సంచలన వ్యాఖ్యలు చేయటంలో సీనియర్ నేత ఉండవల్లి ముందుంటారు. అద్భుతమైన వాగ్ధాటి.. అంతకు మించి ఆయన మాటల్లో లాజిక్కు కట్టిపారేస్తూ ఉంటుంది. తెలుగు నేల మీద విషయాల మీద విపరీతమైన పట్టుతో పాటు.. అంతకు మించిన విషయం ఏదైనా సరే.. అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత సులువుగా విషయాల్ని ఆయన చెప్పేస్తుంటారు. అలాంటి ఉండవల్లి.. తాజాగా సీఎం జన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటు చేతుల్లో పెట్టాలని డిసైడ్ చేసిన వేళ.. అందుకు వ్యతిరేకంగా పోరాడాలంటూ పిలుపునివ్వటమే కాదు.. వైఎస్ఆర్ కొడుకుగా భయపటం అనేది ఉండొద్దని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడిన ఉండవల్లి.. ఈ అంశంపై జగన్ ఎలా రియాక్ట్ కావాలో చెప్పే ప్రయత్నం చేశారు.
‘‘జైలుకు వెళ్లటం కొత్తా నీకు. పోతే జైలుకే పోతారు. జైలుకెళ్లు. దేనికి భయపడటం? ఇప్పుడు జరుగుతోంది.. సోషలిజం వర్సెస్ క్యాప్టలిజం. మీరు నాయకత్వం తీసుకోండి. ఇవాళ మీరు కానీ వెనకడుగు వేస్తే.. అది మీ తప్పుగానే జనం భావిస్తారు. ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజల వెంట నిలుస్తారా? లేదంటే మోడీ.. అమిత్ షాల మాటలు వింటారా అన్నది తేల్చుకోండి’’ అని పేర్కొన్నారు.
51 శాతం ఓట్లు.. 151 సీట్లు ఏ రాష్ట్రంలోనూ రాలేదని.. భయపడటం వైఎస్ఆర్ కొడుకు చేయాల్సింది కాదన్నారు. రాష్ట్రంలో అధికార.. ప్రతిపక్షాలు పరస్పరం అవినీతి ఆరోపనలు చేసుకుంటున్నాయి. అవినీతి కారణంగా కేంద్రంతో పోరాడలేకపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోందని.. భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకు భయపడాలి? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవటానికి విశాఖలో సెమినార్ పెట్టాలని.. వైజాగ్ డిక్లరేషన్ ఇద్దామన్న ఉండవల్లి మాటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో?
This post was last modified on April 5, 2021 10:34 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…