Illustrative picture of coronavirus vaccine under trail
అవును మీరు చదివింది నిజ్జంగా నిజమే. టీకా వేయించుకుంటే బీరు ఉచితమే. కాకపోతే మన దగ్గర కాదు సమా అమెరికాలో. టీకాలు వేయించుకునేందుకు జనాలను ప్రోత్సహించేందుకు అమెరికాలో కొన్ని రాష్ట్రాలో అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ప్రోత్సాహకాలు ఎందుకంటే టీకాలు వేయించుకునేందుకు జనాలు ముందుకు రావటంలేదు కాబట్టే. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా వాస్తవం అయితే ఇదే.
ఇంతకీ విషయం ఏమిటంటే అమెరికా జనాభా 33 కోట్లు. అందరికీ టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేసుకునేందకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. జనాలు కూడా బాగానే స్పందించారు. మొదటి డోసు వేయించుకున్న వారు 16 కోట్లమందున్నారు. అలాగే రెండు డోసులు వేయించుకున్న వారిసంఖ్య 12 కోట్లు. అంటే ఈ లెక్కల ప్రకారం కోవిడ్ టీకాలు వేయించుకున్న వారి సంఖ్య మొత్తం జనాభాలో 50 శాతమని అనుకోవచ్చు.
మొదట్లో టీకాల కార్యక్రమం చాలా జోరుగా జరిగినా తర్వాత ఒక్కసారిగా ఆగిపోయిందట. ప్రభుత్వం, స్వచ్చంద సంస్ధలు ఎంత మొత్తుకుంటున్నా టీకాలు వేయించుకునేందుకు జనాలు అసలు ముందుకే రావటంలేదట. దీనికి కారణం ఏమిటయ్యా అంటే టీకాలు వేయించుకుంటే సెక్సుకు పనికిరారని, పిల్లలు పుట్టరనే ప్రచారం జరగటమే. మరి ఈ ప్రచారం ఎలా మొదలైందో ? ఎవరు మొదలుపెట్టారో ఎవరికీ అర్ధంకావటంలేదు. కానీ ప్రచారమైతే బాగా జరిగిపోయింది.
దీంతో ఒక్కసారిగా టీకాలు వేయించుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ప్రజలందరికీ టీకాలకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్ధలు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలవుతున్నాయి. దాంతో చేసేది లేక చివరి ప్రయత్నంగా తాయిలాలు మొదలుపెట్టాయి. మన దగ్గర ఎన్నికల్లో ఇచ్చే తాయిలాల్లాంటివే ఇపుడు టీకాల కోసం అమెరికాలో ఇస్తున్నారు. టీకాలు వేయించుకుంటే బీర్లు ఉచితమని న్యూజెర్సీలో ప్రచారం మొదలుపెట్టింది.
అలాగే కనెక్టికట్, ఫిలడెల్ఫియా, షికాగో, వెస్ట్ వర్జీనియా, న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లో టీకాలు వేసుకుంటే 50 లక్షల లాటరీ బహుమతి టికెట్లని, ఉద్యోగులకు 200 డాలర్ల ప్రోత్సాహకమని, నిత్యావసర సరుకులని, మెట్రోలో ప్రయాణం వారంపాటు ఉచితమని, డిపార్టుమెంట్ స్టోర్లలో ఎంపిక చేసుకున్న సరుకులు ఉచితమని…ఇలాంటి అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారు. అయినా జనాలు ముందుకు రావటంలేదట.
This post was last modified on May 23, 2021 12:07 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…