Political News

జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసేలా రఘురామ తాజా ప్లానింగ్

మెరుగైన వైద్యం కోసం.. అందునా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందేందుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి దేశ రాజధానికి వెళ్లిన నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఇప్పుడో అర్థం కాని ప్రశ్నగా మారారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ ఎంతన్నది పక్కన పెడితే.. తనను అరెస్టు చేసి.. జైలుకు పంపే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలకు బదులు తీర్చుకోవాలని మహా పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇందులో భాగంగా బీజేపీ పెద్దల్ని కలుస్తున్న ఆయన.. రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కావటం.. ఆయన చెప్పేదంతా సావధానంగా వినటం తెలిసిందే. అనంతరం గుంటూరు రూరల్ ఎస్పీ అమ్మిరెడ్డికి స్థానచలనం అనుకోకుండా జరిగిందని అనుకోలేం. అయ్యగారికి మాంచి పోస్టింగ్ వేస్తారన్న వాదనలకు బదులుగా.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయటం చాలామందికి జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ ఉదంతానికి రఘురామకు ఏమైనా లింకు ఉందా? అంటే ఓపెన్ గా ఎవరూ అవునని చెప్పలేని పరిస్థితి.

జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన రఘురామ తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవటం.. ఆయనతో అరగంటకు పైనే మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆయన చెప్పిందంతా లోక్ సభ స్పీకర్ సావధానంగా విన్నట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా రఘురామ ఒక విన్నపాన్ని ఆయన ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు. వచ్చే లోక్ సభ సమావేశం తొలి రోజున తన కేసుపై మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని రఘురామ కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.

ఒకవేళ అదే జరిగితే.. జాతీయ స్థాయిలో రఘురామ వ్యవహరం చర్చకు రావటమే కాదు.. తాను టార్గెట్ చేసిన వ్యక్తుల్ని మరింత ఇరుకున పెట్టాలన్నదే ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు. సాధారణంగా ఒక ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకొని.. విచారణలో భాగంగా కొట్టారన్న మాటకు కనెక్టు కావటం ఖాయం. ఇదంతా చూస్తే.. జగన్ ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు రఘురామ భారీ ప్లానింగ్ చేస్తున్నట్లుగా కనిపించక మానదు. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on June 3, 2021 2:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

1 hour ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

4 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

5 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

6 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

7 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

8 hours ago