గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. అయితే అంతటి సునామీలో కూడా వైసీపీ తరుపున కొందరు ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్ధులు బలంగా ఉండటం వల్ల కొన్నిచోట్ల వైసీపీకి విజయం దక్కలేదు. అలా టీడీపీ చేతిలో ఓటమి పాలైన నాయకుల్లో మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా ఒకరు.
గుంటూరు ఎంపీగా మోదుగుల పోటీ చేసి, గల్లా జయదేవ్ చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయాక మోదుగుల పెద్దగా పోలిటికల్ స్క్రీన్పై కనిపించడం లేదు. అలాగే వైసీపీలో ఆయనకు కీలక పదవులంటివి ఏమి రాలేదు. దీంతో మోదుగుల సైలెంట్గా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో మోదుగుల టీడీపీలో కీలకంగా పనిచేశారు. 2009లో నరసారావుపేట ఎంపీగా గెలవగా, 2014 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి, ఆ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి మోదుగుల పార్టీలో దూకుడుగా ఉండటం లేదు. అసలు మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. తనకు ఎలాంటి పదవి రాకపోవడంతోనే మోదుగుల సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మోదుగుల బావ అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ దక్కింది. ఆయన మరో బావ ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ మోదుగుల విషయంలో జగన్ ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని తెలుస్తోంది.
అయితే ఈమధ్య పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో మోదుగుల కాస్త యాక్టివ్గానే ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో వైసీపీ మంచి విజయాలే సాధించింది. అటు గుంటూరు కార్పొరేషన్ వైసీపీ ఖాతాలోనే పడింది. ఇక ఈ ఫలితాలని బట్టి చూస్తే గుంటూరు పార్లమెంట్లో మోదుగులకు మంచి ఛాన్స్ వచ్చినట్లే కనిపిస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మోదుగుల గుంటూరు నుంచే బరిలో దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఎన్నికల్లోపు మోదుగులకు ఏదైనా సెట్ చేస్తారా ? లేదా ? వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదుగుల ఎంపీగానే లక్ పరీక్షించుకోవాలా ? అన్నది చూడాలి.
This post was last modified on May 29, 2021 11:12 pm
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…