త్వరలో తాను రాజకీయ పార్టీ పెడతానని.. అందుకు సంబంధించిన వివరాల్ని ఖమ్మం సభలో వెల్లడిస్తానని చెప్పిన దివంగత మహానేత వైఎస్ కుమార్తె షర్మిల అనుకున్నట్లే సభను పూర్తి చేశారు. అనుకోనిరీతిలో.. తాను పెట్టబోయే పార్టీ పేరును ఇప్పుడు కాదని.. వైఎస్ జయంతి రోజున వెల్లడిస్తానని చెప్పి.. మరింత ఉత్కంఠకు తెర తీశారు. తల్లి విజయమ్మతో కలిసి ఖమ్మం సభకు హాజరైన ఆమె ఉత్సాహంగా కనిపించారు.
స్టేజ్ మీదకు వచ్చిన ఆమె.. చేతులు ఊపటం.. రెండు చేతులు జోడించిన అభివాదం చేయటం లాంటి పనులు చేసినప్పుడు.. దివంగత మహానేత వైఎస్ ను గుర్తుకు తెచ్చేలా చేశారని చెప్పాలి. షర్మిల అభివాదం అచ్చుగుద్దినట్లుగా రాజన్న మాదిరే ఉందని అందరు అనుకోవటం కనిపించింది. స్టేజ్ మీదకు వచ్చినంతనే.. వేదిక ముందున్న వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆమె.. వేదిక మొత్తం కలియతిరిగారు.
సభకు వచ్చిన వారందరిని అభివాదం చేశారు. వైఎస్ మాదిరే ఎడమ చేతిని గాల్లో ఊపుతూ సభకు హాజరైన వారిని అభివాదం చేశారు. ఆయన మాదిరే రెండు చేతుల్ని పైకెత్తి అభివాదం చేశారు. వేదిక మీద ఉన్న విజయమ్మ.. కుమార్తెకు ముద్దుపెట్టి.. తన ఆశీస్సుల్ని అందించారు. మొత్తంగా ఖమ్మం సభలో పదే పదే వైఎస్ ను గుర్తుకు తేవటంలో షర్మిల సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…