Political News

అపోలోనే పవన్ ఇంటికి వెళ్ళిందా ?

రాజు కోరుకుంటే కొండమీద కోతైనా రావాల్సిందే అనేది సామెత. ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో అదే జరిగినట్లుంది. ఈనెల 3వ తేదీనుండి పవన్ కు అనారోగ్యంగా ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో రోడ్డుషో, బహిరంగసభ తర్వాత పవన్ బయట ఎక్కడా కనబడలేదు. తర్వాత విషయం తెలిసిందేమంటే క్వారంటైన్లోకి వెళ్ళిపోయారని.

పవన్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారనగానే అందరికీ అనుమానం వచ్చేసింది. అయితే విషయాన్ని ఎవరు అదికారికంగా చెప్పలేదు. కానీ తాజాగా పవన్ కు కరోనా వైరస్ సోకిందని స్వయంగా జనసేన అధికారికంగా ప్రకటించింది. తన వ్యవసాయక్షేత్రంలోనే అవసరమైన చికిత్స చేయించుకుంటున్నట్లు కూడా ప్రెస్ నోట్లో స్పష్టంగా చెప్పారు. అలాగే చికిత్స చేయించుకుంటున్న ఫొటోను కూడా విడుదలచేశారు. ఆ ఫొటోలో పవన్ కు ఆక్సిజన్ ట్యూబ్ పెట్టినట్లు స్పష్టంగా కనబడుతోంది.

మామూలుగా అయితే కరోనా వైరస్ సోకిన వారిని వెంటనే ఆసుపత్రిలో చేరుస్తారు. కానీ పవన్ను మాత్రం ఆసుపత్రిలో చేర్చకుండా అపోలో ఆసుపత్రినే ఇంటికి తెచ్చినట్లుంది. ఎందుకంటే కరోనా సోకిందని తెలియగానే వెంటనే అపోలో వైద్యులు పవన్ ఇంటికివెళ్ళారట. వ్యవసాయక్షేత్రంలోనే తాత్కాలికంగా ప్రత్యేక ఐసీయుని ఏర్పాటు చేశారట. అపోలో ఆసుపత్రి వైద్యులు, మెడికల్ బృందం నిరంతరం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఎలాగూ అపోలో యాజమాన్యం అల్లుడన్న విషయం తెలిసిందే. అపోలో ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనవరాలు ఉపాసనను రామ్ చరణ్ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి పవన్ను ఆసుపత్రికి తరలించే బదులు అపోలోనే పవన్ వ్యవసాయక్షేత్రానికి తరలించినట్లున్నారు. అందుకనే ఫొటోలో ఆసుపత్రి బెడ్, అటెండెండ్ బెడ్ లాంటవన్నీ కనబడుతున్నాయి. ఏమైనా రాజు తలచుకుంటే దేనికి కొదవ ?

This post was last modified on April 17, 2021 11:46 am

Share
Show comments

Recent Posts

తండ్రి బాటలోనే పేర్ని కిట్టు

అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…

27 minutes ago

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

4 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

5 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

9 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

11 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

14 hours ago