Political News

సైన్యం రెచ్చిపోయింది..114 మంది చనిపోయారు

మయున్మార్లో సైన్యం రెచ్చిపోయింది. సైనికపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన చివరకు హింసాత్మకంగా మారిపోయింది. ప్రజలకు, సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణ చివరకు తారాస్ధాయికి చేరుకున్నది. సహనం కోల్పోయిన సైన్యం జరిపిన కాల్పుల్లో 114 మంది మరణించటం అంతర్జాతీయస్ధాయిలో సంచలనంగా మారింది. సైన్యం కాల్పుల్లో ఇంతమంది ఒకేరోజు చనిపోవటం బహుశా ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద హింసా ఘటనగా చెప్పుకుంటున్నారు.

చాలా కాలంగా మయున్మార్ సైనికపాలనలోన మగ్గుతోంది. జరిగిన ఎన్నికలను కూడా సైన్యాధికారులు లెక్కచేయలేదు. దాంతో మొత్తం దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టేసుకున్నారు. సైన్యం చర్యలకు వ్యతిరేకంగా, సైన్యంపాలనను నిరసిస్తు దేశవ్యాప్తంగా జనాలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇది హింసాత్మకంగా కూడా అవుతోంది. అయితే శనివారం 76వ సైనికదినోత్సవం జరిగింది.

కాబట్టి శనివారం జనాలు మరింతగా తిరగబడే ప్రమాదాన్ని ముందుగా ఊహించిన సైన్యాధికారులు జనాలను రోడ్లపైకి రావద్దని శుక్రవారమే తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. రోడ్లపైకి వస్తే కాల్చేస్తామని కూడా వార్నింగులిచ్చారు. అయినా జనాలు పట్టించుకోకుండా శనివారం ఉదయం నుండే రోడ్లపైకి వచ్చేశారు. పెద్దఎత్తున రోడ్లపైకి చేరుకుని సైన్యానికి వ్యతిరేకంగా ర్యాలీలు, నినాదాలు మొదలుపెట్టారు. దీంతో అక్కడక్కడ ప్రజలు-సైన్యానికి మధ్య ఘర్ణణలు జరిగాయి.

రోడ్లపైకి రావద్దని చెప్పినా వినకుండా రావటమే కాకుండా తమనే ఎదిరిస్తున్నారన్న కోపంతో సైన్యం రగిలిపోయి ఆందోళనకారులపై కాల్పులు మొదలుపెట్టింది. దేశంలోని 40 ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో అధికారికంగా 114 మంది చనిపోయారు. అయితే ఈ సంఖ్య సుమారు 400 దాకా ఉండచ్చని స్ధానిక మీడియా చెబుతోంది. బుల్లెట్ గాయాలతో కొన్ని వందలమంది పారిపోయారని వారంతా ఏమయ్యారో తెలీదని అంటున్నారు.

బుల్లెట్ గాయాలైన కొందరు మణిపూర్ సరిహద్దుల్లోకి వచ్చేసి భారత్ లోకి ప్రవేశించారు. వీరిని గుర్తించిన మనసైన్యాధికారులు వెంటనే ఆసుపత్రులకు తరలించారు. ఇలాంటి వాళ్ళు సరిహద్దుల్లో ఇంకెంతమందున్నారో ఎవరికీ తెలీటంలేదు. ఒకటిరెండు రోజులైతే కానీ గ్రౌండ్ రియాలిటి ఏమిటో బయటపడదని రెడ్ క్రాస్ లాంటి అంతర్జాతీయ సంస్ధలు అనుకుంటున్నాయి. మొత్తానిక సైన్యంకాల్పుల్లో మామూలు జనాలు చనిపోవటం బాధాకరమనే చెప్పాలి.

This post was last modified on March 28, 2021 11:22 am

Share

Recent Posts

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

1 hour ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

2 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

3 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

3 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

4 hours ago

గుర్తించాల్సిన ‘ఎపిక్’ నిజాలు ఇవే

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…

4 hours ago