జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి జరిగిన రోడ్డుషో, తర్వాత బహిరంగసభ చూసిన తర్వాత అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. తిరుపతి లోక్ సభలో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ తన గెలుపు విషయంలో పవన్ పై చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అయితే తాజా పరిణామాల తర్వాత అలాంటి ఆశలు ఫలించేట్లు కనబడటంలేదు. ఎందుకంటే పవన్ పాల్గొన్న రోడ్డుషో అయినా తర్వాత జరిగిన బహిరంగసభ అయినా చాలా పేలవంగా జరిగింది.
పవన్ రోడ్డుషో లోకానీ తర్వాత జరిగిన బహిరంగసభలో కానీ అంతా కనబడిందేమిటంటే ఒకే ఒక అంశం. అదేమిటంటే పవన్ను ఉద్దేశించి అభిమానులు సీఎం..సీఎం అని అరవటం. మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో కూడా అభిమానులు ఇదే విధంగా పవన్ సమావేశాల్లో నానా గోలచేసిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో తాను అధికారంలోకి వచ్చేసినట్లే అని పవన్ భ్రమల్లో పడిపోయారు.
అయితే తర్వాత జరిగిన ఫలితాల్లో ఏమి తేలిందో అందరు చూసిందే. దాంతో అభిమానులపై పవన్ మండిపడ్డారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ తన బహిరంగసభలకు, రోడ్డుషోలకు వచ్చిన అభిమానులు కూడా తనకు ఓట్లేయలేదంటు నిష్టూరాలాడారు. ఓట్లేయని అభిమానులు తనను సీఎం..సీఎం అని అరిచినంత మాత్రాన ఏమిటి ఉపయోగం ? అంటూ నిలదీశారు. తన రోడ్డుషోల్లో, బహిరంగసభలో పాల్గొన్న అభిమానులు ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తారా ? అంటూ మండిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుషో, బహిరంగసభలో కూడా జరిగిందిదే. ఇదే సమయంలో బహిరంగ సభలో మాట్లాడిన పవన్ ప్రసంగం పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. ప్రశాంతంగా మాట్లాడిన పవన్ మధ్యలో మధ్యలో ఊరికే ఆవేశం తెచ్చుకుని ఊగిపోయి మాట్లాడారు. నిజానికి ఆవేశంలో మాట్లాడినపుడు పవన్ ఏమి మాట్లాడింది కూడా జనాలకు అర్ధంకాలేదు. మొత్తానికి తమను ఎన్నికల్లో గట్టెక్కిస్తాడని పవన్ మీద బీజేపీ పెట్టుకున్న ఆశలు ఫలించేట్లు కనబడటంలేదు.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…