త్వరలో తాను రాజకీయ పార్టీ పెడతానని.. అందుకు సంబంధించిన వివరాల్ని ఖమ్మం సభలో వెల్లడిస్తానని చెప్పిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల అనుకున్నట్లే సభను పూర్తి చేశారు. అనుకోనిరీతిలో.. తాను పెట్టబోయే పార్టీ పేరును ఇప్పుడు కాదని.. వైఎస్ జయంతి రోజున వెల్లడిస్తానని చెప్పి.. మరింత ఉత్కంఠకు తెర తీశారు. తల్లి విజయమ్మతో కలిసి ఖమ్మం సభకు హాజరైన ఆమె ఉత్సాహంగా కనిపించారు.
స్టేజ్ మీదకు వచ్చిన ఆమె.. చేతులు ఊపటం.. రెండు చేతులు జోడించిన అభివాదం చేయటం లాంటి పనులు చేసినప్పుడు.. దివంగత మహానేత వైఎస్ ను గుర్తుకు తెచ్చేలా చేశారని చెప్పాలి. షర్మిల అభివాదం అచ్చుగుద్దినట్లుగా రాజన్న మాదిరే ఉందని అందరు అనుకోవటం కనిపించింది. స్టేజ్ మీదకు వచ్చినంతనే.. వేదిక ముందున్న వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆమె.. వేదిక మొత్తం కలియతిరిగారు.
సభకు వచ్చిన వారందరిని అభివాదం చేశారు. వైఎస్ మాదిరే ఎడమ చేతిని గాల్లో ఊపుతూ సభకు హాజరైన వారిని అభివాదం చేశారు. ఆయన మాదిరే రెండు చేతుల్ని పైకెత్తి అభివాదం చేశారు. వేదిక మీద ఉన్న విజయమ్మ.. కుమార్తెకు ముద్దుపెట్టి.. తన ఆశీస్సుల్ని అందించారు. మొత్తంగా ఖమ్మం సభలో పదే పదే వైఎస్ ను గుర్తుకు తేవటంలో షర్మిల సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…