ఆదివారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అలాగే తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలూ వెల్లడయ్యాయి. ఐతే దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చనీయాంశమైంది, అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలే. ఎందుకంటే తమిళనాట, కేరళలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందే ఒక అంచనా వచ్చేసింది. అస్సాం, పుదుచ్చేరి చిన్న రాష్ట్రాలు కాబట్టి అంత ఆసక్తి లేదు.
ఏడాది కిందట్నుంచే దేశం దృష్టిని ఆకర్షిస్తూ.. దేశ రాజకీయాలనే ప్రభావితం చేస్తాయన్న అంచనాలు రేకెత్తించి.. ఎంతో హోరాహోరీగా, ఉత్కంఠభరితంగా సాగిన బెంగాల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నిలిచింది. చివరికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అసాధారణ విజయాన్నందుకోవడం.. బీజేపీ నేతృత్వంలోని కూటమి కనీసం వంద మార్కును కూడా టచ్ చేయలేక డబుల్ డిజిట్ సీట్లకే పరిమితం కావడం అనూహ్యం.
మమత పార్టీ గెలిచినా బొటాబొటీ మెజారిటీతో సరిపెట్టుకోక తప్పదనే అనుకున్నారంతా. కానీ ఈ స్థాయి మెజారిటీ రావడం, బీజేపీ ఇలా చతికిలబడటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. డిసెంబరు 21న ప్రశాంత్ వేసిన ట్వీట్లో.. బీజేపీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ మార్కును దాటబోదని పీకే జోస్యం చెప్పాడు. ఏదో ఒక మాట అనేసి ఊరుకోకుండా ఈ ట్వీట్ను సేవ్ చేసి పెట్టుకోవాలని, బీజేపీ తన అంచనాలను మించితే తాను ట్విట్టర్ వదిలేసి వెళ్లిపోతానని పీకే అన్నాడు.
ఏప్రిల్ 10వ తేదీని పీకే మరోసారి ఇదే మాటను నొక్కి వక్కాణించాడు. ‘‘ఇంతకుముందు చెప్పా, ఇప్పుడూ చెబుతున్నా.. బెంగాల్లో బీజేపీ 100 సీట్ల మార్కును టచ్ చేయదు. పీరియడ్’’ అని తేల్చి చెప్పాడు పీకే. ఇప్పుడు అతనన్నట్లే బీజేపీ డబుల్ డిజిట్ సీట్లకు పరిమితం కావడంతో పీకే మొనగాడే అంటూ అతణ్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టీఎంసీకి ఇంతటి భారీ విజయం కట్టబెట్టిన పీకే.. తాను ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోనంటూ సంచలన ప్రకటన చేయడం విశేషం.
This post was last modified on May 3, 2021 8:37 am
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…