జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి జరిగిన రోడ్డుషో, తర్వాత బహిరంగసభ చూసిన తర్వాత అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. తిరుపతి లోక్ సభలో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ తన గెలుపు విషయంలో పవన్ పై చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అయితే తాజా పరిణామాల తర్వాత అలాంటి ఆశలు ఫలించేట్లు కనబడటంలేదు. ఎందుకంటే పవన్ పాల్గొన్న రోడ్డుషో అయినా తర్వాత జరిగిన బహిరంగసభ అయినా చాలా పేలవంగా జరిగింది.
పవన్ రోడ్డుషో లోకానీ తర్వాత జరిగిన బహిరంగసభలో కానీ అంతా కనబడిందేమిటంటే ఒకే ఒక అంశం. అదేమిటంటే పవన్ను ఉద్దేశించి అభిమానులు సీఎం..సీఎం అని అరవటం. మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో కూడా అభిమానులు ఇదే విధంగా పవన్ సమావేశాల్లో నానా గోలచేసిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో తాను అధికారంలోకి వచ్చేసినట్లే అని పవన్ భ్రమల్లో పడిపోయారు.
అయితే తర్వాత జరిగిన ఫలితాల్లో ఏమి తేలిందో అందరు చూసిందే. దాంతో అభిమానులపై పవన్ మండిపడ్డారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ తన బహిరంగసభలకు, రోడ్డుషోలకు వచ్చిన అభిమానులు కూడా తనకు ఓట్లేయలేదంటు నిష్టూరాలాడారు. ఓట్లేయని అభిమానులు తనను సీఎం..సీఎం అని అరిచినంత మాత్రాన ఏమిటి ఉపయోగం ? అంటూ నిలదీశారు. తన రోడ్డుషోల్లో, బహిరంగసభలో పాల్గొన్న అభిమానులు ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారా ? అంటూ మండిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుషో, బహిరంగసభలో కూడా జరిగిందిదే. ఇదే సమయంలో బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ప్రసంగం పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. ప్రశాంతంగా మాట్లాడిన పవన్ మధ్యలో మధ్యలో ఊరికే ఆవేశం తెచ్చుకుని ఊగిపోయి మాట్లాడారు. నిజానికి ఆవేశంలో మాట్లాడినపుడు పవన్ ఏమి మాట్లాడింది కూడా జనాలకు అర్ధంకాలేదు. మొత్తానికి తమను ఎన్నికల్లో గట్టెక్కిస్తాడని పవన్ మీద బీజేపీ పెట్టుకున్న ఆశలు ఫలించేట్లు కనబడటంలేదు.
This post was last modified on April 4, 2021 11:45 am
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…