తాజాగా ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్లే జనాల్లో ఇలాంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అందరికీ టీకాలు వేయించాలంటే 7 కోట్ల డోసులు అవసరం. అయితే ప్రస్తుతం టీకాలను ఉత్పత్తిచేస్తున్న రెండు పార్మా కంపెనీల ద్వారా కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలు కలిపి నెలకు అందుతున్నది 10 లక్షల డోసులు కూడా ఉండటంలేదు. ఒకవైపు టీకాల కోసం పెరిగిపోతున్న డిమాండ్లు మరోవైపు డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేని కంపెనీలు.
ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి టీకాల సరఫరా కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని అనుకున్నారు. అందుకనే ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచింది. టెండర్ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ సరఫరా ఆర్డర్ పొందే సంస్ధే కేంద్రంనుండి అనుమతులు తెచ్చుకోవాలి. టెండర్ ఫైనలైజ్ అయిన రెండు నెలల్లోగా కేంద్రంనుండి అనుమతులు పొందాలి. మూడో నెలనుండి వ్యాక్సిన్ పంపిణి మొదలుపెట్టేయాలి.
టెండర్ నిబంధనల ప్రకారం నెలకు కనీసం 25 లక్షల డోసులు సరఫరా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నిబంధనలను నూరుశాతం ఫుల్ ఫిల్ చేయగలమని నమ్మకమున్న కంపెనీలే టెండర్లలో పాల్గొనాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. 75 శాతం టీకాలు సరఫరా అయిన తర్వాత మాత్రమే ఒప్పందం చేసుకున్న ధరలో 50 శాతం బిల్లులు చెల్లిస్తుంది. టెండర్ నిబంధనలు బాగానే ఉన్నాయికానీ అవి ఆచరణ సాధ్యమేనా అనే డౌటు మొదలైంది.
మనదేశంలో ప్రతి అనుమతికి నెలలు, సంవత్సరాలు పడుతుందన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా ప్రతిదీ బాగా ఆలస్యమైపోతోంది. దేశీయంగా ఉన్న కంపెనీలు అనుమతులు తెచ్చుకోవటమే చాలా కష్టం. అలాంటిది విదేశీకంపెనీలు మనదేశంలో అనుమతులు తెచ్చుకోవటమంటే మామూలు విషయంకాదు. పైగా 75 శాతం టీకాల పంపిణీ అయిన తర్వాత 50 శాతం బిల్లులు చెల్లిస్తామనే నిబంధనను ఎన్ని కంపెనీలు సానుకూలంగా ఉంటాయో తెలీదు. కాబట్టి గ్లోబల్ టెండర్ల వల్ల ఎంత ఉపయోగం అన్నది కాలమే నిర్ణయించాలి.
This post was last modified on May 14, 2021 11:11 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…