Political News

హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయటం లేదా ?

అవును క్షేత్రస్ధాయి పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కరోనా వైరస్ చికిత్స కోసం ఏపి నుండి హైదరాబాద్ కు వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల్లో పోలీసులు నిలిపేస్తున్నారు. సోమవారం నుండి కర్నూలు, కృష్ణాజిల్లా, గుంటూరు సరిహద్దుల్లో పోలీసులు ప్రత్యేకించి డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏపిలోని ఏ ప్రాంతంనుండి తెలంగాణాలోకి ప్రవేశించాలనా పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో చెక్ పోస్టులు, టోల్ గేట్ల దగ్గర పెద్ద గోల జరుగుతోంది.

ఈ విషయాన్ని మీడియాలో తెలుసుకున్న హైకోర్టు సూమోటోగా కేసు టేకప్ చేసింది. తెలంగాణాలో పనిచేస్తున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనర్లను కోర్టుకు పిలిపించింది. వైద్యం కోసం వస్తున్న రోగులను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీసింది. రోగులను ఏ అధికారాలతో సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారో చెప్పాలంటు సూటిగా ప్రశ్నించింది. కోర్టడిగిన ప్రశ్నలకు పోలీసులు నీళ్ళు నమిలారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణా-ఏపికి హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధాని. ఈ చట్ట ప్రకారం మరో మూడేళ్ళు హైదరాబాద్ పై ఏపి జనాలకు కూడా చట్టబద్దమైన హక్కులున్నాయి. పైగా వైద్యావసరాల కోసం ఎవరు ఏ ప్రాంతంలో అయినా చికిత్సలు చేయించుకోవచ్చని సుప్రింకోర్టు కూడా తాజాగా ఆదేశాలిచ్చింది. అయితే ఎవరెన్ని ఆదేశాలిచ్చినా పోలీసులు మాత్రం లెక్కచేయటంలేదు.

ఒకవైపు విచారణలో హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంగళవారం పోలీసు ఉన్నతాధికారులు తలొంచుకున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో మాత్రం అంబులెన్సులను అనుమతించేది లేదని తేల్చిచెప్పేశారు. మంగళవారం కూడా తెలంగాణాలోకి రోగులను అనుమతించకుండా సరిహద్దుల్లోనే నిలిపేశారు. అంటే హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవటం లేదన్న విషయం అర్ధమైపోయింది.

నిజానికి పోలీసుల ఓవర్ యాక్షన్ కు ప్రభుత్వ పెద్దల ఆదేశాలే కారణమని తెలిసిపోతోంది. పోలీసులు తమంతట తాముగా రోగులను సరిహద్దుల్లో నిలపటంలేదు. ఏపి నుండి కరోనా వైరస్ రోగులు తెలంగాణాలోకి ప్రత్యేకించి హైదరాబాద్ కు వచ్చేస్తే ఇక్కడ ఇబ్బందులు మొదలవుతాయన్న ఆందోళనతోనే తెరవెనుక నుండి ఆదేశాలను జారీచేశారు. దాంతో పోలీసులు తమకు అందిన మౌఖిక ఆదేశాలను క్షేత్రస్ధాయిలో అమలు చేస్తున్నారు.

This post was last modified on May 12, 2021 12:16 pm

Share

Recent Posts

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

3 minutes ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

2 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

7 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

8 hours ago

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ… సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…

9 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

9 hours ago