Political News

సెలబ్రిటీలను తిరస్కరించినట్లేనా ?

తాజాగా జరిగిన ఎన్నికల్లో సినీ సెలబ్రిటీలను జనాలు తిరస్కరించినట్లేనా ? వెల్లడైన ఫలితాలను బట్టిచూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బెంగాల్, అస్సాం రాష్ట్రాల సంగతేమో గానీ ధక్షిణాదిలో మాత్రం ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. తమిళనాడు, కేరళలో అనేక పార్టీల తరపున పలువురు సెలబ్రిటీలు పోటీ చేశారు. అయితే వాళ్ళలో అత్యధికులు ఓడిపోయారు.

తమిళనాడు విషయం చూస్తే కమలహాసన్, శరత్ కుమార్, ఖుష్బూ, విజయకాంత్ లాంటి వాళ్ళు చాలామందే పోటీచేశారు. అయితే వీళ్ళల్లో ఎవరు గెలవలేదు. డీఎంకే తరపున చేపాక్ నియోజకవర్గంలో పోటీచేసిన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మాత్రమే గెలిచారు. బహుశా ఉదయనిధి డీఎంకే తరపున అందులోను కాబోయే సీఎంగా ప్రచారంలో ఉన్న డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కొడుకు హోదాలో పోటీచేశారు కాబట్టి ఆ గాలిలో గెలిచుండవచ్చు.

కోయంబత్తూరు ధక్షిణ నియోజకవర్గంలో కమలహాసన్ గెలుపు ఖాయమనే అనుకున్నారు. ఎందుకంటే చాలా రౌండ్లు కమల్ లీడ్ లోనే ఉన్నారు. అయితే చివరకు వెనకబడిపోయి ఓడిపోయారు. ఇక శరత్ కుమార్, విజయకాంత్, ఖుష్బూ లాంటివాళ్ళయితే ఏ దశలో కూడా గెలుస్తారనే సూచన కూడా కనబడలేదు. కాబట్టి తమిళనాడులో సెలబ్రిటీలను జనాలు గెలుపుకు దూరంగా పెట్టేశారనే చెప్పాలి.

ఇక కేరళ సంగతి చూస్తే ఇక్కడ పోటీచేసింది కూడా తక్కువే. బీజేపీ తరపున ప్రముఖ సినీహీరో సురేష్ గోపి పోటీచేశారు. అయితే ఆయన కూడా ఓడిపోయారు. పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ కూటమి ప్రంభంజనం ముందు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులు చాలామంది తట్టుకోలేకపోయారు. లెఫ్ట్ కూటమి, కాంగ్రెస్ పార్టీ తరపున సెలబ్రిటీలెవరు పోటీచేసినట్లు లేదు.

అయినా సెలబ్రిటీలను జనాలు ఎందుకిలా తిరస్కరించినట్లు ? ఎందుకంటే వీళ్ళకు ఓట్లేసి గెలిపించినా మళ్ళీ అడ్రస్ ఉండరని అనుమానించినట్లున్నారు. వీళ్ళు గెలిచిన నియోజకవర్గాల్లో సమస్యలు చెప్పుకోవాలంటే సెలబ్రిటీలు అందుబాటులో ఉండరని అనుకుని ఉంటారు. అందుకనే అత్యధికులను జనాలు తిరస్కరించారు. అయితే తాజా ఎన్నికల్లో ఓడిపోయిన సినీ సెలబ్రిటీలంతా మరో ఐదేళ్ళు జనాల్లోనే ఉండి సమస్యలపై పోరాటాలు చేసి నమ్మకం సంపాదించుకుంటే అప్పుడు జనాలు ఓట్లేసి గెలిపిస్తారేమో చూడాలి.

This post was last modified on May 5, 2021 6:58 pm

Share

Recent Posts

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

2 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

6 minutes ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago