Political News

గంభీర్ ఉచిత మందులు.. కోర్టు అక్షింతలు

లాక్ డౌన్ వేళ ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రజలకు సాయం చేస్తున్నారు. సోనూ సూద్ స్ఫూర్తితో ఎంతోమంది సెలబ్రెటీలు తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మాజీ క్రికెటర్, ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ సైతం ఢిల్లీలో తన పేరిట నెలకొల్పిన ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నాడు. అత్యవసర స్థితిలో ఉన్న కొవిడ్ రోగులకు అతను మందులను ఉచితంగా సరఫరా చేస్తుండటం విశేషం.

ఐతే అతను చేస్తున్న పనిని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టడం గమనార్హం. గంభీర్ సమాజానికి అపకారం చేస్తున్నాడంటూ అతడి మీద కోర్టు మండిపడింది. ఇందుక్కారణం.. మార్కెట్లో అందుబాటులో ఉన్న మందుల్లో పెద్ద ఎత్తున గంభీర్ కొనేయడమే. కొవిడ్ చికిత్సలో కీలకంగా ఉంటున్న ఫాబీ ఫ్లూ మందులకు ఢిల్లీలో బాగా కొరత ఏర్పడింది. ఐతే గంభీర్ ఏకంగా 2,345 స్క్రిప్టుల ఫాబీ ఫ్లూ మందులను కొని స్టాక్ పెట్టేశాడు.

తనను సంప్రదించిన వాళ్లకు గంభీర్ ఉచితంగానే ఫాబీ ఫ్లూ మందులను సరఫరా చేస్తున్నప్పటికీ.. అందరూ అతణ్ని చేరుకునే పరిస్థితి ఉండదన్నది వాస్తవం. ఈ విషయమై ఎవరో కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు గంభీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. దాని వల్ల సమాజానికి నష్టం కలుగుతోందని.. మార్కెట్లో ఔషదాల కొరత ఏర్పడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది.

బయట మార్కెట్లో తీవ్ర కొరత ఉన్న మందులను అంత భారీ సంఖ్యలో ఎలా కొనుగోలు చేశాడో విచారణ జరపాలని హైకోర్టు.. ఢిల్లీ ఔషధ నియంత్రణ సంస్థ అధికారిని ఆదేశించడం గమనార్హం. ఈ సంగతలా ఉంచితే కొవిడ్ సమయంలో గంభీర్ చేస్తున్న సేవ మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. మందులు, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు బాధితులకు అవసరమైన వాటిని అతను ఉచితంగా అందజేస్తున్నాడు.

This post was last modified on May 25, 2021 3:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

41 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago