రాజు కోరుకుంటే కొండమీద కోతైనా రావాల్సిందే అనేది సామెత. ఇపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో అదే జరిగినట్లుంది. ఈనెల 3వ తేదీనుండి పవన్ కు అనారోగ్యంగా ఉన్న విషయం తెలిసిందే. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో రోడ్డుషో, బహిరంగసభ తర్వాత పవన్ బయట ఎక్కడా కనబడలేదు. తర్వాత విషయం తెలిసిందేమంటే క్వారంటైన్లోకి వెళ్ళిపోయారని.
పవన్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారనగానే అందరికీ అనుమానం వచ్చేసింది. అయితే విషయాన్ని ఎవరు అదికారికంగా చెప్పలేదు. కానీ తాజాగా పవన్ కు కరోనా వైరస్ సోకిందని స్వయంగా జనసేన అధికారికంగా ప్రకటించింది. తన వ్యవసాయక్షేత్రంలోనే అవసరమైన చికిత్స చేయించుకుంటున్నట్లు కూడా ప్రెస్ నోట్లో స్పష్టంగా చెప్పారు. అలాగే చికిత్స చేయించుకుంటున్న ఫొటోను కూడా విడుదలచేశారు. ఆ ఫొటోలో పవన్ కు ఆక్సిజన్ ట్యూబ్ పెట్టినట్లు స్పష్టంగా కనబడుతోంది.
మామూలుగా అయితే కరోనా వైరస్ సోకిన వారిని వెంటనే ఆసుపత్రిలో చేరుస్తారు. కానీ పవన్ను మాత్రం ఆసుపత్రిలో చేర్చకుండా అపోలో ఆసుపత్రినే ఇంటికి తెచ్చినట్లుంది. ఎందుకంటే కరోనా సోకిందని తెలియగానే వెంటనే అపోలో వైద్యులు పవన్ ఇంటికివెళ్ళారట. వ్యవసాయక్షేత్రంలోనే తాత్కాలికంగా ప్రత్యేక ఐసీయుని ఏర్పాటు చేశారట. అపోలో ఆసుపత్రి వైద్యులు, మెడికల్ బృందం నిరంతరం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఎలాగూ అపోలో యాజమాన్యం అల్లుడన్న విషయం తెలిసిందే. అపోలో ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనవరాలు ఉపాసనను రామ్ చరణ్ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి పవన్ను ఆసుపత్రికి తరలించే బదులు అపోలోనే పవన్ వ్యవసాయక్షేత్రానికి తరలించినట్లున్నారు. అందుకనే ఫొటోలో ఆసుపత్రి బెడ్, అటెండెండ్ బెడ్ లాంటవన్నీ కనబడుతున్నాయి. ఏమైనా రాజు తలచుకుంటే దేనికి కొదవ ?
This post was last modified on April 17, 2021 11:46 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…