Political News

పీకే పాత ట్వీట్ వైరల్

ఆదివారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అలాగే తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలూ వెల్లడయ్యాయి. ఐతే దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చనీయాంశమైంది, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే. ఎందుకంటే తమిళనాట, కేరళలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందే ఒక అంచనా వచ్చేసింది. అస్సాం, పుదుచ్చేరి చిన్న రాష్ట్రాలు కాబట్టి అంత ఆసక్తి లేదు.

ఏడాది కిందట్నుంచే దేశం దృష్టిని ఆకర్షిస్తూ.. దేశ రాజకీయాలనే ప్రభావితం చేస్తాయన్న అంచనాలు రేకెత్తించి.. ఎంతో హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగిన బెంగాల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నిలిచింది. చివరికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అసాధారణ విజయాన్నందుకోవడం.. బీజేపీ నేతృత్వంలోని కూటమి కనీసం వంద మార్కును కూడా టచ్ చేయలేక డబుల్ డిజిట్ సీట్లకే పరిమితం కావడం అనూహ్యం.

మమత పార్టీ గెలిచినా బొటాబొటీ మెజారిటీతో సరిపెట్టుకోక తప్పదనే అనుకున్నారంతా. కానీ ఈ స్థాయి మెజారిటీ రావడం, బీజేపీ ఇలా చతికిలబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. డిసెంబరు 21న ప్రశాంత్ వేసిన ట్వీట్లో.. బీజేపీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ మార్కును దాటబోదని పీకే జోస్యం చెప్పాడు. ఏదో ఒక మాట అనేసి ఊరుకోకుండా ఈ ట్వీట్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలని, బీజేపీ తన అంచనాలను మించితే తాను ట్విట్టర్ వదిలేసి వెళ్లిపోతానని పీకే అన్నాడు.

ఏప్రిల్ 10వ తేదీని పీకే మరోసారి ఇదే మాటను నొక్కి వక్కాణించాడు. ‘‘ఇంతకుముందు చెప్పా, ఇప్పుడూ చెబుతున్నా.. బెంగాల్‌లో బీజేపీ 100 సీట్ల మార్కును టచ్ చేయదు. పీరియడ్’’ అని తేల్చి చెప్పాడు పీకే. ఇప్పుడు అతనన్నట్లే బీజేపీ డబుల్ డిజిట్ సీట్లకు పరిమితం కావడంతో పీకే మొనగాడే అంటూ అతణ్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టీఎంసీకి ఇంతటి భారీ విజయం కట్టబెట్టిన పీకే.. తాను ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోనంటూ సంచలన ప్రకటన చేయడం విశేషం.

This post was last modified on May 3, 2021 8:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదుగా బాబూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌ల‌ట్లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెట్టుబడుల‌కు ఎక్క‌డ అవ‌కాశం ఉంటే..…

3 hours ago

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

8 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

11 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

11 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

12 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

12 hours ago