అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సీనే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ భారీ రేంజ్లో ఉంటుందని భావించినప్పటికీ.. ఆశించిన విధంగా ఓటర్లు పోలింగ్ బూత్లకు రాకపోవడం తెలిసిందే. దీంతో స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో 80శాతం పోలింగ్ నమోదైతే… పరిషత్లో ఇది భారీగా తగ్గిపోయింది. ఇక, ఇప్పుడు తిరుపతిలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు కూడా వైసీపీ నేతల చేతుల్లో ఉన్నాయి. ఈ ఏడు చోట్ల కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతుందని.. బ్యాలెట్ బాక్సులు నిండిపోవడం ఖాయమని అనుకున్నారు. అయితే.. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. ఉదయం 11 గంటల సమయానికి కేవలం 18శాతమే నమోదు కావడం గమనార్హం. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. గూడూరులోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే.. ఉదయం పది గంటల వరకు పది ఓట్లు కూడా నమోదుకాని పరిస్థితి ఉంది.
ఇక, శ్రీకాళహస్తిలో ఉదయం 10 గంటల సమయానికి కేవలం 5 శాతం ఓట్లు పడ్డాయి. తిరుపతిలో మాత్రం ఒకింత ఫర్వాలేదు.. అన్నట్టుగా ఉదయం 10 గంటలకు 15 శాతం పోలింగ్ నమోదైనా.. తర్వాత మళ్లీ మందగించింది. ఇలా.. మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ ఓటర్లు పోలింగ్ బూతులకు రాలేదనేది వాస్తవం. మరి దీనికి కారణం ఏంటి?
This post was last modified on April 17, 2021 2:44 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…