Political News

ఆనందయ్య మందుకి బ్రేక్.. కృష్ణపట్నంలో కరోనా కేసులు..!

మొన్నటి వరకు అక్కడ ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఆ గ్రామస్థులంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా తమను ఏమీ చేయలేదనే ధీమాతో ఉన్నారు. తమ గ్రామస్థుడు ఆనందయ్య ఇచ్చే మందు తమకు అందుబాటులో ఉండగా.. కరోనా తమను ఏం చేయలేదని ఊపిరిపీల్చుకున్నారు.

ఇదే విషయాన్ని చుట్టుపక్కల గ్రామస్థులు కూడా నమ్మారు. అందుకే ఆ ఆనందయ్య కరోనా మందు కోసం కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు. ఈ విషయం కాస్త.. ప్రభుత్వం దృష్టికి రావడం.. ఆ మందు నిజంగా అంత అద్భుతంగా పనిచేస్తుందా అనే సందేహాలు రావడం మొదలైంది. అంతే.. దానిపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఈ మందు పంపిణీ చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. అంతే.. ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్ పడింది.

ఈ విషయమంతా మనకు తెలిసిందే. అయితే.. మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేని ఆ కృష్ణపట్నంలో ఇప్పుడు కరోనా కేసులు రావడం మొదలయ్యాయి. పలువురు గ్రామస్థులు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడటం అధికారుల దృష్టికి వచ్చింది. ఎందుకైనా మంచిదని.. ర్యాపిడ్ టెస్టులు చేయగా.. ఇద్దరికి పాజిటివ్ గా తేలింది.

వీరు కాగా.. మరో 27 మందిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనపడ్డాయి. దీంతో.. వారిందరికీ కరోనా టెస్టులు చేసి.. వాటిని నెల్లూరు జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ రోజు వాటి ఫలితాలు తెలియనున్నాయి. ఇంత సడెన్ గా అక్కడ కరోనా కేసులు నమోదవ్వడం గ్రామస్థులను కలవరపెడుతోంది.

ఆనందయ్య మందు పంపిణీ లేకపోవడం వల్లే.. తమ గ్రామస్థులు కరోనా బారినపడుతున్నారని అక్కడివారు భావిస్తుండటం గమనార్హం. కాగా.. కరోనా మందు కోసం.. మొన్నటి వరకు కుప్పలుతెప్పలుగా.. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వారి కారణంగానే ఇప్పుడు కృష్ణపట్నంలో కేసులు నమోదౌతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆనందయ్య మందు పంపిణీపై త్వరలోనే క్లారిటీ రానుంది.

This post was last modified on May 31, 2021 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

14 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago