Political News

రఘురామ కేసులో ఉత్కంఠ రేపుతున్న ‘6 గంటలు’

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఐడీ పోలీసులు రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో అరెస్టు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా గెలిచి, ఏడాది తిరక్కుండానే రెబల్‌గా మారిన రఘురామ.. గత ఏడాది కాలంలో ఎన్నోసార్లు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలను టార్గెట్ చేశారు. ఈ మధ్య ఆయన విమర్శలు తీవ్ర స్థాయికి చేరడం, జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ కూడా వేయడంతో ప్రభుత్వం ఆయన మీదికి సీఐడీని ఉసిగొల్పినట్లుగా భావిస్తున్నారు. రఘురామ మీద కేసులు పెట్టిన సెక్షన్లు, ఆయన మీద మోపిన అభియోగాల మీద పెద్ద చర్చే నడుస్తోంది. ఆ సంగతలా ఉంచితే.. పోలీసులు రఘురామను అదుపులోకి తీసుకునే సమయంలో, ఆ తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నపుడు ఆయనను తీవ్రంగా కొట్టినట్లుగా ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.

రఘురామ పాదాలు బాగా కమిలిపోయిన ఫొటోలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కొట్టడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. కేసులు పెట్టడం, అరెస్టు చేయడం సంగతలా ఉంచితే.. పెద్ద బ్యాగ్రౌండ్ ఉండి, కేంద్రం నుంచి ‘వై’ కేటగిరి భద్రతను కూడా అందుకున్న ఒక ఎంపీని పోలీసులు కొట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఈ ఆరోపణలు నిజమని తేలితే పోలీసు ఉన్నతాధికారుల పైన వేటు పడటమే కాక ప్రభుత్వం ఇరుకున పడే పరిస్థితి రావచ్చు. ఈ విషయమై కోర్టు తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఐతే రఘురామ పాదాలు అలా కందిపోవడానికి పోలీసులు కొట్టడం కాకుండా వేరే కారణాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు సందేహం.

షుగర్, ఇతర అనారోగ్య కారణాలతో కూడా అలా కావచ్చని అంటున్నారు. పోలీసులు కొట్టడం వల్లే రఘురామ పాదాలు అలా మారాయా అన్నది తేల్చాలని వైద్య సిబ్బందిని కోర్టు ఆదేశించింది. కోర్టులో విచారణ సందర్భంలో ఈ గాయాలు గత ఆరు గంటల వ్యవధిలోనే అయ్యాయా.. అన్నది తేల్చాలని కోర్టు సూచించింది. దీంతో ఈ ఆరుగంటల వ్యవధి అన్నది ఇప్పుడీ కేసులో కీలకంగా మారింది. ఐతే ఆ వ్యవధిలోనే రఘురామకు గాయాలైనట్లు తేలితే సీఐడీ, ఏపీ ప్రభుత్వం చిక్కుల్లో పడటం ఖాయం. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది రిపోర్ట్ నిష్పక్షపాతంగా ఇస్తారా.. లేక వారిపై ఒత్తిడి పని చేసి తప్పుడు నివేదిక ఇస్తారా అన్నది చర్చనీయాంశమవుతోంది.

This post was last modified on May 16, 2021 2:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…

1 hour ago

వైరల్ వీడియో… గోరంట్ల మాధవ్ ఏం చేశారంటే?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…

1 hour ago

పోలీసులను వాచ్ మెన్ లతో పోల్చిన జగన్

ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…

2 hours ago

బ్రేకింగ్ : CSK కెప్టెన్ గా ధోనీ.. ఎందుకంటే..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు…

2 hours ago

ఏపీలో నోటికి పని చెప్పడం ఇకపై కుదరదు

నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…

3 hours ago

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…

3 hours ago