Political News

జైలు మీకేమైనా కొత్తా జగన్ – ఉండవల్లి

సంచలన వ్యాఖ్యలు చేయటంలో సీనియర్ నేత ఉండవల్లి ముందుంటారు. అద్భుతమైన వాగ్ధాటి.. అంతకు మించి ఆయన మాటల్లో లాజిక్కు కట్టిపారేస్తూ ఉంటుంది. తెలుగు నేల మీద విషయాల మీద విపరీతమైన పట్టుతో పాటు.. అంతకు మించిన విషయం ఏదైనా సరే.. అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సులువుగా విషయాల్ని ఆయన చెప్పేస్తుంటారు. అలాంటి ఉండవల్లి.. తాజాగా సీఎం జన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటు చేతుల్లో పెట్టాలని డిసైడ్ చేసిన వేళ.. అందుకు వ్యతిరేకంగా పోరాడాలంటూ పిలుపునివ్వటమే కాదు.. వైఎస్ఆర్ కొడుకుగా భయపటం అనేది ఉండొద్దని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడిన ఉండవల్లి.. ఈ అంశంపై జగన్ ఎలా రియాక్ట్ కావాలో చెప్పే ప్రయత్నం చేశారు.

‘‘జైలుకు వెళ్లటం కొత్తా నీకు. పోతే జైలుకే పోతారు. జైలుకెళ్లు. దేనికి భయపడటం? ఇప్పుడు జరుగుతోంది.. సోషలిజం వర్సెస్ క్యాప్టలిజం. మీరు నాయకత్వం తీసుకోండి. ఇవాళ మీరు కానీ వెనకడుగు వేస్తే.. అది మీ తప్పుగానే జనం భావిస్తారు. ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజల వెంట నిలుస్తారా? లేదంటే మోడీ.. అమిత్ షాల మాటలు వింటారా అన్నది తేల్చుకోండి’’ అని పేర్కొన్నారు.

51 శాతం ఓట్లు.. 151 సీట్లు ఏ రాష్ట్రంలోనూ రాలేదని.. భయపడటం వైఎస్ఆర్ కొడుకు చేయాల్సింది కాదన్నారు. రాష్ట్రంలో అధికార.. ప్రతిపక్షాలు పరస్పరం అవినీతి ఆరోపనలు చేసుకుంటున్నాయి. అవినీతి కారణంగా కేంద్రంతో పోరాడలేకపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోందని.. భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకు భయపడాలి? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవటానికి విశాఖలో సెమినార్ పెట్టాలని.. వైజాగ్ డిక్లరేషన్ ఇద్దామన్న ఉండవల్లి మాటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో?

This post was last modified on April 5, 2021 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

2 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

3 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

4 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

4 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

4 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

4 hours ago