Political News

బెజ‌వాడ వైసీపీకి ల‌క్ చిక్కుతోందే ?


బెజ‌వాడ వైసీపీలో ప‌రిణామాలు క‌లిసి వ‌స్తున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. విజ‌య‌వాడ‌లోని మూడు ప్ర‌ధాన నియోజ‌క‌వ‌ర్గాలు.. తూర్పు, ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండేళ్ల‌లో ఊహించ‌ని విధంగా పుంజుకుంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌న్‌సైడ్‌గా విజ‌యం సాధించింది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోను, సెంట్ర‌ల్లోనూ వైసీపీ విజయం ద‌క్కించుకోగా.. తూర్పులో మాత్రం టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఇప్పుడు తూర్పు స‌హా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

సెంట్ర‌ల్ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇక్క‌డ నిన్న మొన్న‌టి వ‌ర‌కు యాక్టివ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. ఇటీవ‌ల కార్పొరేషన్ ఎన్నిక‌ల స‌య‌మంలో పార్టీలో త‌లెత్తిన స‌మ‌స్యల కార‌ణంగా.. ఆయ‌న సైలెంట్ అయ్యారు. దీంతో సెంట్ర‌ల్‌లో టీడీపీ జెండా మోసే నాయకుడు క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు అస‌లు.. ఆయ‌న పార్టీలో ఉన్నారో.. లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. టీడీపీపై న‌మ్మ‌కం లేని ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ పుంజుకుంటే అప్పుడు చూసుకోవ‌చ్చులే అన్న‌ట్టుగా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు మ‌రింత‌గా రూట్ క్లియ‌ర్ అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, వెస్ట్‌లో టీడీపీకి ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ఉన్నారు. వీరు కూడా యాక్టివ్‌గా లేక పోవ‌డం.. అస‌లు ఎంపీ వైపు రాజ‌కీయాలు చేయాలా? లేక సొంత‌గా రాజ‌కీయాలు చేయాలా ? అనే డోలాయ‌మానంలో ఉన్నారు. ఇక్క‌డ ఎంపీ గ్రూపు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గ్రూపు, నాగుల్‌మీరా, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్‌ గ్రూపు ఉన్నాయి. అస‌లు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా గ్రూపుల్లో కొట్టుకోవ‌డం త‌ప్పా చేసేదేం లేదు.
ఇదిలావుంటే.. మ‌రో వైపు.. తూర్పులో టీడీపీ పాగా వేసినా.. జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని గ‌ద్దె రామ్మోహ‌న్‌ నిలిచి గెలిచినా.. పార్టీ త‌ర‌ఫున ఎలాంటి యాక్టివ్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం లేదు. దీంతో వైసీపీ త‌ర‌ఫున యువ నాయ‌కుడు.. దేవినేని అవినాష్ దూకుడుగా ఉన్నారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వైసీపీ ఖాతాలో మెజార్టీ డివిజ‌న్లు గెలిపించి దేవినేని స‌త్తా చాటుకున్నారు.

గ‌ద్దెను టార్గెట్ చేయ‌డ‌మే ధ్యేయంగా వైసీపీ అధిష్టానం తూర్పులో అవినాష్‌ను ఓ రేంజ్‌లో ఎంక‌రేజ్ చేస్తోంది. దీంతో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ టీడీపీకి శ్రేణులు ఉండి కూడా చిన్న‌పాటి స‌మ‌స్య‌ల కార‌ణంగా.. పార్టీ పుంజుకోవ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే వైసీపీ నేత‌ల‌కు అందివ‌చ్చిన వ‌రంగా మారింది. మ‌రి ఈ ప‌రిణామాలు మ‌రికొన్నాళ్లు ఇలానే ఉంటే.. టీడీపీ బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలే ఎక్కువుగా ఉన్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు స‌మ‌స్య‌ల‌ను, పంతాల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి బెజ‌వాడ తెలుగు త‌మ్ముళ్లు ఏం చేస్తారో ? చూడాలి.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

3 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

11 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago