Political News

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భాగ్యం వారికేనట

ఎన్నిసార్లు చూసి తనివితీరని తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆయన భక్తులు ఎంతలా తపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి దర్శనాన్ని భక్తులకు బంద్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో మూసిన తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు.. భక్తుల కోసం త్వరలో తెరిచే అవకాశం ఉందంటున్నారు. లాక్ డౌన్ 4.0 ఉన్నా.. కొన్ని మినహాయింపులతోనే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మామూలు రోజుల్లో యాభై.. అరవై వేలకు తగ్గకుండా శ్రీవారి దర్శనాన్ని భక్తులు పొందేవారు. హుండీ ఆదాయమే రూ.3 కోట్లు తగ్గేది కాదు. అందుకు భిన్నంగా లాక్ డౌన్ పరిస్థితులు ఉన్నాయి. మాయదారి రోగంతో సహజీవనం చేయాల్సిన వేళ.. శ్రీవారి దర్శన విధానం కూడా మారిపోతుందని చెబుతున్నారు. గతంలో మాదిరి కాకుండా తొలి దశలో గంటకు నాలుగు వందల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారని చెబుతున్నారు.

టోకెన్ సిస్టంతో పాటు.. స్లాట్ విధానాన్ని అనుసరించటం ద్వారా స్వామి వారి దర్శనం భక్తులకు కలుగుతుందని చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత పరిమిత సంఖ్యలో స్వామి వారి దర్శనానికి అనుమతులు ఇస్తారని చెబుతున్నారు. స్వామివారి దర్శనాన్ని షురూ చేసినంతనే.. తొలుత టీటీడీ ఉద్యోగులకు.. వారి కుటుంబాలకు కల్పిస్తారని.. ఆ తర్వాత తిరుపతి వాసులకు అనుమతి ఇస్తారని చెబుతున్నారు.

ఆ తర్వాత మాత్రమే సాధారణ భక్తులకు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. గంటకు 400 మంది చొప్పున.. రోజులో పన్నెండు.. పద్నాలుగు గంటలు మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుందన్న మాట వినిపిస్తోంది. స్వామి వారి దివ్య మంగళ స్వరూపం కోసం తహతహలాడుతున్న భక్త జనులకు.. స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుందనే వార్త అమితానందానికి గురి చేస్తుందని చెప్పక తప్పదు.

This post was last modified on May 16, 2020 12:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆది పినిశెట్టి… ఇలా జరిగిందేంటి

టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…

31 minutes ago

మసక మసక ఎలా ఉంది

ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…

57 minutes ago

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…

2 hours ago

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…

3 hours ago

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

4 hours ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

7 hours ago