Political News

నాడు జ‌గ‌న‌న్న జై.. నేడు.. నై..!


రాష్ట్రంలో ఉద్యోగుల వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. ఇప్పుడు అదే అధికార పార్టీని ఎదిరించ‌లేక‌.. ఉద్యోగుల నుంచి వ‌స్తున్న ఒత్తిళ్లు త‌ట్టుకోలేక‌.. తీవ్ర సంక‌ట స్థితిని ఎదుర్కొంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఇచ్చిన స‌పోర్టు క‌న్నా.. ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఉద్యోగ సంఘాలు భారీ ఎత్తున సపోర్టు చేస్తున్నారు. జ‌గ‌న్ వెంటే తాము అనే సంకేతాలు ఇస్తున్నారు.

ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం గ‌ళం వినిపించ‌గానే.. ఉద్యోగ సంఘాలు కూడా ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై నిప్పులు చెరిగారు. అవ‌స‌ర‌మైతే.. సుప్రీం కోర్టుకు వెళ్ల‌యినా.. నిమ్మ‌గ‌డ్డ విష‌యాన్ని తేల్చుకుంటామ‌ని.. అన్ని ఉద్యోగ సంఘాలు నిప్పులు చెరిగాయి. నిమ్మ‌గ‌డ్డ ప్ర‌భుత్వంతో పంతానికి పోయి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రిలీజ్ చేసిన వెంట‌నే ఉద్యోగ సంఘాలు తాము ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌బోమ‌ని భీష్మించాయి. వ‌న్‌సైడ్‌గా వీళ్లు నాడు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి స‌పోర్ట్ చేశారు.

అయితే.. సుప్రీం కోర్టు జోక్యంతో వారు వెన‌క్కి త‌గ్గారు. అయితే.. ఇప్పుడు అదే ప్ర‌భుత్వం క‌రోనా విష‌యంలో అనుస‌రిస్తున్న వ్య‌వ‌హారం.. ఉద్యోగుల మ‌ద్య చిచ్చు పెడుతోంది. కేవ‌లం స‌చివాలయంలోనే క‌రోనాతో 10 మంది ఉద్యోగులు చనిపోయారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా ప‌దుల సంఖ్య‌లో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అన్ని డిపార్ట్‌మెంట్ల‌లో ఉద్యోగులు క‌రోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ప్ర‌భుత్వానికి కొన్నాళ్ల కింద‌ట అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన ఉద్యోగ సంఘాల నాయ‌కులు.. క‌నీసం ఇప్పుడు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం అనే చిన్న డిమాండ్‌ను, ఉద్యోగుల‌కు పీపీఈ కిట్లు ఇప్పించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని అంటున్నారు. వీరి ఘోష కూడా ప్ర‌భుత్వం ఎంత మాత్రం ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేదు.


నిజానికి ఉద్యోగ సంఘాల నాయ‌కుల మ‌ధ్య కూడా ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తున్నా.. ప్ర‌భుత్వంతో చ‌ర్చించ‌లేక పోతున్నారు. ట్విస్ట్ ఏంటంటే వీరికి ఇప్పుడు ముఖ్య‌మంత్రి మాత్ర‌మే కాదు.. చివ‌ర‌కు జిల్లాల్లో విన‌తిప‌త్రాలు తీసుకునేందుకు మంత్రులు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ట‌. ప్ర‌స్తుతం వీరంతా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 5, 2021 8:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

15 minutes ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

37 minutes ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

45 minutes ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

3 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

8 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

9 hours ago