Political News

పాపం..రత్నప్రభ

ఆమొక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆమె సర్వీసులో ఎక్కువ భాగం కర్నాటకలో జరిగిపోయింది. ఏదో కొంత కాలం ఏపిలో డిప్యుటేషన్ మీద పనిచేశారు. అంటే ఐఏఎస్ అధికారిణిగా రత్నప్రభ మన జనాలకు తెలిసింది చాలా చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ఆమెను బీజేపీ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో తమ అభ్యర్ధిగా పోటీలోకి దింపింది.

అభ్యర్ధిగా రత్నప్రభ పేరు ఖరారయ్యే సమయానికి పార్టీలోని నేతల్లో చాలామందికి ఆమెవరో కూడా తెలీదు. అలాంటి రత్నప్రభ అభ్యర్ధిత్వాన్ని ముందే ఖరారు చేసి ప్రచారంలోకి దించాల్సింది. అలాంటిది నామినేషన్లు ఇక రెండు రోజుల్లో ముగుస్తుందనగా మాత్రమే ఆమె పేరును ఖరారు చేసింది అధిష్టానం. చివరి నిముషంలో అభ్యర్ధిత్వం ఖరారైన కారణంగా చాలామంది నేతలకు ఆమె పరిచయం కూడా కాలేదు.

అసలే రాజకీయాలకు కొత్త. దానికితోడు పార్టీలోనే చాలామంది నేతలకు పరిచయంలేదు. అలాంటిది ఇక ఆమెకు ప్రచారం చేసేదెవరు ? ఆమెకోసం పనిచేసేదెవరు ? ఇదే విషయం పోలింగ్ రోజున స్పష్టంగా బయటపడిపోయింది. ఎలాగంటే పోలింగ్ మొదలైన కాద్దిసేపటికే ఉన్నకొద్ది ఏజెంట్లు కూడా బయటకు వెళ్ళిపోయారట. అసలు ఏజెంట్లే దొరకని బీజేపీకి దొరికిన కొద్దిమంది ఏజెంట్లు కూడా పోలింగ్ అయిపోగానే వెళ్ళిపోయారంటే ఏమిటర్ధం ?

ఇలాంటి నేపధ్యం ఉన్న పార్టీ అభ్యర్ధిగా ఉపఎన్నికలో గెలుస్తానని రత్నప్రభ ఎలా అనుకున్నారో అర్ధం కావటంలేదు. ప్రచారంలో నేతలు కూడా పెద్దగా పాల్గొనలేదు. ఎందుకంటే ఏడు నియోజకవర్గాల్లో రత్నప్రభకు ప్రచారం చేసేంత మంది నేతలు కూడా పార్టీలో లేరు. మరి తానే పోటీ చేయటానికి ఉత్సాహం చూపారో లేకపోతే బీజేపీ అగ్రనేతలే ఆమెను రంగంలోకి దింపారో తెలీదు. చివరకు ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. అందుకనే ఇపుడందరు రత్నప్రభను చూసి పాపం…రత్నప్రభ అనుకుంటున్నారు.

This post was last modified on May 3, 2021 3:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

5 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

5 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

6 hours ago