కరోనా వైరస్ నియంత్రణలో నరేంద్రమోడి ఫెయిల్యూర్ ను బీజేపీ నేతలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లే ఉంది. కోవిడ్ నియంత్రణ, రోగులకు వైద్యం అందించే విషయంలో రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేసిందంటు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నిజానికి కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వాలు విఫలమైందంటే ముందు తప్పు పట్టాల్సింది నరేంద్రమోడినే. మోడి బాధ్యతారాహిత్యం కారణంగా దేశంలో రెండో దశ తీవ్రత ఇంతస్ధాయిలో పెరిగిపోయింది.
దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభం ఈ స్ధాయిలో ఉందంటే మోడినే కారణమని అంతర్జాతీయ మీడియాతో పాటు దేశంలోని అనేక రంగాల్లోని ప్రముఖులు మోడిపై ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు మోడినే తప్పుపడుతు అనేక ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి-మార్చిలోనే సెకెండ్ వేవ్ తీవ్రతపై తాము హెచ్చరించినా మోడి పట్టించుకోలేదని బహిరంగంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
టీకాల ఉత్పత్తి, సరఫరా, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా తదితరాలపై మోడి ఘోరంగా విఫలమైన కారణంగానే దేశంలో ఇపుడీ పరిస్ధితులు దాపురించాయని అందరు ధ్వజమెత్తుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళా నిర్వహణే కొంపముంచినట్లు అందరు డైరెక్టుగా చెబుతున్నారు. అన్నీవైపుల నుండి తనపై మొదలైన దాడులను తట్టుకోలేక చివరకు మోడి కూడా జనాలతో ఎక్కడా మాట్లాడటంలేదు. వాస్తవాలు ఇలాగుంటే రాష్ట్రంలో బీజేపీ నేతలు మాత్రం అన్నింటికీ జగన్మోహన్ రెడ్డే కారణమంటున్నారు.
రాష్ట్రస్ధాయిలో జగన్ తప్పులు కూడా ఉండచ్చు. ఆక్సిజన్ ఉత్పత్తికి ప్లాంట్ల ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. ఆక్సిజన్ అవసరాలు ఈ స్ధాయిలో ఉంటుందని అంచనా వేయకపోవటం ప్రభుత్వ తప్పిదంగానే భావించాలి. మూతపడిపోయిన ప్లాంట్లను తెరిపించుంటే బాగుండేది. టీకాల వేసే విషయంలో ప్రైవేటురంగానికి అవకాశం ఇవ్వద్దని జగన్ ప్రధానికి లేఖ రాయటమే బీజేపీ నేతలకు బాగా కోపం వచ్చినట్లుంది.
ప్రభుత్వాధినేతగా అన్నీ విషయాలు ఆలోచించి టీకాల కార్యక్రమం సజావుగా సాగటానికి జగన్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం బీజేపీ నేతలకు లేదు. ఎందుకంటే టీకాలు వేయించటమనేది పాలసీ కార్యక్రమం. కేంద్రంలో నరేంద్రమోడి, రాష్ట్రంలో జగన్ మధ్య జరుగుతున్న వ్యవహరం. మధ్యలో కమలనాదులకు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. టీకాల విషయంలో మోడి నిర్ణయాలు మొదటినుండి అస్తవ్యస్ధంగానే ఉంటున్నాయి. దీంతోనే దేశవ్యాప్తంగా మోడిపై జనాగ్రహం పెరిగిపోతోంది.
This post was last modified on May 24, 2021 2:10 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…