Political News

గల్లా కుటుంబానికి ప్రభుత్వం షాక్

ప్రముఖ కంపెనీ అమరరాజా కంపెనీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కంపెనీ యాజమాన్యం ఊహించనిరీతిలో ప్రభుత్వం పెద్ద షాకే ఇఛ్చింది. చిత్తూరుకు సమీపంలోని అమరరాజా కంపెనీని మూసేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులిచ్చింది. బ్యాటరీల తయారీలో కంపెనీ యాజమాన్యం కాలుష్య నియంత్ర నిబంధనలను ఉల్లంఘించిందని నోటీసులో స్పష్టంగా చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా, వాతావరణ కాలుష్యానికి కారణమైందన్న ఆరోపణలతో చిత్తూరులో యూనిట్ ను మూసేయాలని నోటీసిచ్చింది.

కంపెనీ యాజమాన్యానికి చిత్తూరుతో పాటు తిరుపతి, కరకంబాడి, నూనెగుండ్లపల్లి దగ్గర బ్యాటర్ తయారీ యూనిట్లున్నాయి. వీటిల్లో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యాజమాన్యానికి కార్పొరేట్ ప్రపంచంలో సంవత్సరాలుగా మంచి ట్రాక్ రికార్డే ఉంది. సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే యాజమాన్యం నుండి గల్లా జయదేవ్ గుంటూరు టీడీపీ ఎంపిగా ఉన్నారు. వరుసగా రెండోసారి గెలిచారు.

అలాగే జయదేవ్ కన్నా ముందే గల్లా అరుణకుమారి దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంనుండి అరుణ నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత గల్లా కుటుంబం టీడీపీలో చేరారు. 2014లోనే జయదేవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ ఎంపిగా యాక్టివ్ గానే ఉన్నారు జయదేవ్.

చిత్తూరు యూనిట్ ఆధీనంలోనే ఉన్న భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని కూడా ఆమధ్య ఏపిఐఐసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయం వివాదంలో ఉండగానే తాజాగా కాలుష్య నియంత్రణ మండలి నుండి ఏకంగా కంపెనీ మూసేయాలనే నోటీసులు అందటం ఆశ్చర్యంగానే ఉంది. ఇదే విషయమై యాజమాన్యం స్పందిస్తు కాలుష్య నియంత్రణ సమస్యలు తలెత్తకుండా చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. మరి నోటీసులు జారీఅయిన నేపధ్యంలో ప్రభుత్వం నెక్ట్స్ స్టెప్ ఏమిటనే విషయం ఆసక్తిగా మారింది.

This post was last modified on May 1, 2021 9:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

38 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago