Political News

ఎన్టీయార్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్లు

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వారిలో కొందరు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా తో చనిపోతున్న వారిలో ఆక్సిజన్ అందక చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. దాంతో రోగుల్లో అత్యధికులు ఆక్సిజన్ కోసం అల్లాడిపోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు + ఆక్సిజన్ దొరక్క అవస్థలు పడుతున్న రోగులు చివరకు అంబులెన్సులోనే అడ్జస్టు అవుతున్న ఘటనలు చాలానే ఉన్నాయి.

ఇలాంటి నేపధ్యంలోనే ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ తరపున రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ట్రస్టు డిసైడ్ చేసింది. అయితే ట్రస్టు ఏర్పాటు చేయబోయే ఆక్సిజన్ ప్లాంట్లు తమ పార్టీ ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఏర్పాటు చేయబోతున్నారట. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, గుంటూరు జిల్లాలోని రేపల్లె, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్లాంట్ల ఏర్పాటు జరుగుతోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని రోగులందరికీ అవసరమైన ఆక్సిజన్ సరఫరా కావటంలేదు. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎప్పటినుండో మూతపడున్న ఫ్యాక్టరీల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం తెరిపిస్తున్నది. అలాగే విశాఖపట్నంలోని స్టీల్ ఫ్యాక్టరీ నుండి 100 టన్నుల ఆక్సిజన్ అందుతున్నది.

ఇదికాకుండా అనేక జిల్లాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా ఆక్సిజన్ ప్లాంట్ల ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్లను ఎన్ని ఏర్పాటు చేస్తున్నా పెరిగిపోతున్న డిమాండ్ కు తగ్గట్లు ఆక్సిజన్ ఉత్పత్తి అవటంలేదన్నది వాస్తవం. ఇలాంటి నేపధ్యంలోనే ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నాలుగు ప్లాంట్లు, సోనూసూద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు, నెల్లూరులో రెండు ప్లాంట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి (సీఎస్ఆర్) పద్దతిలో మరిన్ని కంపెనీలు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తే మంచిదేగా.

This post was last modified on May 27, 2021 3:32 pm

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

18 minutes ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

1 hour ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

2 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

2 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

6 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

13 hours ago