Political News

కమల్ కు దెబ్బ మీద దెబ్బ

తమిళనాడు ఎన్నికల తర్వాత కమలహాసన్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మక్కళ్ నీది మయ్యుం (ఎంఎన్ఎం) పేరుతో కమల్ మూడేళ్ళ క్రితమే ఓ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. మొదటిసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పాల్గొంది. తాజా ఎన్నికల్లో 234 సీట్లకు గాను పార్టీ 150 చోట్ల పోటీచేసింది. అయితే ఒక్కరంటే ఒక్కరు కనీసం అధినేత కమల్ హాసన్ కూడా గెలవలేదు. మొదట్లో ధక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గంలో కమల్ గెలుస్తారనే అనుకున్నా చివరకు ఓడిపోయారు.

పార్టీ తరపున పోటీచేసిన 150 మంది అభ్యర్ధులందరు ఓడిపోవటమే దెబ్బంటే తాజాగా పార్టీకి నేతలు చాలామంది రాజీనామాలు చేసేస్తున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ రాజీనామా చేయటం కలకలం రేపింది. మహేంద్రన్ రాజానామా చేస్తు పార్టీపై అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. అయితే వాటిని కమల్ కొట్టిపారేశారు. మహేంద్రన్ రాజీనామా చేయకపోతే పార్టీని బయటకు సాగనంపేదని కమల్ ఎదురు దాడి మొదలుపెట్టారు.

ఉపాధ్యక్షునితో పాటు కీలకనేతలైన ఏకే మౌర్య, మురగనందమ్, సీకే కుమారవేల్, ఉమాదేవి కూడా రాజీనామాలు చేసినట్లు పార్టీయే అధికారికంగా ప్రకటించింది. ఫలితాలు వచ్చి వారంరోజులు కూడా కాకుండానే వరుసబెట్టి సీనియర్లు రాజీనామాలు చేయటం పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. ఇంకా ఎంతమంది సీనియర్లు రాజీనామాల బాటలో వెళతారో తెలీదు. మొత్తానికి మహేంద్రన్ను ద్రోహిగా కమల్ వర్ణించటం ఆశ్చర్యంగా ఉంది.

రాజీనామాలు చేసిన నేతల సంగతి పక్కనపెట్టేస్తే కమలహాసన్ పరిస్దితే అయోమయంగా మారింది. పార్టీలో సీనియర్లు లేకుండా ఒక్కళ్ళే నెట్టుకురావటం మామూలు విషయం కాదు. పైగా కమల్ పార్టీకే 24 గంటలూ కేటాయించటంలేదు. అవకాశం ఉన్నపుడు సినిమాల్లో కూడా నటిస్తునే ఉన్నారు. అంటే కమల్ రెండు పడవులపై ప్రయాణం చేస్తున్న విషయం వాస్తవం. ఏకకాలంలో రెండుపడవులపై ప్రయాణంసాగదన్న విషయం తెలియటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.

This post was last modified on May 8, 2021 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

49 minutes ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

52 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

3 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago