Political News

భూమన ఇమేజీకి మైనస్సేనా ?

లోక్ సభ ఉపఎన్నికల పోలింగ్ తర్వాత తిరుపతి వైసీపీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి ఇమేజికి బాగా మైనస్ అవుతోంది. అసలే 2019 ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీలో వైసీపీకి మైనస్ అయ్యింది. ఎంఎల్ఏగా భూమన 700 ఓట్లతో గెలిస్తే పార్లమెంటుకు వచ్చేసరికి దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు 3వేల చిల్లర ఓట్లు మైనస్ అయ్యాయి. ఈ కారణంగా అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర భూమనకు మైనస్ అయ్యింది.

అప్పటి వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకునే తనకు బదులుగా భూమన కొడుకు అభినయ్ రెడ్డిని పిక్చర్లోకి తీసుకొచ్చారు. నిజానికి భూమనకు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పాజిటివ్ ఇమేజిలేదు. ఏదో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ గాలిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా మొదటిసారి గెలిచారు. తాజాగా జగన్ గాలిలో రెండోసారి గెలిచారు. మధ్యలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఒకసారి, వైసీపీ అభ్యర్ధిగా మరోసారి ఓడిపోయారు. అంటే ఏదైనా గాలుంటే మాత్రమే భూమన గెలుస్తున్నారు.

ఇలాంటి నేపధ్యంలోనే హఠాత్తుగా తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక వచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికలో ఆరు అసెంబ్లీల్లో మంచి మెజారిటి వస్తే ఒక్క తిరుపతిలో మాత్రమే వైసీపీకి మైనస్ వచ్చింది. తాజా ఎన్నికలో కూడా మిగిలిన 6 నియోజకవర్గాల్లో సగటున 68 శాతం పోలింగ్ నమోదైతే తిరుపతిలో మాత్రం 50 శాతమే నమోదైంది. ఇక్కడే భూమన ఎలక్షనీరింగ్ పై అనుమానాలు పెరిగిపోయాయి. భూమన సరిగా పనిచేయకపోవటం వల్లే ఓటింగ్ బాగా తగ్గిపోయిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

దీనికి అదనంగా దొంగ ఓట్ల గోల పెరిగిపోతోంది. ప్రతిపక్షాలు గోల చేస్తున్నట్లుగా వేలల్లో దొంగ ఓట్లు పడలేదన్నది నిజం. అయితే ఎన్నోకొన్ని పడ్డాయన్నదీ వాస్తవమే. నిజానికి దొంగ ఓట్లు వేసుకోవటం అన్నది ఇప్పుడే మొదలుకాలేదు. ఏదేమైనా ఓటింగ్ బాగా తగ్గిపోవటం, దానికి దొంగ ఓట్లు గోల తోడవ్వటంతో స్ధానిక ఎంఎల్ఏగా భూమన ఇమేజీ డ్యామేజి అయ్యిందన్న చర్చ పెరిగిపోతోంది.

This post was last modified on April 21, 2021 1:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

1 hour ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

2 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

3 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

3 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

4 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

7 hours ago