Political News

ఆనందయ్య మందుకి బ్రేక్.. కృష్ణపట్నంలో కరోనా కేసులు..!

మొన్నటి వరకు అక్కడ ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఆ గ్రామస్థులంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా తమను ఏమీ చేయలేదనే ధీమాతో ఉన్నారు. తమ గ్రామస్థుడు ఆనందయ్య ఇచ్చే మందు తమకు అందుబాటులో ఉండగా.. కరోనా తమను ఏం చేయలేదని ఊపిరిపీల్చుకున్నారు.

ఇదే విషయాన్ని చుట్టుపక్కల గ్రామస్థులు కూడా నమ్మారు. అందుకే ఆ ఆనందయ్య కరోనా మందు కోసం కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు. ఈ విషయం కాస్త.. ప్రభుత్వం దృష్టికి రావడం.. ఆ మందు నిజంగా అంత అద్భుతంగా పనిచేస్తుందా అనే సందేహాలు రావడం మొదలైంది. అంతే.. దానిపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఈ మందు పంపిణీ చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. అంతే.. ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్ పడింది.

ఈ విషయమంతా మనకు తెలిసిందే. అయితే.. మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేని ఆ కృష్ణపట్నంలో ఇప్పుడు కరోనా కేసులు రావడం మొదలయ్యాయి. పలువురు గ్రామస్థులు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడటం అధికారుల దృష్టికి వచ్చింది. ఎందుకైనా మంచిదని.. ర్యాపిడ్ టెస్టులు చేయగా.. ఇద్దరికి పాజిటివ్ గా తేలింది.

వీరు కాగా.. మరో 27 మందిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనపడ్డాయి. దీంతో.. వారిందరికీ కరోనా టెస్టులు చేసి.. వాటిని నెల్లూరు జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ రోజు వాటి ఫలితాలు తెలియనున్నాయి. ఇంత సడెన్ గా అక్కడ కరోనా కేసులు నమోదవ్వడం గ్రామస్థులను కలవరపెడుతోంది.

ఆనందయ్య మందు పంపిణీ లేకపోవడం వల్లే.. తమ గ్రామస్థులు కరోనా బారినపడుతున్నారని అక్కడివారు భావిస్తుండటం గమనార్హం. కాగా.. కరోనా మందు కోసం.. మొన్నటి వరకు కుప్పలుతెప్పలుగా.. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వారి కారణంగానే ఇప్పుడు కృష్ణపట్నంలో కేసులు నమోదౌతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆనందయ్య మందు పంపిణీపై త్వరలోనే క్లారిటీ రానుంది.

This post was last modified on May 31, 2021 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

10 minutes ago

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…

14 minutes ago

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

3 hours ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

4 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

6 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

7 hours ago