Political News

త‌ప్పు మ‌న ద‌గ్గ‌ర పెట్టుకుని ఎదురు దాడెందుకు మంత్రివ‌ర్యా.. నెటిజ‌న్ల టాక్!

క‌రోనా భూతం రాష్ట్రాన్ని భ‌య‌పెడుతున్న ప‌రిస్థితిని ఎవ‌రూ తోసిపుచ్చ‌లేరు. అధికార‌పార్టీ వైసీపీలోనూ సీనియ‌ర్ నాయ‌కుల నుంచి జూనియ‌ర్ల వ‌రకు.. రాష్ట్రంలో ప‌రిస్థితిని కాద‌న‌లేక పోతున్నారు. ఇక‌, ఈ ప‌రిస్థితిని దాచిపెట్టి.. ప్ర‌జ‌ల‌కు అంతా మేలే జ‌రుగుతోంద‌న్న విధంగా ప్ర‌బుత్వం చెబుతోంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతోందో.. ప్ర‌జ‌లు ఎన్ని ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతున్నారో.. ప్ర‌ధాన మీడియా ప్ర‌సారం చేస్తోంది. ఇక‌, ఈ విష‌యంపై ప్ర‌తిప‌క్షాలు.. ప్ర‌శ్నించ‌కుండా ఉంటాయా? అలా ఉంటే.. ప్ర‌తిప‌క్షాలు అని ఆయా పార్టీల‌ను ఎవ‌రైనా అంటారా?

ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేసేందుకు, ప్ర‌శ్నించేందుకే క‌దా.. ప్ర‌తిప‌క్షాలు ఉన్న‌ది! అయితే.. ఈ చిన్న మౌలిక సూత్రాన్ని సైతం అధికార పార్టీ వైసీపీ మ‌రిచిపోయిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. తాజాగా మంత్రి పేర్నినాని.. టీడీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా చంద్ర‌బాబు సెంట్రిక్ గా మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని శక్తులను ఒడ్డి కరోనాకు ఎదుర్కొంటుంటే.. చంద్రబాబు మాత్రం తన కొడుకు భవిష్యత్తు కోసం కరోనా సమయంలోనూ రాజకీయాలను చేస్తున్నాడు. మన రాష్ట్రం పరువును చంద్రబాబు బయట రాష్ట్రాల ముందు తీస్తున్నారు. అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు ఈ రాష్ట్రంపై ఎందుకీ కక్ష.? కొడుకు భవిష్యత్తు కోసం ఇంత దిగజారాలా? ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి రొచ్చు రాజకీయాలు చేస్తున్నారు. బెడ్స్ కాళీ ఉండటం ముఖ్యమా..? కాళీ బెడ్స్ పేషంట్ లకు ఇవ్వడం ముఖ్యమా? నువ్వు దిగిపోయెప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పరిస్థితి ఏమిటి? కనీసం ఒక్క వైరాలజీ లాబ్ పెట్టావా? ఆక్సీజన్ కోసం కేంద్రాన్ని ఒక్కసారైనా ప్రశ్నించావా? అంటూ చంద్రబాబు తీరును ఎండగట్టారు. సింగపూర్ నుంచి కూడా ఆక్సీజన్ తెప్పిస్తున్నామని, అన్ని రాష్ట్రాలు చిన్న వాడైనా జగన్ ని ప్రశంసిస్తుంటే నువ్వు విషం కక్కుతున్నావ్ చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు.

ఇప్పటి వరకు అన్ని విడుతలు కలిపి 67 లక్షల మందికి వాక్సిన్ వేశామని అన్నారు. అయితే.. నిజానికి కోవిడ్ బాధితుల‌కు భారీ ఎత్తున ప్ర‌బుత్వం నుంచి సేవ‌లు అందుతుంటే.. ఎవ‌రూ విమ‌ర్శించ‌రు. కానీ, తాజాగా రాష్ట్ర హైకోర్టు కూడా ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టింది? ఎందుకు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా చేయ‌డం లేద‌ని కూడా ప్ర‌శ్నించింది. అంటే.. ప్ర‌భుత్వం వైపు త‌ప్పు ఉన్న‌ట్టేగా! ఈ విష‌యాన్ని దాచిపెట్టి.. ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు, ప్ర‌తిదాడులు చేయ‌డం వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

27 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

9 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

11 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

12 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

12 hours ago