ఆక్సిజన్..ఇపుడిది దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోగులకు అత్యవసరంగా మారిపోయింది. అందరు రోగులకు ఆక్సిజన్ అవసరం ఉండదన్నది వాస్తవం. కానీ కరోనా కారణంగా జ్వరం తగ్గకపోయినా, శ్వాశతీసుకోవటంలో ఇబ్బందులు మొదలైనా వెంటనే ఆక్సిజన్ చాలా అవసరం అన్నది కూడా వాస్తవమే. ఈ కారణంగానే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో కరోనా రోగంతో చనిపోతున్న వారికన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారిసంఖ్య పెరిగిపోతోది.
ఇలాంటి సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో గడచిన 12 రోజుల్లో 1300 టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. గడచిన నాలుగు రోజులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఆక్సిజన్ ఉత్సత్తిని రోజుకు 100 టన్నుల నుండి 140 టన్నులకు పెంచారు. దేశంలో మొదలైన మొట్టమొదటి ఆక్సిజన్ ట్రైన్ విశాఖ నుండి 100 టన్నుల ద్రవీకృత ఆక్సిజన్ను తీసుకుని మహారాష్ట్రకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.
కేంద్ర ఉక్కుమంత్రిత్వ శాఖ లెక్క ప్రకారం దేశంలోని ఉక్కు ఫ్యాక్టరీలన్నీ తమ సామర్ధ్యాన్ని మించే ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయట. ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లోని ఉక్కు ఫ్యాక్టరీల్లో 33 ఆక్సిజన్ ప్లాంట్లున్నాయి. వీటి రోజువారి ఆక్సిజన్ ఉత్సత్తి సామర్ధ్యం 2834 టన్నులు. అయితే ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్నిప్లాంట్లలో కలిపి 3474 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తిచేస్తున్నారు.
విచిత్రమేమిటంటే రోజుకు వేలాది టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తవుతున్నా రోగుల అవసరాలకు అది ఏమూలకు సరిపోవటంలేదు. ఏ ఆసుపత్రిలో చూసినా ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తోంది. కరోనా రోగం విషమించి చనిపోయే రోగులకన్నా ఆక్సిజన్ దొరక్క చనిపోతున్న వారిసంఖ్య పెరిగిపోతుండటమే బాధాకరం. మరి ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ అంతా ఎటుపోతోంది ? అంటే ఊహించనిరీతిలో రోగుల ఆసుపత్రులకు వచ్చేస్తుండటంతో డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు.
ఉదాహరణకు 10 పడకల ఆసుపత్రికి 10 మంది వస్తే వైద్యం చేయగలరు. అయితే ఒక్కసారిగా 100 మంది వచ్చేస్తే ఏం చేయగలరు ? ఇపుడు జరుగుతున్నదిదే. అందుకే ప్రభుత్వాలైనా, డాక్టర్లయినా ఏమి చేయలేకపోతున్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతిని సరిగా అంచనావేయలేకపోయినా కేంద్రప్రభుత్వానిదే తప్పంతా. తప్పును అంగీకరించని కేంద్రం ఆ నెపాన్ని రాష్ట్రాలమీదకు తోసేసి చేతులు దులిపేసుకున్నది.
This post was last modified on April 26, 2021 12:04 pm
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…