Political News

గల్లా కుటుంబానికి ప్రభుత్వం షాక్

ప్రముఖ కంపెనీ అమరరాజా కంపెనీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కంపెనీ యాజమాన్యం ఊహించనిరీతిలో ప్రభుత్వం పెద్ద షాకే ఇఛ్చింది. చిత్తూరుకు సమీపంలోని అమరరాజా కంపెనీని మూసేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులిచ్చింది. బ్యాటరీల తయారీలో కంపెనీ యాజమాన్యం కాలుష్య నియంత్ర నిబంధనలను ఉల్లంఘించిందని నోటీసులో స్పష్టంగా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా, వాతావరణ కాలుష్యానికి కారణమైందన్న ఆరోపణలతో చిత్తూరులో యూనిట్ ను మూసేయాలని నోటీసిచ్చింది.

కంపెనీ యాజమాన్యానికి చిత్తూరుతో పాటు తిరుపతి, కరకంబాడి, నూనెగుండ్లపల్లి దగ్గర బ్యాటర్ తయారీ యూనిట్లున్నాయి. వీటిల్లో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యాజమాన్యానికి కార్పొరేట్ ప్రపంచంలో సంవత్సరాలుగా మంచి ట్రాక్ రికార్డే ఉంది. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే యాజమాన్యం నుండి గల్లా జయదేవ్ గుంటూరు టీడీపీ ఎంపిగా ఉన్నారు. వరుసగా రెండోసారి గెలిచారు.

అలాగే జయదేవ్ కన్నా ముందే గల్లా అరుణకుమారి దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంనుండి అరుణ నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత గల్లా కుటుంబం టీడీపీలో చేరారు. 2014లోనే జయదేవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ ఎంపిగా యాక్టివ్ గానే ఉన్నారు జయదేవ్.

చిత్తూరు యూనిట్ ఆధీనంలోనే ఉన్న భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని కూడా ఆమధ్య ఏపిఐఐసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయం వివాదంలో ఉండగానే తాజాగా కాలుష్య నియంత్రణ మండలి నుండి ఏకంగా కంపెనీ మూసేయాలనే నోటీసులు అందటం ఆశ్చర్యంగానే ఉంది. ఇదే విషయమై యాజమాన్యం స్పందిస్తు కాలుష్య నియంత్రణ సమస్యలు తలెత్తకుండా చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. మరి నోటీసులు జారీఅయిన నేపధ్యంలో ప్రభుత్వం నెక్ట్స్ స్టెప్ ఏమిటనే విషయం ఆసక్తిగా మారింది.

This post was last modified on May 1, 2021 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

40 minutes ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

7 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

9 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

11 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

12 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

13 hours ago