పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఓడించి మమత బెనర్జీ సాధించిన అఖండ విజయం ప్రతిపక్షాల్లో ఆశలు రేకెత్తిస్తున్నట్లే ఉంది. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని శరద్ పవార్ అభిప్రాయపడుతున్నారు. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడి నాయకత్వంలోని ఎన్డీయేని ఢీకొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటు దిశగా పవార్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లే ఉంది.
ఎన్సీపీ జాతీయ అధికారప్రతినిధి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయేకి బలమైన ప్రత్యామ్నాయం కోసం పవార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పటం ఆసక్తిగా మారింది. ఎన్డీయేకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలన్న మమతబెనర్జీ అభిప్రాయానికి అనుగుణంగానే తమ అధినేత కూడా అడుగలు వేస్తున్నట్లు మాలిక్ చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలను సంఘటితం చేసేందుక పవార్ కొద్ది రోజుల్లోనే అవసరమైన చర్యలు తీసుకుంటారట. ప్రాంతీయ పార్టీలను ఒక తాటి పైకి తీసుకురావటమే ధ్యేయంగా పవర్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెప్పారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతునే ఉన్నాయి. అయితే ప్రతిపక్షాల్లోని అనైక్యత వల్లే ప్రయత్నాలు ముందుకు సాగటం లేదు.
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు శరద్ పవార్, మమతబెనర్జీ, మాయాదేవి, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళకు ఢిల్లీలో చక్రం తిప్పాలని బలమైన కోరికుంది. కానీ వీరిలో ఎవరికి కూడా అంత సీన్ లేదు. ఎందుకంటే జాతీయపార్టీ కాంగ్రెస్ పార్టీ సహకారం లేకుండా అది సాధ్యంకాదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నపుడు వీళ్ళెవరికీ ఢిల్లీలో చక్రంతిప్పే అవకాశం రాదు.
కేవలం ఈ కారణంతోనే చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా అడుగు ముందుకు పడటంలేదు. ఇపుడు కాంగ్రెస్ బాగా బలహీనపడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ చేతికి ఢిల్లీ పగ్గాలు అప్పగించడానికి ప్రాంతీయపార్టీల అధినేతలు ఎవరు అంగీకరించరు. అలాగని కాంగ్రెస్ పార్టీ సహకారం లేకుండా వీళ్ళ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు తక్కువే. మరి ఈ పరిస్దితుల్లో శరద్ తన ప్రయత్నాల్లో ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాల్సిందే.
This post was last modified on May 5, 2021 2:02 pm
స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది గత…
సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు హాట్ టాపిక్గా మారింది. ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ ఖర్చును కూడా విడిగా…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. తన సినిమాల ఫలితాలను చూస్తే.. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదనిపిస్తుంది.…
మాస్ రాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘షాక్’ ఆ ఇద్దరికీ పెద్ద…
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…