Political News

నాడు జ‌గ‌న‌న్న జై.. నేడు.. నై..!


రాష్ట్రంలో ఉద్యోగుల వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. ఇప్పుడు అదే అధికార పార్టీని ఎదిరించ‌లేక‌.. ఉద్యోగుల నుంచి వ‌స్తున్న ఒత్తిళ్లు త‌ట్టుకోలేక‌.. తీవ్ర సంక‌ట స్థితిని ఎదుర్కొంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఇచ్చిన స‌పోర్టు క‌న్నా.. ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఉద్యోగ సంఘాలు భారీ ఎత్తున సపోర్టు చేస్తున్నారు. జ‌గ‌న్ వెంటే తాము అనే సంకేతాలు ఇస్తున్నారు.

ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం గ‌ళం వినిపించ‌గానే.. ఉద్యోగ సంఘాలు కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై నిప్పులు చెరిగారు. అవ‌స‌ర‌మైతే.. సుప్రీం కోర్టుకు వెళ్ల‌యినా.. నిమ్మ‌గ‌డ్డ విష‌యాన్ని తేల్చుకుంటామ‌ని.. అన్ని ఉద్యోగ సంఘాలు నిప్పులు చెరిగాయి. నిమ్మ‌గ‌డ్డ ప్ర‌భుత్వంతో పంతానికి పోయి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రిలీజ్ చేసిన వెంట‌నే ఉద్యోగ సంఘాలు తాము ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌బోమ‌ని భీష్మించాయి. వ‌న్‌సైడ్‌గా వీళ్లు నాడు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి స‌పోర్ట్ చేశారు.

అయితే.. సుప్రీం కోర్టు జోక్యంతో వారు వెన‌క్కి త‌గ్గారు. అయితే.. ఇప్పుడు అదే ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో అనుస‌రిస్తున్న వ్య‌వ‌హారం.. ఉద్యోగుల మ‌ద్య చిచ్చు పెడుతోంది. కేవ‌లం స‌చివాలయంలోనే క‌రోనాతో 10 మంది ఉద్యోగులు చనిపోయారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా ప‌దుల సంఖ్య‌లో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అన్ని డిపార్ట్‌మెంట్ల‌లో ఉద్యోగులు క‌రోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌భుత్వానికి కొన్నాళ్ల కింద‌ట అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. క‌నీసం ఇప్పుడు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం అనే చిన్న డిమాండ్‌ను, ఉద్యోగుల‌కు పీపీఈ కిట్లు ఇప్పించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని అంటున్నారు. వీరి ఘోష కూడా ప్ర‌భుత్వం ఎంత మాత్రం ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేదు.


నిజానికి ఉద్యోగ సంఘాల నాయ‌కుల మ‌ధ్య కూడా ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తున్నా.. ప్ర‌భుత్వంతో చ‌ర్చించ‌లేక పోతున్నారు. ట్విస్ట్ ఏంటంటే వీరికి ఇప్పుడు ముఖ్య‌మంత్రి మాత్ర‌మే కాదు.. చివ‌ర‌కు జిల్లాల్లో విన‌తిప‌త్రాలు తీసుకునేందుకు మంత్రులు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ట‌. ప్ర‌స్తుతం వీరంతా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 5, 2021 8:07 am

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

10 minutes ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

30 minutes ago

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

3 hours ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

3 hours ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

4 hours ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

4 hours ago