Political News

త‌ప్పు మ‌న ద‌గ్గ‌ర పెట్టుకుని ఎదురు దాడెందుకు మంత్రివ‌ర్యా.. నెటిజ‌న్ల టాక్!

క‌రోనా భూతం రాష్ట్రాన్ని భ‌య‌పెడుతున్న ప‌రిస్థితిని ఎవ‌రూ తోసిపుచ్చ‌లేరు. అధికార‌పార్టీ వైసీపీలోనూ సీనియ‌ర్ నాయ‌కుల నుంచి జూనియ‌ర్ల వ‌రకు.. రాష్ట్రంలో ప‌రిస్థితిని కాద‌న‌లేక పోతున్నారు. ఇక‌, ఈ ప‌రిస్థితిని దాచిపెట్టి.. ప్ర‌జ‌ల‌కు అంతా మేలే జ‌రుగుతోంద‌న్న విధంగా ప్ర‌బుత్వం చెబుతోంది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతోందో.. ప్ర‌జ‌లు ఎన్ని ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతున్నారో.. ప్ర‌ధాన మీడియా ప్ర‌సారం చేస్తోంది. ఇక‌, ఈ విష‌యంపై ప్ర‌తిప‌క్షాలు.. ప్ర‌శ్నించ‌కుండా ఉంటాయా? అలా ఉంటే.. ప్ర‌తిప‌క్షాలు అని ఆయా పార్టీల‌ను ఎవ‌రైనా అంటారా?

ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేసేందుకు, ప్ర‌శ్నించేందుకే క‌దా.. ప్ర‌తిప‌క్షాలు ఉన్న‌ది! అయితే.. ఈ చిన్న మౌలిక సూత్రాన్ని సైతం అధికార పార్టీ వైసీపీ మ‌రిచిపోయిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. తాజాగా మంత్రి పేర్నినాని.. టీడీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా చంద్ర‌బాబు సెంట్రిక్ గా మంత్రి పేర్ని నాని రెచ్చిపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని శక్తులను ఒడ్డి కరోనాకు ఎదుర్కొంటుంటే.. చంద్రబాబు మాత్రం తన కొడుకు భవిష్యత్తు కోసం కరోనా సమయంలోనూ రాజకీయాలను చేస్తున్నాడు. మన రాష్ట్రం పరువును చంద్రబాబు బయట రాష్ట్రాల ముందు తీస్తున్నారు. అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు ఈ రాష్ట్రంపై ఎందుకీ కక్ష.? కొడుకు భవిష్యత్తు కోసం ఇంత దిగజారాలా? ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి రొచ్చు రాజకీయాలు చేస్తున్నారు. బెడ్స్ కాళీ ఉండటం ముఖ్యమా..? కాళీ బెడ్స్ పేషంట్ లకు ఇవ్వడం ముఖ్యమా? నువ్వు దిగిపోయెప్పుడు ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పరిస్థితి ఏమిటి? కనీసం ఒక్క వైరాలజీ లాబ్ పెట్టావా? ఆక్సీజన్ కోసం కేంద్రాన్ని ఒక్కసారైనా ప్రశ్నించావా? అంటూ చంద్రబాబు తీరును ఎండగట్టారు. సింగపూర్ నుంచి కూడా ఆక్సీజన్ తెప్పిస్తున్నామని, అన్ని రాష్ట్రాలు చిన్న వాడైనా జగన్ ని ప్రశంసిస్తుంటే నువ్వు విషం కక్కుతున్నావ్ చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు.

ఇప్పటి వరకు అన్ని విడుతలు కలిపి 67 లక్షల మందికి వాక్సిన్ వేశామని అన్నారు. అయితే.. నిజానికి కోవిడ్ బాధితుల‌కు భారీ ఎత్తున ప్ర‌బుత్వం నుంచి సేవ‌లు అందుతుంటే.. ఎవ‌రూ విమ‌ర్శించ‌రు. కానీ, తాజాగా రాష్ట్ర హైకోర్టు కూడా ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టింది? ఎందుకు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని స‌జావుగా చేయ‌డం లేద‌ని కూడా ప్ర‌శ్నించింది. అంటే.. ప్ర‌భుత్వం వైపు త‌ప్పు ఉన్న‌ట్టేగా! ఈ విష‌యాన్ని దాచిపెట్టి.. ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు, ప్ర‌తిదాడులు చేయ‌డం వ‌ల్ల ఏంటి ప్ర‌యోజ‌నం అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on May 7, 2021 6:58 am

Share

Recent Posts

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

16 minutes ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

1 hour ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

2 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

2 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

4 hours ago