Political News

గల్లా కుటుంబానికి ప్రభుత్వం షాక్

ప్రముఖ కంపెనీ అమరరాజా కంపెనీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కంపెనీ యాజమాన్యం ఊహించనిరీతిలో ప్రభుత్వం పెద్ద షాకే ఇఛ్చింది. చిత్తూరుకు సమీపంలోని అమరరాజా కంపెనీని మూసేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులిచ్చింది. బ్యాటరీల తయారీలో కంపెనీ యాజమాన్యం కాలుష్య నియంత్ర నిబంధనలను ఉల్లంఘించిందని నోటీసులో స్పష్టంగా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా, వాతావరణ కాలుష్యానికి కారణమైందన్న ఆరోపణలతో చిత్తూరులో యూనిట్ ను మూసేయాలని నోటీసిచ్చింది.

కంపెనీ యాజమాన్యానికి చిత్తూరుతో పాటు తిరుపతి, కరకంబాడి, నూనెగుండ్లపల్లి దగ్గర బ్యాటర్ తయారీ యూనిట్లున్నాయి. వీటిల్లో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యాజమాన్యానికి కార్పొరేట్ ప్రపంచంలో సంవత్సరాలుగా మంచి ట్రాక్ రికార్డే ఉంది. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే యాజమాన్యం నుండి గల్లా జయదేవ్ గుంటూరు టీడీపీ ఎంపిగా ఉన్నారు. వరుసగా రెండోసారి గెలిచారు.

అలాగే జయదేవ్ కన్నా ముందే గల్లా అరుణకుమారి దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంనుండి అరుణ నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత గల్లా కుటుంబం టీడీపీలో చేరారు. 2014లోనే జయదేవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ ఎంపిగా యాక్టివ్ గానే ఉన్నారు జయదేవ్.

చిత్తూరు యూనిట్ ఆధీనంలోనే ఉన్న భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని కూడా ఆమధ్య ఏపిఐఐసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయం వివాదంలో ఉండగానే తాజాగా కాలుష్య నియంత్రణ మండలి నుండి ఏకంగా కంపెనీ మూసేయాలనే నోటీసులు అందటం ఆశ్చర్యంగానే ఉంది. ఇదే విషయమై యాజమాన్యం స్పందిస్తు కాలుష్య నియంత్రణ సమస్యలు తలెత్తకుండా చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. మరి నోటీసులు జారీఅయిన నేపధ్యంలో ప్రభుత్వం నెక్ట్స్ స్టెప్ ఏమిటనే విషయం ఆసక్తిగా మారింది.

This post was last modified on May 1, 2021 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

54 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

56 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago