Political News

గ్లోబల్ టెండర్లు ఏపిని ఆదుకుంటుందా ?

తాజాగా ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్లే జనాల్లో ఇలాంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అందరికీ టీకాలు వేయించాలంటే 7 కోట్ల డోసులు అవసరం. అయితే ప్రస్తుతం టీకాలను ఉత్పత్తిచేస్తున్న రెండు పార్మా కంపెనీల ద్వారా కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలు కలిపి నెలకు అందుతున్నది 10 లక్షల డోసులు కూడా ఉండటంలేదు. ఒకవైపు టీకాల కోసం పెరిగిపోతున్న డిమాండ్లు మరోవైపు డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేని కంపెనీలు.

ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి టీకాల సరఫరా కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని అనుకున్నారు. అందుకనే ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచింది. టెండర్ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ సరఫరా ఆర్డర్ పొందే సంస్ధే కేంద్రంనుండి అనుమతులు తెచ్చుకోవాలి. టెండర్ ఫైనలైజ్ అయిన రెండు నెలల్లోగా కేంద్రంనుండి అనుమతులు పొందాలి. మూడో నెలనుండి వ్యాక్సిన్ పంపిణి మొదలుపెట్టేయాలి.

టెండర్ నిబంధనల ప్రకారం నెలకు కనీసం 25 లక్షల డోసులు సరఫరా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నిబంధనలను నూరుశాతం ఫుల్ ఫిల్ చేయగలమని నమ్మకమున్న కంపెనీలే టెండర్లలో పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. 75 శాతం టీకాలు సరఫరా అయిన తర్వాత మాత్రమే ఒప్పందం చేసుకున్న ధరలో 50 శాతం బిల్లులు చెల్లిస్తుంది. టెండర్ నిబంధనలు బాగానే ఉన్నాయికానీ అవి ఆచరణ సాధ్యమేనా అనే డౌటు మొదలైంది.

మనదేశంలో ప్రతి అనుమతికి నెలలు, సంవత్సరాలు పడుతుందన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా ప్రతిదీ బాగా ఆలస్యమైపోతోంది. దేశీయంగా ఉన్న కంపెనీలు అనుమతులు తెచ్చుకోవటమే చాలా కష్టం. అలాంటిది విదేశీకంపెనీలు మనదేశంలో అనుమతులు తెచ్చుకోవటమంటే మామూలు విషయంకాదు. పైగా 75 శాతం టీకాల పంపిణీ అయిన తర్వాత 50 శాతం బిల్లులు చెల్లిస్తామనే నిబంధనను ఎన్ని కంపెనీలు సానుకూలంగా ఉంటాయో తెలీదు. కాబట్టి గ్లోబల్ టెండర్ల వల్ల ఎంత ఉపయోగం అన్నది కాలమే నిర్ణయించాలి.

This post was last modified on May 14, 2021 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

27 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

40 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago