Political News

కరోనా వేళలోనూ సెంటిమెంట్ ను మిస్ కాని కేసీఆర్



ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ స్పీడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మిన్ను విరిగి మీద పడినప్పటికి తనదైన స్టైల్ లోనే ఉంటారు తప్పించి.. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే విషయంలో కేసీఆర్ నిశ్చితాభిప్రాయాలు కొన్ని ఉంటాయి. తాను ఎవరిని కలుసుకోవాలి? ఎవరిని కలుసుకోకూడదన్న దానిపై ఆయన చాలా క్లియర్ గా ఉంటారు. తనకు ఎంత సన్నిహితులైనప్పటికి.. వారికి వారుగా కలుసుకోవాలనుకున్నంతనే కలుసుకోలేని సిత్రం.. కేసీఆర్ సొంతం.


వారు కలుసుకోవాలనుకున్నప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్.. ఆ తర్వాత స్పందించటం.. అనూహ్యంగా వ్యవహరించటం ఆయనకు అలవాటే. ఇలా సన్నిహితులకు సైతం సర్ ప్రైజ్ లు ఇచ్చే కేసీఆర్ కు కొన్ని నమ్మకాలు ఎక్కువన్న విషయం తెలిసిందే. కొన్ని విషయాల్లో మాత్రం ఆయన గుడ్డిగా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. కరోనా వేళలో.. కొత్త వారిని కలవటం.. ఎక్కడిపడితే అక్కడకు వెళ్లటం ఏ మాత్రం సేఫ్ కాదన్నది తెలిసిందే.


ఇలాంటి వాటిని పట్టించుకోకుండా.. తాను అనుకున్నది చేసే కేసీఆర్ కు వరంగల్ జిల్లా పర్యటన అన్నంతనే ఒక సెంటిమెంట్ ను ఆయన తూచా తప్పకుండా ఫాలో అవుతారు. తన వరంగల్ పర్యటన వేళ.. పార్టీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లటం ఆయనకో అలవాటు. అయితే.. భోజనం వేళకు కానీ.. లేదంటే ముందు కానీ ఆయన ఇంటికి వెళ్లిన తర్వాతే మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంత టైట్ షెడ్యూల్ అయినప్పటికి కెప్టెన్ ఇంటికి వెళ్లటం కేసీఆర్ సెంటిమెంట్ గా చెబుతారు. కరోనా వేళలోనూ ఆయనీ సంప్రదాయాన్ని ఫాలో కావటం గమనార్హం.


హన్మకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీకి హెలికాఫ్టర్ లో చేరుకునే ముఖ్యమంత్రి అక్కడి నుంచి నేరుగా ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లనున్నారు. ఆ తర్వాతే ఆయన మిగిలిన కార్యక్రమాలకు హాజరు కానున్నారు. వాస్తవానికి తన కార్యక్రమాల చివర్లో ఎంపీ ఇంటికి వెళ్లాల్సి ఉన్నా.. కరోనా పేషెంట్లను అతి దగ్గరగా కలిసే అవకాశం ఉండటంతో.. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా మొదటే ఎంపీ ఇంటికి వెళ్లి.. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారని చెబుతున్నారు.

This post was last modified on May 21, 2021 10:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

8 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago