Political News

హైకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయటం లేదా ?

అవును క్షేత్రస్ధాయి పరిస్ధితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కరోనా వైరస్ చికిత్స కోసం ఏపి నుండి హైదరాబాద్ కు వస్తున్న రోగులను తెలంగాణా సరిహద్దుల్లో పోలీసులు నిలిపేస్తున్నారు. సోమవారం నుండి కర్నూలు, కృష్ణాజిల్లా, గుంటూరు సరిహద్దుల్లో పోలీసులు ప్రత్యేకించి డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏపిలోని ఏ ప్రాంతంనుండి తెలంగాణాలోకి ప్రవేశించాలనా పోలీసులు అడ్డుకుంటున్నారు. దాంతో చెక్ పోస్టులు, టోల్ గేట్ల దగ్గర పెద్ద గోల జరుగుతోంది.

ఈ విషయాన్ని మీడియాలో తెలుసుకున్న హైకోర్టు సూమోటోగా కేసు టేకప్ చేసింది. తెలంగాణాలో పనిచేస్తున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనర్లను కోర్టుకు పిలిపించింది. వైద్యం కోసం వస్తున్న రోగులను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీసింది. రోగులను ఏ అధికారాలతో సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారో చెప్పాలంటు సూటిగా ప్రశ్నించింది. కోర్టడిగిన ప్రశ్నలకు పోలీసులు నీళ్ళు నమిలారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణా-ఏపికి హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధాని. ఈ చట్ట ప్రకారం మరో మూడేళ్ళు హైదరాబాద్ పై ఏపి జనాలకు కూడా చట్టబద్దమైన హక్కులున్నాయి. పైగా వైద్యావసరాల కోసం ఎవరు ఏ ప్రాంతంలో అయినా చికిత్సలు చేయించుకోవచ్చని సుప్రింకోర్టు కూడా తాజాగా ఆదేశాలిచ్చింది. అయితే ఎవరెన్ని ఆదేశాలిచ్చినా పోలీసులు మాత్రం లెక్కచేయటంలేదు.

ఒకవైపు విచారణలో హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంగళవారం పోలీసు ఉన్నతాధికారులు తలొంచుకున్నారు. అయితే క్షేత్రస్ధాయిలో మాత్రం అంబులెన్సులను అనుమతించేది లేదని తేల్చిచెప్పేశారు. మంగళవారం కూడా తెలంగాణాలోకి రోగులను అనుమతించకుండా సరిహద్దుల్లోనే నిలిపేశారు. అంటే హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవటం లేదన్న విషయం అర్ధమైపోయింది.

నిజానికి పోలీసుల ఓవర్ యాక్షన్ కు ప్రభుత్వ పెద్దల ఆదేశాలే కారణమని తెలిసిపోతోంది. పోలీసులు తమంతట తాముగా రోగులను సరిహద్దుల్లో నిలపటంలేదు. ఏపి నుండి కరోనా వైరస్ రోగులు తెలంగాణాలోకి ప్రత్యేకించి హైదరాబాద్ కు వచ్చేస్తే ఇక్కడ ఇబ్బందులు మొదలవుతాయన్న ఆందోళనతోనే తెరవెనుక నుండి ఆదేశాలను జారీచేశారు. దాంతో పోలీసులు తమకు అందిన మౌఖిక ఆదేశాలను క్షేత్రస్ధాయిలో అమలు చేస్తున్నారు.

This post was last modified on May 12, 2021 12:16 pm

Share
Show comments

Recent Posts

టబు పాత్రను హీరో తగ్గించాడా?

బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…

5 hours ago

బయటికి ఎప్పుడు వస్తావ్ జన నాయకా

నాలుగు నెలల నుంచి విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న జన నాయకుడు వ్యవహారాలు మెల్లగా ఒక్కొక్కటి కొలిక్కి వస్తున్నాయి. మే…

7 hours ago

సత్య ఇంకొంచెం శ్రద్ధ పెడితే

జెట్లీ ఫలితం ఏమైందనేది కాసేపు పక్కనపెడితే కమెడియన్ సత్య క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఏంటో నిన్న ఓపెనింగ్స్ తో అర్థమయ్యింది.…

7 hours ago

ప‌వ‌న్‌కు బాబు ప‌రామ‌ర్శ‌.. పిఠాపురంపై చ‌ర్చ‌?!

జ‌న‌సేన అధినేత‌,ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు పరామ‌ర్శించారు. కొన్నాళ్ల కింద‌ట ముక్కుకు ఆప‌రేషన్ అయిన నేప‌థ్యంలో…

8 hours ago

తడబడుతున్న మమిత బైజు అడుగులు

రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…

10 hours ago

ఛాన్స్ ఇచ్చిన దర్శకుడి పేరు కూతురికి పెడితే?

సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…

10 hours ago