Political News

రఘురామ కేసులో ఉత్కంఠ రేపుతున్న ‘6 గంటలు’

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఐడీ పోలీసులు రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో అరెస్టు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా గెలిచి, ఏడాది తిరక్కుండానే రెబల్‌గా మారిన రఘురామ.. గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలను టార్గెట్ చేశారు. ఈ మధ్య ఆయన విమర్శలు తీవ్ర స్థాయికి చేరడం, జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ కూడా వేయడంతో ప్రభుత్వం ఆయన మీదికి సీఐడీని ఉసిగొల్పినట్లుగా భావిస్తున్నారు. రఘురామ మీద కేసులు పెట్టిన సెక్షన్లు, ఆయన మీద మోపిన అభియోగాల మీద పెద్ద చర్చే నడుస్తోంది. ఆ సంగతలా ఉంచితే.. పోలీసులు రఘురామను అదుపులోకి తీసుకునే సమయంలో, ఆ తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నపుడు ఆయనను తీవ్రంగా కొట్టినట్లుగా ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.

రఘురామ పాదాలు బాగా కమిలిపోయిన ఫొటోలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కొట్టడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. కేసులు పెట్టడం, అరెస్టు చేయడం సంగతలా ఉంచితే.. పెద్ద బ్యాగ్రౌండ్ ఉండి, కేంద్రం నుంచి ‘వై’ కేటగిరి భద్రతను కూడా అందుకున్న ఒక ఎంపీని పోలీసులు కొట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఈ ఆరోపణలు నిజమని తేలితే పోలీసు ఉన్నతాధికారుల పైన వేటు పడటమే కాక ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి రావచ్చు. ఈ విషయమై కోర్టు తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఐతే రఘురామ పాదాలు అలా కందిపోవడానికి పోలీసులు కొట్టడం కాకుండా వేరే కారణాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు సందేహం.

షుగర్, ఇతర అనారోగ్య కారణాలతో కూడా అలా కావచ్చని అంటున్నారు. పోలీసులు కొట్టడం వల్లే రఘురామ పాదాలు అలా మారాయా అన్నది తేల్చాలని వైద్య సిబ్బందిని కోర్టు ఆదేశించింది. కోర్టులో విచారణ సందర్భంలో ఈ గాయాలు గత ఆరు గంటల వ్యవధిలోనే అయ్యాయా.. అన్నది తేల్చాలని కోర్టు సూచించింది. దీంతో ఈ ఆరుగంటల వ్యవధి అన్నది ఇప్పుడీ కేసులో కీలకంగా మారింది. ఐతే ఆ వ్యవధిలోనే రఘురామకు గాయాలైనట్లు తేలితే సీఐడీ, ఏపీ ప్రభుత్వం చిక్కుల్లో పడటం ఖాయం. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది రిపోర్ట్ నిష్పక్షపాతంగా ఇస్తారా.. లేక వారిపై ఒత్తిడి పని చేసి తప్పుడు నివేదిక ఇస్తారా అన్నది చర్చనీయాంశమవుతోంది.

This post was last modified on May 16, 2021 2:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

27 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago