాను అంటూనే విద్యావేత్తగా మారిపోయిన మల్లారెడ్డి... ఆ తర్వాత…

2 hours ago

మహేష్ బాబు సినిమా గురించి వరదరాజ మన్నార్

ఎక్కడ ఏ రాష్ట్రంలో షూటింగ్ చేసినా అదో పెద్ద సంచలనంగా మారిపోయిన ఎస్ఎస్ఎంబి 29 గురించి రాజమౌళి ఇప్పటిదాకా అధికారికంగా…

2 hours ago

సిసలైన రాజకీయం మొదలెట్టిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఈ…

2 hours ago

RC 16 నిర్ణయం వెనుక అసలు కహాని

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చి…

3 hours ago

ఐపాక్ సేవలకు వైసీపీ గుడ్ బై చెప్పేసిందా?

ఏపీలో విపక్షం వెనుక ఓ పక్కా ప్రణాళికతో వేసే ప్రతి అడుగును ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ వేయించే…

3 hours ago

దగ్గుబాటి రానా ఇండో అమెరికన్ సినిమా

హీరోగా విలన్ గా తెరమీద కనిపించడం బాగా తగ్గించేసిన దగ్గుబాటి రానా తండ్రి సురేష్ బాబు బాటలోనే ప్రొడక్షన్ ని…

4 hours ago