‘ఆ మంత్రి చాలా కూల్… చాలా ఇంప్రెసివ్’- ఇదీ ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ. జగన్ కేబినెట్లో ఎంతో మంది మంత్రులు ఉన్నా కూడా ఈ మాటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎందుకు హైలెట్ అవుతోంది ? అన్న విషయం ఆసక్తిగా మారింది. ముఖ్య మంత్రి జగన్ సొంత జిల్లాకు చెందిన కడప ఎమ్మెల్యే మంత్రి అంజాద్ బాషా గురించి ముఖ్యమంత్రి జగనే ఈ కామెంట్లు చేసినట్టు సమాచారం. దీనికి కారణం ఏంటంటే.. తాజాగా జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని జగన్ వాయిదా వేశారు. దీంతో సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
కేబినెట్మంత్రులకే కరోనా వచ్చినప్పుడు.. కరోనా భయం ఉన్నప్పుడు ఇంటర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని.. నారా లోకేష్ ప్రశ్నించారు. ఇది జరిగిన వెంటనే మంత్రి అంజాద్ బాషా స్పందించారు. “సార్ వర్చువల్గా భేటీ అవుదాం. ఆన్లైన్లో కేబినెట్ మీట్ పెట్టుకుందాం అని సూచించారట. అయితే.. అప్పటికే జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. అయితే.. జగన్ మాత్రం అంజాద్ సూచనలపై హర్షం వ్యక్తం చేస్తూ.. “నువ్వు చాలా కూల్ అన్నా.. ఎందుకు స్పందిస్తావ్! వాళ్లంతే.. వాళ్లేదో అన్నారని.. మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వర్చువల్గా అక్కరలేదు. ” అని చెప్పినట్టు మంత్రుల మధ్య చర్చ సాగుతోంది.
ఇక, కరోనా సమయంలో మసీదులు, దర్గాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా కూడా అంజాద్ బాషా మైనార్టీ నేతలను సానుకూల పరుస్తున్న విషయం కూడా జగన్ వరకు చేరిందని.. ఆయన హ్యాపీగా ఫీలయ్యారని అంటున్నారు. ఇప్పటికే కడపలోని ప్రముఖ మసీదును కోవిడ్ కేంద్రంగా మార్చి 100 పడకలనను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, దీనికి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసి.. వెంటనే అనుమతి ఇచ్చేలా కూడా జగన్ ఆదేశించినట్టు సమాచారం.
మొత్తంగా .. కీలక సమయంలో ప్రభుత్వానికి మచ్చరాకుండా వ్యవహరిస్తున్న మంత్రి అంజాద్పై జగన్ ప్రశంసలు కురిపించారని.. వైసీపీలో చర్చ సాగుతుండడం గమనార్హం. ఇక, ఇది జరిగిన తర్వాత.. ప్రముఖ దేవాలయాల్లోని వసతి గృహాలను కోవిడ్ వైద్యానికి వినియోగించుకునేలా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దీనిపైనా నాయకులు చర్చిస్తున్నారు. అయితే.. బాషాకు వచ్చిన రెస్పాన్స్ మాత్రం వెలంపల్లికి రాకపోవడం గమనార్హం.
This post was last modified on May 5, 2021 8:16 am
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…