Political News

హైకోర్టు దెబ్బకు మేల్కొన్న సీఎం

హైకోర్టు దెబ్బకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తూత్తుకుడిలో ఎప్పుడో మూసేసిన స్టెరిలైట్ ఫ్యాక్టరీని తెరిపించి అందులో ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రోజుకు 300 టన్నుల ఆక్సిజన్ అవసరమైతే ప్రస్తుత పళనిస్వామి లెక్క ప్రకారం 250 టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తవుతోంది.

ఇదే విషయమై మూడు రోజుల క్రితం హైకోర్టు ప్రభుత్వానికి బాగా తలంటేసింది. ఎందుకంటే తూత్తుకుడిలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీని వాతావరణ కాలుష్యం కారణంగా 2018లో ప్రభుత్వం మూసేయించింది. ఇందులో ఆక్సిజన్ తయారుచేసే ప్లాంట్లు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో పెరిగిపోతున్న కేసులు, ఆక్సిజన్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని స్టెరిలైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వేదాంత గ్రూపు ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పెట్టింది.

తమ ఫ్యాక్టరీలో ఉన్న ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలని కోరింది. తాము తయారుచేసే ఆక్సిజన్ను ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తామని కూడా చెప్పింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విషయమై హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యంపడింది. ఈ కేసు విచారణలో భాగంగా వాస్తవాలను గ్రహించిన న్యాయస్ధానం ప్రభుత్వాన్ని గట్టిగా వాయించేసింది. కంపెనీ యాజమాన్యం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తామని ముందుకొచ్చినా ఎందుకని అంగీకరించలేదని నిలదీసింది. 24 గంటల్లో ఫ్యాక్టరీని తెరిపించాలని కూడా ఆదేశించింది.

దాంతో పళనిస్వామి సోమవారం అఖిలపక్షాలతో సమావేశం జరిపి స్టెరిలైట్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ తయారీకి అనుమతించారు. దీనివల్ల తొందరలోనే ఇపుడున్న ఉత్పత్తికి అదనంగా 350 టన్నుల ఆక్సిజన్ అందుబాటులోకి రానుంది. అంటే తమిళనాడు వ్యాప్తంగా పెరుగుతున్న కేసులకు తగ్గట్లుగా ఆక్సిజన్ సరిపోతుందని అనుకోవచ్చు. మొత్తానికి చేతులు పూర్తిగా కాలకముందే పళనిస్వామి ఆకులు పట్టుకున్నారనే చెప్పాలి.

This post was last modified on April 27, 2021 10:16 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

41 mins ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

58 mins ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

2 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

2 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

2 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

2 hours ago