Political News

ఇక‌, ఓటుకు నోటు.. కేసు లేన‌ట్టేనా.. కేసీఆర్‌.. వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌

త‌న ప‌క్షం కాకుంటే.. ఒక‌లా ? త‌న ప‌క్షంలో చేరితే ఒక‌లా మారిపోయే రాజ‌కీయాలు ఇప్పుడు కొత్త‌కాదు. ప్ర‌తిపక్షంలో ఉన్న‌వారు ఏం చేసినా త‌ప్పులుగా చూసే.. అధికార ప‌క్షం.. వారే అధికార ప‌క్షానికి కొమ్ము కాస్తే.. మాత్రం ఆ త‌ప్పులు కూడా ఒప్పులు అయిపోవ‌డం ఖాయం. రాజ‌కీయాల్లో ఇదో అంటు వ్యాధి మాదిరిగా మారిపోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌పై ఉన్న వివాదాల‌ను, కేసుల‌ను, వారి స‌మ‌స్య‌ల‌ను కూడా అధికార ప‌క్షం త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌త్య‌ర్థి పార్టీలే ఉండొద్ద‌న్న‌ట్టుగా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రిగిన విష‌యాన్నే తీసుకుంటే.. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున గెలిచిన స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌.. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర‌రావును టీఆర్ఎస్‌లో క‌లిపేసుకుని.. టీడీఎల్పీని విలీనం చేసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే. వీర‌య్య‌.. గ‌తంలో స్టీఫెన్ స‌న్ కేసులో అంటే.. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే (స్టీఫెన్‌స‌న్‌) ఓటు కోసం.. డ‌బ్బు లు ఇవ్వ జూపార‌నేది ఇక్క‌డ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీనికి సంబంధించి 2015లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ కేసులోనే అప్ప‌టి ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ఉన్నార‌నే పేరు వినిపించింది.

ఈ కేసు ఇలా సాగుతున్న క్ర‌మంలోనే రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఉన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. ఇక‌, చంద్ర‌బాబు హైద‌రాబాద్ నుంచి ఏకంగా మ‌కాం మార్చారు. ఇక‌, వెంక‌ట వీర‌య్య‌.. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచే వ‌ర‌కు టీడీపీలో ఉన్నా.. ప‌రోక్షంగా కేసీఆర్‌కు అనుకూలంగా వ్య‌వహ‌రిస్తున్నారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ నేరుగా ఈయ‌న‌ను పార్టీలోకి చేర్చుకున్నారు. కానీ, ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. ఓటుకు నోటు కేసును ఉపేక్షించేది లేద‌ని.. నిందితులు ఎంత‌వారైనా కోర్టుకు ఈడుస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే కేసులో నిందితులుగా ఉన్న వీర‌య్య‌ను త‌న పార్టీలోకి చేర్చుకోవ‌డం.

ఇక ఈ కేసు ఎంత సీరియ‌స్‌గా ఉందంటే.. వీర‌య్య ఇటీవ‌ల డిశ్చార్జ్ పిటిష‌న్ వేసినా.. ఏసీబీ కోర్టు తోసిపు చ్చింది. అంటే.. ఏసీబీ కోర్టు.. అది కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని విభాగ‌మే త‌ప్పు చేసిన‌ట్టు తేల్చ‌గా.. ఇప్పుడు ఈ కేసును తేల్చేస్తాను..అన్న కేసీఆర్‌.. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్మ‌యం క‌లిగిస్తోంది. త‌న‌కు చాలినంత బ‌లం ఉన్నప్ప‌టికీ.. ఇలా చేయ‌డం కేసీఆర్ రెండునాల్క‌ల ధోర‌ణికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 10, 2021 2:05 pm

Share
Show comments

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

39 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

3 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago