అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోనూ ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సీనే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. పరిషత్ ఎన్నికల్లో పోలింగ్ భారీ రేంజ్లో ఉంటుందని భావించినప్పటికీ.. ఆశించిన విధంగా ఓటర్లు పోలింగ్ బూత్లకు రాకపోవడం తెలిసిందే. దీంతో స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో 80శాతం పోలింగ్ నమోదైతే… పరిషత్లో ఇది భారీగా తగ్గిపోయింది. ఇక, ఇప్పుడు తిరుపతిలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.
తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు కూడా వైసీపీ నేతల చేతుల్లో ఉన్నాయి. ఈ ఏడు చోట్ల కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతుందని.. బ్యాలెట్ బాక్సులు నిండిపోవడం ఖాయమని అనుకున్నారు. అయితే.. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ.. ఉదయం 11 గంటల సమయానికి కేవలం 18శాతమే నమోదు కావడం గమనార్హం. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. గూడూరులోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే.. ఉదయం పది గంటల వరకు పది ఓట్లు కూడా నమోదుకాని పరిస్థితి ఉంది.
ఇక, శ్రీకాళహస్తిలో ఉదయం 10 గంటల సమయానికి కేవలం 5 శాతం ఓట్లు పడ్డాయి. తిరుపతిలో మాత్రం ఒకింత ఫర్వాలేదు.. అన్నట్టుగా ఉదయం 10 గంటలకు 15 శాతం పోలింగ్ నమోదైనా.. తర్వాత మళ్లీ మందగించింది. ఇలా.. మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ ఓటర్లు పోలింగ్ బూతులకు రాలేదనేది వాస్తవం. మరి దీనికి కారణం ఏంటి?
This post was last modified on April 17, 2021 2:44 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…