Illustrative picture of coronavirus vaccine under trail
అవును మీరు చదివింది నిజ్జంగా నిజమే. టీకా వేయించుకుంటే బీరు ఉచితమే. కాకపోతే మన దగ్గర కాదు సమా అమెరికాలో. టీకాలు వేయించుకునేందుకు జనాలను ప్రోత్సహించేందుకు అమెరికాలో కొన్ని రాష్ట్రాలో అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ప్రోత్సాహకాలు ఎందుకంటే టీకాలు వేయించుకునేందుకు జనాలు ముందుకు రావటంలేదు కాబట్టే. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా వాస్తవం అయితే ఇదే.
ఇంతకీ విషయం ఏమిటంటే అమెరికా జనాభా 33 కోట్లు. అందరికీ టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేసుకునేందకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. జనాలు కూడా బాగానే స్పందించారు. మొదటి డోసు వేయించుకున్న వారు 16 కోట్లమందున్నారు. అలాగే రెండు డోసులు వేయించుకున్న వారిసంఖ్య 12 కోట్లు. అంటే ఈ లెక్కల ప్రకారం కోవిడ్ టీకాలు వేయించుకున్న వారి సంఖ్య మొత్తం జనాభాలో 50 శాతమని అనుకోవచ్చు.
మొదట్లో టీకాల కార్యక్రమం చాలా జోరుగా జరిగినా తర్వాత ఒక్కసారిగా ఆగిపోయిందట. ప్రభుత్వం, స్వచ్చంద సంస్ధలు ఎంత మొత్తుకుంటున్నా టీకాలు వేయించుకునేందుకు జనాలు అసలు ముందుకే రావటంలేదట. దీనికి కారణం ఏమిటయ్యా అంటే టీకాలు వేయించుకుంటే సెక్సుకు పనికిరారని, పిల్లలు పుట్టరనే ప్రచారం జరగటమే. మరి ఈ ప్రచారం ఎలా మొదలైందో ? ఎవరు మొదలుపెట్టారో ఎవరికీ అర్ధంకావటంలేదు. కానీ ప్రచారమైతే బాగా జరిగిపోయింది.
దీంతో ఒక్కసారిగా టీకాలు వేయించుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ప్రజలందరికీ టీకాలకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్ధలు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలవుతున్నాయి. దాంతో చేసేది లేక చివరి ప్రయత్నంగా తాయిలాలు మొదలుపెట్టాయి. మన దగ్గర ఎన్నికల్లో ఇచ్చే తాయిలాల్లాంటివే ఇపుడు టీకాల కోసం అమెరికాలో ఇస్తున్నారు. టీకాలు వేయించుకుంటే బీర్లు ఉచితమని న్యూజెర్సీలో ప్రచారం మొదలుపెట్టింది.
అలాగే కనెక్టికట్, ఫిలడెల్ఫియా, షికాగో, వెస్ట్ వర్జీనియా, న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లో టీకాలు వేసుకుంటే 50 లక్షల లాటరీ బహుమతి టికెట్లని, ఉద్యోగులకు 200 డాలర్ల ప్రోత్సాహకమని, నిత్యావసర సరుకులని, మెట్రోలో ప్రయాణం వారంపాటు ఉచితమని, డిపార్టుమెంట్ స్టోర్లలో ఎంపిక చేసుకున్న సరుకులు ఉచితమని…ఇలాంటి అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారు. అయినా జనాలు ముందుకు రావటంలేదట.
This post was last modified on May 23, 2021 12:07 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…