Political News

కరోనా సంక్షోభంపై మోడిని దుమ్ముదులిపేసిన లాన్సెట్

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతికి నరేంద్రమోడి చేతకానితనమే ప్రధాన కారణమంటు ప్రముఖ లాన్సెట్ జర్నల్ దుమ్ముదులిపేసింది. ప్రపంచ మెడికల్ రంగంలో లాన్సెట్ అత్యంత ప్రాచుర్యం పొందిన జర్నల్. వివిధ దేశాల్లోని మెడికల్ రంగంలో జరుగుతున్న డెవలప్మెంట్లు, కొత్త వైద్య విధానాలు, లోపాలు, పరిష్కారాలను లాన్సెట్ జర్నల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. ఇపుడా జర్నల్ తాజా సంచకిలో భారత్ లో పెరిగిపోతున్న కరోన సంక్షోభంపై తీవ్రస్ధాయిలో స్పందించింది.

కరోనా వైరస్ కట్టడి కోసం పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టాస్క్ ఫోర్స్ ను ఈ ఏడాది ఏప్రిల్ నెలవరకు నరేంద్రమోడి అసలు సమావేశపరచలేదని స్పష్టంగా చెప్పింది. ప్రపంచంలోని కొన్నిదేశాల్లో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత బయటపడినా భారత్ లో ముందస్తుజాగ్రత్తలు తీసుకోవటంలో మోడి విఫలమయ్యారంటు విరుచుకుపడింది. ఈ సంక్షోభాన్ని నియంత్రించాలంటే కరోనా టీకాలు వేయటాన్ని పెంచటంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ఒకటే మార్గంగా చెప్పింది.

ఇలాంటి సంక్షోభ సమయంలో తనపైన, కేంద్రంపైన వస్తున్న విమర్శలను నియంత్రించటంపైనే మోడి దృష్టి పెట్టిన విషయాన్ని జర్నల్ ఎత్తిచూపింది. ఆగష్టునాటికి దేశంలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని ఇనిస్టుట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనాను కూడా జర్నల్ ప్రస్తావించింది. ఒకవేళ అలాంటి విపత్తు తలెత్తితే అందుకు మోడి మాత్రమే బాధ్యుడవుతారంటు జర్నల్ స్పష్టంగా చెప్పింది.

కరోనా వైరస్ కారణంగా ఆక్సిజన్ లేక రోగులు పడుతున్న అవస్తలు, ఆసుపత్రుల్లో బెడ్లులేని వైనాన్ని, బెడ్లు దొరికినా అందని వైద్య సాయాన్ని జర్నల్ ఎత్తిచూపింది. దేశంలోని రోగులు పడుతున్న బాధలను సవివరంగా వివరించింది. వైరస్ సెకెండ్ వేవ్ ఇంతలా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఐదురాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలేనని కూడా జర్నల్ స్పష్టంగా చెప్పింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి నిర్వహించిన ర్యాలీలు, బహిరంగసభలు, రోడ్డుషోల కారణంగా కరోనా తీవ్రత బాగా పెరిగిపోయిందని తేల్చేసింది.

ఎప్పుడైతే ప్రధానమంత్రి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నారో మిగిలిన పార్టీలు నేతలు కూడా అదే మార్గాన్ని అనుసరించిన కారణంగానే దేశంలో సెకెండ్ వేవ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని జర్నల్ అభిప్రాయపడింది. ఎన్నికల ప్రక్రియ కారణంగానే వేలు, లక్షలాదిమంది జనాలు ఒకేచోట నెలల తరబడి గుమిగూడినట్లు జర్నల్ ప్రస్తావించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కేంద్రం సరైన ప్రణాళికను అనుసరించటం లేదని దుయ్యబట్టింది. టీకాలు వేయటంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపింది. సరే మొన్ననేమో అంతర్జాతీయ మీడియా మోడిని వాయించేస్తే తాజాగా లాన్సెట్ జర్నల్ కూడా అదే దారిలో మోడిని తప్పుపట్టడం గమనార్హం.

This post was last modified on May 8, 2021 12:11 pm

Share
Show comments

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

5 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

6 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

7 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

8 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

8 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

9 hours ago