Political News

మమత నిర్ణయమే కొంప ముంచేస్తుందా ?

ఇపుడిదే అందరిలోను అనుమానం పెరిగిపోతోంది. పోలింగ్ జరగాల్సిన మూడు విడతల్లో తాను ప్రచారం చేయకూడదని నిర్ణయించినట్లు మమతబెనర్జీ ప్రకటించారు. మొత్తం 8 విడతల పోలింగ్ లో ఇప్పటికి 5 విడతలు పూర్తయ్యింది. సుమారు 100 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగాల్సుంది. తన అధికారాన్ని సుస్ధిరం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలని మమత చాల గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఇదే సమయంలో ఎలాగైనా పశ్చిమబెంగాల్లో బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి, అమిత్ షా చాలా పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. మమతను దెబ్బకొట్టడమే ధ్యేయంగా మోడి, షా ధ్వయం చేయని ప్రయత్నాలు లేవు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడెక్కడ చీల్చి చెండాడుతున్నారు. సీనియర్లు, గట్టి నేతలనుకున్న వారిని ఏదో విధంగా బీజేపీలోకి చేర్చుకుంటున్నారు.

టీఎంసికి చెందిన 29 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను బీజేపీలోకి లాగేసుకున్నారు. గెలుపు నీదా నాదా అన్నట్లుగా పోటీ హోరాహోరీగా జరుగుతోంది. ఆరోపణలు, విమర్శల విషయంలో ఇటు మమత అటు మోడి, షాలు అన్నీ హద్దులను దాటేశారు. అంటే ఇద్దరు కూడా గెలుపును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నది అర్ధమైపోతోంది. అందుకనే కాలికి బలమైన దెబ్బ తగిలినా లెక్కచేయకుండా మమత ప్రచారం చేస్తునే ఉన్నారు.

ఇలాంటి నేపధ్యంలో ఇంకా మూడు విడతల పోలింగ్ ఉండగానే ప్రచారానికి వెళ్ళకూడదన్న మమత నిర్ణయం సంచలనంగా మారింది. పెరిగిపోతున్న కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకునే తన బహిరంగసభలు, రోడ్డుషోలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. మూడో విడతలో మాత్రం సింబాలిక్ గా రోడ్డుషో, బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు. మమత ప్రచారాన్ని మానుకున్నంత మాత్రాన బీజేపీ రద్దు చేసుకునే అవకాశాలు లేవు.

ఎందుకంటే మూడు విడతల్లో ఎన్నికలంటే మామూలు విషయంకాదు. మమత ప్రచారం చేయకపోవటాన్ని మోడి, అమిత్ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంది. మమత లాగే బీజేపీ కూడా బహిరంగసభలు, రోడ్డుషోలు రద్దు చేసుకుంటే అది వేరే సంగతి. కానీ ఇప్పటివరకు మోడి, షా లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్ళే అవకాశాలే ఎక్కువున్నాయి. ఏరకంగా చూసినా మమత నిర్ణయం చివరకు కొంపముంచేసేట్లే ఉంది.

This post was last modified on April 20, 2021 11:18 am

Share
Show comments

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

8 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

8 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

10 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

10 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

15 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

16 hours ago