రాజకీయాల్లో ఆవేశాలు-ఆక్రోశాలు కామన్. తమకు ఆశించిన విధంగా న్యాయం జరగకపోయినా.. తమకు అనుకున్న విధంగా పదవులు లభించకపోయినా.. నాయకులు అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనై కొన్నిసార్లు సంచలన ప్రకటనలు చేస్తుంటారు. అయితే.. కొన్నాళ్లకు మళ్లీ వాటిని మరిచిపోయి.. యథా విధిగా తమ రాజకీయాలు కొనసాగిస్తారు. ఇప్పుడు ఇలాంటి బాపతు నాయకులు టీడీపీలో పెరుగుతున్నారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు నచ్చకో.. లేక పార్టీ పరిస్థితిపై వారికి అనుమానంతోనో.. ఇటీవల కాలంలో సంచలన ప్రకటనలు చేస్తున్నారు.
ఇలా.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఆవేశానికి లోనయ్యారు. చంద్రబాబు మంత్రి వర్గంలో గత ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని దక్కించుకోవాలని భావించారు. అయితే.. అనూహ్యంగా బాబు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో అప్పట్లోనే కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు. అయితే.. గత ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు ఆయనకే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, వైసీపీ సునామీని తట్టుకుని కూడా నిలబడడం వంటివి తెలిసిందే. ఇక, కొన్నాళ్ల కిందట.. చంద్రబాబు ఓ హింటిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే.. పూర్తిగా యువతకే పగ్గాలు అప్పగిస్తానని ఆయన చెప్పకనే చెప్పారు. పార్టీలో 33 శాతం యువతకు ప్రాధాన్యం ఉంటుందని, వారికే అవకాశం ఇస్తానని అన్నారు. దీంతో ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసి ప్రయాస పడి గెలిచినా.. యువత కోటా పెరుగుతుందికనుక.. తనకు అవకాశం చిక్కదని భావించిన గోరంట్ల.,. వెంటనే సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరమవుతానని ప్రకటించారు. అదే సమయంలో తన వారసుడిని కూడా ప్రకటించారు.
ఇది జరిగి నాలుగు మాసాలు అయింది. అయితే.. ఈ నాలుగు మాసాల్లోనూ పార్టీలో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. యువతకు పగ్గాలు అప్పగించినా.. ప్రజలకు రిసీవ్ చేసుకునే అవకాశం లేదని గుర్తించిన చంద్రబాబు.. తనే మళ్లీ సీఎం అవడం, సీనియర్లకే ప్రాధాన్యం ఉంటుందని మళ్లీ హింటిచ్చారు. దీంతో మళ్లీ గోరంట్ల తన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఆయన చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో తనకు తిరుగులేదని.. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపుతనదేనని చెప్పుకొచ్చారు. దీంతో గోరంట్ల వ్యాఖ్యలు కేవలం ఆవేశంతో చేసినవేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 6, 2021 4:10 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…