కరోనా విసిరిన సవాలుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారికి.. అది సరిపోదన్నట్లుగా బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురి కావటమే కాదు.. ప్రాణాలు పోతున్న వైనాలు పెరుగుతున్నాయి. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే కరోనా వైద్యం కారణంగా లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బ తింటున్నాయి. బ్లాక్ ఫంగస్ లాంటిది ఎదురైతే.. ఆస్తులు అమ్ముకోవటం మినహా మరో మార్గం లేని దుస్థితి. ఇలాంటివేళ.. బ్లాక్ ఫంగస్ విసిరే సవాలుకు ఏపీ సర్కారు భిన్నంగా స్పందించింది.
ఏపీ రాష్ట్ర ప్రజలనకు దున్నుగా నిలిచేలా బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావటమేకాదు.. అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖా ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైతే.. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ.. ఆరోగ్య శ్రీ నెట్ వర్కు ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ బ్లాక్ ఫంగస్ కు వైద్యం అందించేలా తీసుకున్న నిర్ణయం బాధితులకు దన్నుగా నిలుస్తుందని చెప్పాలి. లక్షలాది రూపాయిలు ఖర్చు అయ్యే ఈ మాయదారి రోగాన్ని.. ఏపీ ప్రభుత్వం మాదిరే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను భరిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మరి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…