ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ స్పీడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మిన్ను విరిగి మీద పడినప్పటికి తనదైన స్టైల్ లోనే ఉంటారు తప్పించి.. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే విషయంలో కేసీఆర్ నిశ్చితాభిప్రాయాలు కొన్ని ఉంటాయి. తాను ఎవరిని కలుసుకోవాలి? ఎవరిని కలుసుకోకూడదన్న దానిపై ఆయన చాలా క్లియర్ గా ఉంటారు. తనకు ఎంత సన్నిహితులైనప్పటికి.. వారికి వారుగా కలుసుకోవాలనుకున్నంతనే కలుసుకోలేని సిత్రం.. కేసీఆర్ సొంతం.
వారు కలుసుకోవాలనుకున్నప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్.. ఆ తర్వాత స్పందించటం.. అనూహ్యంగా వ్యవహరించటం ఆయనకు అలవాటే. ఇలా సన్నిహితులకు సైతం సర్ ప్రైజ్ లు ఇచ్చే కేసీఆర్ కు కొన్ని నమ్మకాలు ఎక్కువన్న విషయం తెలిసిందే. కొన్ని విషయాల్లో మాత్రం ఆయన గుడ్డిగా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. కరోనా వేళలో.. కొత్త వారిని కలవటం.. ఎక్కడిపడితే అక్కడకు వెళ్లటం ఏ మాత్రం సేఫ్ కాదన్నది తెలిసిందే.
ఇలాంటి వాటిని పట్టించుకోకుండా.. తాను అనుకున్నది చేసే కేసీఆర్ కు వరంగల్ జిల్లా పర్యటన అన్నంతనే ఒక సెంటిమెంట్ ను ఆయన తూచా తప్పకుండా ఫాలో అవుతారు. తన వరంగల్ పర్యటన వేళ.. పార్టీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లటం ఆయనకో అలవాటు. అయితే.. భోజనం వేళకు కానీ.. లేదంటే ముందు కానీ ఆయన ఇంటికి వెళ్లిన తర్వాతే మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంత టైట్ షెడ్యూల్ అయినప్పటికి కెప్టెన్ ఇంటికి వెళ్లటం కేసీఆర్ సెంటిమెంట్ గా చెబుతారు. కరోనా వేళలోనూ ఆయనీ సంప్రదాయాన్ని ఫాలో కావటం గమనార్హం.
హన్మకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీకి హెలికాఫ్టర్ లో చేరుకునే ముఖ్యమంత్రి అక్కడి నుంచి నేరుగా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాతే ఆయన మిగిలిన కార్యక్రమాలకు హాజరు కానున్నారు. వాస్తవానికి తన కార్యక్రమాల చివర్లో ఎంపీ ఇంటికి వెళ్లాల్సి ఉన్నా.. కరోనా పేషెంట్లను అతి దగ్గరగా కలిసే అవకాశం ఉండటంతో.. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా మొదటే ఎంపీ ఇంటికి వెళ్లి.. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెబుతున్నారు.
This post was last modified on May 21, 2021 10:06 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…