జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన అవసరానికి వాడుకుని వదిలేశాడనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. 2009 ఎన్నికల ముంగిట ప్రచారానికి తారక్ సాయం తీసుకోవడం, అప్పుడు అతడికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇవ్వడం.. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అతణ్ని పట్టించుకోకపోవడం.. పైగా ఆ పరాజయాన్ని తెలుగుదేశం వర్గాలు అతడికి ఆపాదించే ప్రయత్నం జూనియర్ రాముడి అభిమానులను బాధించిన మాట వాస్తవం. తారక్ను ఆదరిస్తే, ప్రోత్సహిస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్కు పోటీగా ఎతయారవుతాడో అన్న భయం చంద్రబాబులో ఉందని, అందుకే తారక్ను దూరం పెడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఐతే తెర వెనుక ఏం జరిగినప్పటికీ.. పైకి తారక్ను గుర్తించడంలో, అతడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడంలో తప్పేముందన్నది చాలామంది మాట.
చంద్రబాబు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. తన పార్టీ ప్రముఖులు, సన్నిహితులు అనే కాదు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి ప్రముఖుల పుట్టిన రోజులు వస్తే శుభాకాంక్షలు చెబుతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ను మాత్రం పట్టించుకోరు. అతడి పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు చాలా ఏళ్ల నుంచి కనిపించవు. దీని గురించి తెలుగుదేశం పార్టీలోని తారక్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. శుభాకాంక్షలు చెబితే చంద్రబాబుకు పోయేదేముంది అంటారు. పూర్తిగా సినిమా వాళ్లను విస్మరిస్తే ఓకే కానీ.. కొందరికి శుభాకాంక్షలు చెప్పి, తారక్ను పట్టించుకోకపోవడం ఏంటని అంటుంటారు.
గురువారం తారక్ 38వ పుట్టిన రోజును జరుపుకోగా.. చంద్రబాబు ఈసారి కూడా శుభాకాంక్షలు చెప్పలేదు. గురువారం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు జిల్లా స్థాయి నేతలకు చంద్రబాబు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పడం గమనార్హం. దీంతో తారక్ అభిమానులు మరింతగా ఆగ్రహాానికి గురవుతున్నారు. ఐతే చంద్రబాబు చెప్పకపోయినా ఆయన తనయుడు నారా లోకేష్ మాత్రం తారక్కు విష్ చేస్తూ ఒక ట్వీట్ వేయడం విశేషం. ఎన్టీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ను ట్యాగ్ చేసి.. ‘‘తారక్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు లోకేష్.
This post was last modified on May 20, 2021 6:36 pm
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…
ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో కాపు, కమ్మ, రెడ్ల మధ్య రాజకీయాలు నడిస్తే ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం పూర్తిగా రెడ్ల…
ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు షూటింగ్ లీక్స్…
ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందబోయే స్పిరిట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందాని ప్రభాస్ అభిమానులే కాదు సగటు సినీ…
ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోయి జనాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. వరసబెట్టి దింపుతుంటే వాళ్ళు మాత్రం ఏం…