ఇపుడిదే అందరిలోను అనుమానం పెరిగిపోతోంది. పోలింగ్ జరగాల్సిన మూడు విడతల్లో తాను ప్రచారం చేయకూడదని నిర్ణయించినట్లు మమతబెనర్జీ ప్రకటించారు. మొత్తం 8 విడతల పోలింగ్ లో ఇప్పటికి 5 విడతలు పూర్తయ్యింది. సుమారు 100 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సుంది. తన అధికారాన్ని సుస్ధిరం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలని మమత చాల గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఇదే సమయంలో ఎలాగైనా పశ్చిమబెంగాల్లో బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి, అమిత్ షా చాలా పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. మమతను దెబ్బకొట్టడమే ధ్యేయంగా మోడి, షా ధ్వయం చేయని ప్రయత్నాలు లేవు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడెక్కడ చీల్చి చెండాడుతున్నారు. సీనియర్లు, గట్టి నేతలనుకున్న వారిని ఏదో విధంగా బీజేపీలోకి చేర్చుకుంటున్నారు.
టీఎంసికి చెందిన 29 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను బీజేపీలోకి లాగేసుకున్నారు. గెలుపు నీదా నాదా అన్నట్లుగా పోటీ హోరాహోరీగా జరుగుతోంది. ఆరోపణలు, విమర్శల విషయంలో ఇటు మమత అటు మోడి, షాలు అన్నీ హద్దులను దాటేశారు. అంటే ఇద్దరు కూడా గెలుపును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నది అర్ధమైపోతోంది. అందుకనే కాలికి బలమైన దెబ్బ తగిలినా లెక్కచేయకుండా మమత ప్రచారం చేస్తునే ఉన్నారు.
ఇలాంటి నేపధ్యంలో ఇంకా మూడు విడతల పోలింగ్ ఉండగానే ప్రచారానికి వెళ్ళకూడదన్న మమత నిర్ణయం సంచలనంగా మారింది. పెరిగిపోతున్న కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకునే తన బహిరంగసభలు, రోడ్డుషోలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. మూడో విడతలో మాత్రం సింబాలిక్ గా రోడ్డుషో, బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు. మమత ప్రచారాన్ని మానుకున్నంత మాత్రాన బీజేపీ రద్దు చేసుకునే అవకాశాలు లేవు.
ఎందుకంటే మూడు విడతల్లో ఎన్నికలంటే మామూలు విషయంకాదు. మమత ప్రచారం చేయకపోవటాన్ని మోడి, అమిత్ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంది. మమత లాగే బీజేపీ కూడా బహిరంగసభలు, రోడ్డుషోలు రద్దు చేసుకుంటే అది వేరే సంగతి. కానీ ఇప్పటివరకు మోడి, షా లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్ళే అవకాశాలే ఎక్కువున్నాయి. ఏరకంగా చూసినా మమత నిర్ణయం చివరకు కొంపముంచేసేట్లే ఉంది.
This post was last modified on April 20, 2021 11:18 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…