ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఏపీ సీఎం జగన్.. చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధాన మంత్రి మోడీ కేంద్రంగా.. ముఖ్యమంత్రుల మధ్య పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. కరోనా పరిస్థితులపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన ప్రధానిపై హేమంత్ సొరేన్.. సీరియస్ అయ్యారు. “మా మాట వినిపించుకోండి సార్.. మీ మనసులో మాట చెప్పడం కాదు!” అని ట్వీట్ చేశారు. అయితే, దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ.. ప్రధాని మోడీని అనడం తప్పు.. అంటూ.. ట్వీట్ చేశారు.
జేఎంఎం అధినేత, సీఎం సొరేన్ ట్వీట్ ఇదీ: “గౌరవనీయ ప్రధానమంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన తన ‘మన్ కీ బాత్’ మాత్రమే చెప్పారు. కాస్త ఉపయోగపడే విషయాలు చెప్పి, మేం చెప్పేదీ విని ఉంటే బాగుండేది” అని వ్యాఖ్యానించారు.
దీనికి సీఎం జగన్ చేసిన ట్వీట్ ఇదీ..: “మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఒక సోదరుడిగా ఒక విన్నపం చేస్తున్నాను. మన మధ్య ఎటువంటి విభేదాలైనా ఉండొచ్చు. కానీ, ఇలాంటి రాజకీయాలు మన సొంత దేశాన్ని బలహీనపరుస్తాయి. ఇది కొవిడ్పై యుద్ధం జరుగుతున్న సమయం. ఇలాంటప్పుడు ఒకరిని వేలెత్తి చూపించే బదులు… మనమంతా కలిసి కొవిడ్పై సమర్థంగా యుద్ధం సాగించేలా ప్రధాన మంత్రిని బలోపేతం చేయాలి” అని హేమంత్ సొరేన్కు సూచించారు.
దీనికి సొరేన్ అధిరిపోయే కౌంటర్: “మీ నిస్సహాయత గురించి ఈ దేశం మొత్తానికి తెలుసు. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలి” అని సొరేన్ తాజాగా ట్వీట్ చేశారు. అంతేకాదు, దీనికి జగన్ బెయిల్ రద్దు కోరుతూ.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్.. వార్తను కూడా సీఎం హేమంత్ సొరేన్.. తన ట్వీట్ ట్యాగ్ చేయడంతో ఇది మరింత సంచలనంగా మారింది.
కొసమెరుపు: మోడీని పొగుడుతూ.. అడ్డంగా బుక్కయిన సీఎం జగన్.. అటు నెటిజన్ల నుంచి మేధావుల వరకు ఇప్పటికే బుక్కయ్యారు. “వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి ఉన్నతమైన నాయకుడి కుమారుడు సీబీఐ భయంతో మోడీకి తందాన తాన అనడం విచారకరం. కొంచెం ఎదగండి! మీరిప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి” అని ఒడిసాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏకంగా హేమంత్ సొరేన్.. జగన్కు అధిరిపోయే కౌంటర్ ఇవ్వడంతో జగన్ పరువు.. కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 9, 2021 9:17 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…