Political News

ఆ ఏపీ మంత్రి చాలా కూల‌ట‌.. !

‘ఆ మంత్రి చాలా కూల్‌… చాలా ఇంప్రెసివ్‌’- ఇదీ ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. జ‌గ‌న్ కేబినెట్లో ఎంతో మంది మంత్రులు ఉన్నా కూడా ఈ మాటే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఎందుకు హైలెట్ అవుతోంది ? అన్న విష‌యం ఆస‌క్తిగా మారింది. ముఖ్య మంత్రి జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన క‌డ‌ప ఎమ్మెల్యే మంత్రి అంజాద్ బాషా గురించి ముఖ్య‌మంత్రి జ‌గ‌నే ఈ కామెంట్లు చేసిన‌ట్టు స‌మాచారం. దీనికి కార‌ణం ఏంటంటే.. తాజాగా జ‌ర‌గాల్సిన కేబినెట్ స‌మావేశాన్ని జ‌గ‌న్ వాయిదా వేశారు. దీంతో సోష‌ల్ మీడియాలో అనేక కామెంట్లు వ‌చ్చాయి. ముఖ్యంగా టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

కేబినెట్‌మంత్రుల‌కే క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు.. క‌రోనా భ‌యం ఉన్న‌ప్పుడు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఎలా నిర్వ‌హిస్తార‌ని.. నారా లోకేష్ ప్ర‌శ్నించారు. ఇది జ‌రిగిన వెంట‌నే మంత్రి అంజాద్ బాషా స్పందించారు. “సార్ వ‌ర్చువ‌ల్‌గా భేటీ అవుదాం. ఆన్‌లైన్‌లో కేబినెట్ మీట్ పెట్టుకుందాం అని సూచించార‌ట‌. అయితే.. అప్ప‌టికే జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌క్క‌న పెట్టారు. అయితే.. జ‌గ‌న్ మాత్రం అంజాద్ సూచ‌న‌ల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. “నువ్వు చాలా కూల్ అన్నా.. ఎందుకు స్పందిస్తావ్‌! వాళ్లంతే.. వాళ్లేదో అన్నార‌ని.. మ‌నం రియాక్ట్ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. వ‌ర్చువ‌ల్‌గా అక్క‌ర‌లేదు. ” అని చెప్పిన‌ట్టు మంత్రుల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది.

ఇక‌, క‌రోనా స‌మ‌యంలో మ‌సీదులు, ద‌ర్గాల్లో కోవిడ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసేలా కూడా అంజాద్ బాషా మైనార్టీ నేత‌ల‌ను సానుకూల ప‌రుస్తున్న విష‌యం కూడా జ‌గ‌న్ వ‌ర‌కు చేరింద‌ని.. ఆయ‌న హ్యాపీగా ఫీల‌య్యార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే క‌డ‌ప‌లోని ప్ర‌ముఖ మ‌సీదును కోవిడ్ కేంద్రంగా మార్చి 100 ప‌డ‌క‌ల‌న‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించార‌ని, దీనికి అనుమ‌తి కోసం వెయిట్ చేస్తున్నార‌ని తెలిసి.. వెంట‌నే అనుమ‌తి ఇచ్చేలా కూడా జ‌గ‌న్ ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

మొత్తంగా .. కీల‌క స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి మ‌చ్చ‌రాకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న మంత్రి అంజాద్‌పై జ‌గ‌న్ ప్ర‌శంస‌లు కురిపించార‌ని.. వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. ప్ర‌ముఖ దేవాల‌యాల్లోని వ‌స‌తి గృహాల‌ను కోవిడ్ వైద్యానికి వినియోగించుకునేలా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిపైనా నాయ‌కులు చ‌ర్చిస్తున్నారు. అయితే.. బాషాకు వ‌చ్చిన రెస్పాన్స్ మాత్రం వెలంప‌ల్లికి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 5, 2021 8:16 am

Share
Show comments

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

39 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago