త్వరలో తాను రాజకీయ పార్టీ పెడతానని.. అందుకు సంబంధించిన వివరాల్ని ఖమ్మం సభలో వెల్లడిస్తానని చెప్పిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల అనుకున్నట్లే సభను పూర్తి చేశారు. అనుకోనిరీతిలో.. తాను పెట్టబోయే పార్టీ పేరును ఇప్పుడు కాదని.. వైఎస్ జయంతి రోజున వెల్లడిస్తానని చెప్పి.. మరింత ఉత్కంఠకు తెర తీశారు. తల్లి విజయమ్మతో కలిసి ఖమ్మం సభకు హాజరైన ఆమె ఉత్సాహంగా కనిపించారు.
స్టేజ్ మీదకు వచ్చిన ఆమె.. చేతులు ఊపటం.. రెండు చేతులు జోడించిన అభివాదం చేయటం లాంటి పనులు చేసినప్పుడు.. దివంగత మహానేత వైఎస్ ను గుర్తుకు తెచ్చేలా చేశారని చెప్పాలి. షర్మిల అభివాదం అచ్చుగుద్దినట్లుగా రాజన్న మాదిరే ఉందని అందరు అనుకోవటం కనిపించింది. స్టేజ్ మీదకు వచ్చినంతనే.. వేదిక ముందున్న వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆమె.. వేదిక మొత్తం కలియతిరిగారు.
సభకు వచ్చిన వారందరిని అభివాదం చేశారు. వైఎస్ మాదిరే ఎడమ చేతిని గాల్లో ఊపుతూ సభకు హాజరైన వారిని అభివాదం చేశారు. ఆయన మాదిరే రెండు చేతుల్ని పైకెత్తి అభివాదం చేశారు. వేదిక మీద ఉన్న విజయమ్మ.. కుమార్తెకు ముద్దుపెట్టి.. తన ఆశీస్సుల్ని అందించారు. మొత్తంగా ఖమ్మం సభలో పదే పదే వైఎస్ ను గుర్తుకు తేవటంలో షర్మిల సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.
This post was last modified on April 10, 2021 10:55 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…