Political News

హైకోర్టు దెబ్బకు మేల్కొన్న సీఎం

హైకోర్టు దెబ్బకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తూత్తుకుడిలో ఎప్పుడో మూసేసిన స్టెరిలైట్ ఫ్యాక్టరీని తెరిపించి అందులో ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రోజుకు 300 టన్నుల ఆక్సిజన్ అవసరమైతే ప్రస్తుత పళనిస్వామి లెక్క ప్రకారం 250 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తవుతోంది.

ఇదే విషయమై మూడు రోజుల క్రితం హైకోర్టు ప్రభుత్వానికి బాగా తలంటేసింది. ఎందుకంటే తూత్తుకుడిలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీని వాతావరణ కాలుష్యం కారణంగా 2018లో ప్రభుత్వం మూసేయించింది. ఇందులో ఆక్సిజన్ తయారుచేసే ప్లాంట్లు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో పెరిగిపోతున్న కేసులు, ఆక్సిజన్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని స్టెరిలైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వేదాంత గ్రూపు ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పెట్టింది.

తమ ఫ్యాక్టరీలో ఉన్న ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలని కోరింది. తాము తయారుచేసే ఆక్సిజన్ను ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తామని కూడా చెప్పింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విషయమై హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యంపడింది. ఈ కేసు విచారణలో భాగంగా వాస్తవాలను గ్రహించిన న్యాయస్ధానం ప్రభుత్వాన్ని గట్టిగా వాయించేసింది. కంపెనీ యాజమాన్యం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తామని ముందుకొచ్చినా ఎందుకని అంగీకరించలేదని నిలదీసింది. 24 గంటల్లో ఫ్యాక్టరీని తెరిపించాలని కూడా ఆదేశించింది.

దాంతో పళనిస్వామి సోమవారం అఖిలపక్షాలతో సమావేశం జరిపి స్టెరిలైట్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ తయారీకి అనుమతించారు. దీనివల్ల తొందరలోనే ఇపుడున్న ఉత్పత్తికి అదనంగా 350 టన్నుల ఆక్సిజన్ అందుబాటులోకి రానుంది. అంటే తమిళనాడు వ్యాప్తంగా పెరుగుతున్న కేసులకు తగ్గట్లుగా ఆక్సిజన్ సరిపోతుందని అనుకోవచ్చు. మొత్తానికి చేతులు పూర్తిగా కాలకముందే పళనిస్వామి ఆకులు పట్టుకున్నారనే చెప్పాలి.

This post was last modified on April 27, 2021 10:16 am

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

15 minutes ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

22 minutes ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

2 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

4 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

5 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

7 hours ago