Political News

ఎన్టీయార్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్లు

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వారిలో కొందరు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా తో చనిపోతున్న వారిలో ఆక్సిజన్ అందక చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. దాంతో రోగుల్లో అత్యధికులు ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు + ఆక్సిజన్ దొరక్క అవస్థలు పడుతున్న రోగులు చివరకు అంబులెన్సులోనే అడ్జస్టు అవుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి.

ఇలాంటి నేపధ్యంలోనే ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ తరపున రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ట్రస్టు డిసైడ్ చేసింది. అయితే ట్రస్టు ఏర్పాటు చేయబోయే ఆక్సిజన్ ప్లాంట్లు తమ పార్టీ ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఏర్పాటు చేయబోతున్నారట. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, గుంటూరు జిల్లాలోని రేపల్లె, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్లాంట్ల ఏర్పాటు జరుగుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని రోగులందరికీ అవసరమైన ఆక్సిజన్ సరఫరా కావటంలేదు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎప్పటినుండో మూతపడున్న ఫ్యాక్టరీల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం తెరిపిస్తున్నది. అలాగే విశాఖపట్నంలోని స్టీల్ ఫ్యాక్టరీ నుండి 100 టన్నుల ఆక్సిజన్ అందుతున్నది.

ఇదికాకుండా అనేక జిల్లాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా ఆక్సిజన్ ప్లాంట్ల ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్లను ఎన్ని ఏర్పాటు చేస్తున్నా పెరిగిపోతున్న డిమాండ్ కు తగ్గట్లు ఆక్సిజన్ ఉత్పత్తి అవటంలేదన్నది వాస్తవం. ఇలాంటి నేపధ్యంలోనే ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నాలుగు ప్లాంట్లు, సోనూసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు, నెల్లూరులో రెండు ప్లాంట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి (సీఎస్ఆర్) పద్దతిలో మరిన్ని కంపెనీలు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తే మంచిదేగా.

This post was last modified on May 27, 2021 3:32 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

25 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

38 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

49 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago