Political News

మోడి ఫెయిల్యూర్ ను దాచిపెడుతున్నారా ?

కరోనా వైరస్ నియంత్రణలో నరేంద్రమోడి ఫెయిల్యూర్ ను బీజేపీ నేతలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. కోవిడ్ నియంత్రణ, రోగులకు వైద్యం అందించే విషయంలో రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసిందంటు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నిజానికి కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వాలు విఫలమైందంటే ముందు తప్పు పట్టాల్సింది నరేంద్రమోడినే. మోడి బాధ్యతారాహిత్యం కారణంగా దేశంలో రెండో దశ తీవ్రత ఇంతస్ధాయిలో పెరిగిపోయింది.

దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభం ఈ స్ధాయిలో ఉందంటే మోడినే కారణమని అంతర్జాతీయ మీడియాతో పాటు దేశంలోని అనేక రంగాల్లోని ప్రముఖులు మోడిపై ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు మోడినే తప్పుపడుతు అనేక ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి-మార్చిలోనే సెకెండ్ వేవ్ తీవ్రతపై తాము హెచ్చరించినా మోడి పట్టించుకోలేదని బహిరంగంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

టీకాల ఉత్పత్తి, సరఫరా, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా తదితరాలపై మోడి ఘోరంగా విఫలమైన కారణంగానే దేశంలో ఇపుడీ పరిస్ధితులు దాపురించాయని అందరు ధ్వజమెత్తుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళా నిర్వహణే కొంపముంచినట్లు అందరు డైరెక్టుగా చెబుతున్నారు. అన్నీవైపుల నుండి తనపై మొదలైన దాడులను తట్టుకోలేక చివరకు మోడి కూడా జనాలతో ఎక్కడా మాట్లాడటంలేదు. వాస్తవాలు ఇలాగుంటే రాష్ట్రంలో బీజేపీ నేతలు మాత్రం అన్నింటికీ జగన్మోహన్ రెడ్డే కారణమంటున్నారు.

రాష్ట్రస్ధాయిలో జగన్ తప్పులు కూడా ఉండచ్చు. ఆక్సిజన్ ఉత్పత్తికి ప్లాంట్ల ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. ఆక్సిజన్ అవసరాలు ఈ స్ధాయిలో ఉంటుందని అంచనా వేయకపోవటం ప్రభుత్వ తప్పిదంగానే భావించాలి. మూతపడిపోయిన ప్లాంట్లను తెరిపించుంటే బాగుండేది. టీకాల వేసే విషయంలో ప్రైవేటురంగానికి అవకాశం ఇవ్వద్దని జగన్ ప్రధానికి లేఖ రాయటమే బీజేపీ నేతలకు బాగా కోపం వచ్చినట్లుంది.

ప్రభుత్వాధినేతగా అన్నీ విషయాలు ఆలోచించి టీకాల కార్యక్రమం సజావుగా సాగటానికి జగన్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం బీజేపీ నేతలకు లేదు. ఎందుకంటే టీకాలు వేయించటమనేది పాలసీ కార్యక్రమం. కేంద్రంలో నరేంద్రమోడి, రాష్ట్రంలో జగన్ మధ్య జరుగుతున్న వ్యవహరం. మధ్యలో కమలనాదులకు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. టీకాల విషయంలో మోడి నిర్ణయాలు మొదటినుండి అస్తవ్యస్ధంగానే ఉంటున్నాయి. దీంతోనే దేశవ్యాప్తంగా మోడిపై జనాగ్రహం పెరిగిపోతోంది.

This post was last modified on May 24, 2021 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

27 minutes ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

28 minutes ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

1 hour ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

2 hours ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

3 hours ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

4 hours ago