Political News

ముప్పేట చిక్కుల్లో జ‌గ‌న్‌.. వివేకా కేసులో సాక్ష్యం దొరికేసిందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత బాబాయి.. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించిన కేసు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటూ తేల‌లేదు. 2019, మార్చి 15న జ‌రిగిన ఈ హ‌త్య‌కు సంబంధించి వైసీపీ నేత‌లు అనేక ట‌ర్న్‌లు తీసుకున్నారు. ఈ కేసును సీబీఐ కూడా టేక‌ప్ చేసింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు నిందితులు ఎవ‌రు? అనేది ఇత‌మిత్థంగా బ‌య‌ట‌కు రాలేదు. ఒక‌వైపు వైఎస్ కుటుంబం నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సీఎం జ‌గ‌న్ కేంద్రంగా ఈ హ‌త్య కేసుకు సంబంధించి అనేక అనుమానాలు, విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇలా.. సాగుతున్న వివేకా కేసులో.. అనూహ్యంగా సంచ‌ల‌న మ‌లుపు చోటు చేసుకుంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్ట‌ర్ జ‌న‌రల్‌, ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కారుపై పోరాడుతున్న ఏబీ వెంకటేశ్వరరావు వివేకా హ‌త్య కేసుకు సంబంధించి త‌న ద‌గ్గ‌ర ఉన్న ఆధారాల‌ను స‌మ‌ర్పిస్తాన‌ని ముందుకు రావ‌డం.. ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఆయ‌న ఏకంగా సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఈ హత్య దర్యాప్తులో తనకు తెలిసిన సమాచారాన్ని సీబీఐకి అందిస్తానని రెండు సార్లు కోరినా.. వారి నుంచి స్పందన రాలేదని లేఖలో పేర్కొన్న ఆయ‌న‌.. నిఘా విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి వెళితే వారిని లోనికి రానీయకుండా ఎంపీ అవినాష్ రెడ్డి అడ్డుకున్నారని లేఖలో తెలిపారు.

వివేకా హత్య కేసులో ఆసక్తికర విషయాన్ని బయటపెడుతూ ఏబీ సీబీఐకి లేఖను సంధించారు. 2019 మార్చి 15న పులివెందులలో వివేకా ఆయన స్వగృహంలో మరణించారన్న వెంకటేశ్వరరావు.. గుండెపోటుతో ప్రమాదవశాత్తూ బాత్రూంలో జారిపడి మరణించారని మధ్యాహ్నం వరకు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైందని లేఖలో తెలిపారు. ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లిన తర్వాత హత్య కేసుగా తేలిందని ఆయన లేఖలో గుర్తుచేశారు. ఆసుపత్రికి చేరేవరకు మృతదేహం వారి బంధువుల ఆధీనంలోనే ఉందని వివరించారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఎన్.ఎం సింగ్ నేతృత్వంలో బృందం వైఎస్ వివేకా కేసు దర్యాప్తు చేస్తుందన్న వెంకటేశ్వరరావు.. రెండు సార్లు ఆయన్ని ఫోన్లో సంప్రదించినట్లు తెలిపారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి తన వద్ద ఉన్న వివరాలను అందజేస్తానని చెప్పినట్లు వివరించారు. కేసు దర్యాప్తునకు ఉపయోగపడతాయని జేడీకి తెలిపినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన తాను కేసు దర్యాప్తునకు సహకరిస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా.. ఏ అధికారీ పట్టించుకోకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. ఏపీ నిఘా విభాగం వద్ద ఉన్న అప్పటి సమాచారాన్ని తీసుకునేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలని.. ప్రస్తుత అధికారులను వివరాలను అడిగి తెలుసుకోవాలని లేఖలో కోరారు. ఈ ప‌రిణామంతో సీఎం జ‌గ‌న్ అడ్డంగా ఇరుక్కున్నార‌నే వాద‌న వ‌స్తోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on April 16, 2021 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

4 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago