Political News

ఎందుకు మోడి తమిళనాడును పట్టించుకోవటంలేదు ?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే మిత్రపక్షంగా బీజేపీ 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. నిజానికి ఎన్నికలు జరుగుతున్న పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. అలాంటి రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్దగా పట్టించుకోవటం లేదు. అన్నాడీఎంకే పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధులను వదిలిపెట్టేస్తే కనీసం తమ పార్టీ అభ్యర్ధుల తరపున కూడా మోడి ప్రచారానికి ఇష్టపడటంలేదు.

అతికష్టంమీద శుక్రవారం మధురైలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఒకవైపు పోలింగ్ దగ్గరకు వచ్చేస్తోంది. మరోవైపు గెలుపు విషయంలో అభ్యర్ధులు అల్లాడిపోతున్నారు. అందుకనే ప్రచారంలో మోడి పాల్గొనాలని చాలామంది నేతలు అడుతున్నారట. అయినా ఎందుకనో తమిళనాడులో ప్రచారం చేయటానికి మోడి పెద్దగా ఇష్టపడటంలేదు. మధురై సభలో పాల్గొనటం కూడా ముఖ్యమంత్రి పళనిస్వామి, బీజేపీ అధ్యక్షుడు పదే పదే అడిగిన తర్వాతే అంగీకరించారట.

చూడబోతే జరగబోయే ఎన్నికల్లో ఫలితాల విషయంలో మోడికి మంచి క్లారిటినే ఉన్నట్లుంది. ప్రీపోల్ కు సంబంధించి ఏ సర్వే చూసినా అధికారంలోకి రాబోయేది డీఎంకేనే అని బల్లగుద్ది చెప్పాయి. దాంతోనే అన్నాడీఎంకే+బీజేపీ,మిత్రపక్షాలు డీలా పడిపోయాయి. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతోనే అన్నాడీఎంకేలో నుండి బహిష్కరణకు గురైన శశికళను మళ్ళీ పార్టీలోకి రావాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ శెల్వం ప్రకటించింది.

శశికళకు ఉన్న ఇమేజిని ఉపయోగించుకుని ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న ప్లాన్ కనబడుతోంది. అయితే పన్నీర్ ఆహ్వానంపై చిన్నమ్మ పెద్దగా స్పందించినట్లు లేరు. అందుకనే ఏమి చేయాలో దిక్కుతోచక వాళ్ళే అవస్తలు పడుతున్నారు. ఇదే సమయంలో ప్రచారంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధి కూడా తమిళనాడులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వీళ్ళు కాకుండా ఇంకా మరికొన్ని కూటములు కూడా పోటీలో ఉన్నాయి. కాబట్టి తమిళనాడు రాజకీయాలంతా కలగాపులగం అయిపోయాయి. ఎవరి విషయం ఎలాగున్నా తమిళనాడు విషయంలో మోడికి పిచ్చక్లారిటినే ఉన్నట్లుంది.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

2 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

2 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

4 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

6 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

7 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

7 hours ago