Political News

సైన్యం రెచ్చిపోయింది..114 మంది చనిపోయారు

మయున్మార్లో సైన్యం రెచ్చిపోయింది. సైనికపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన చివరకు హింసాత్మకంగా మారిపోయింది. ప్రజలకు, సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణ చివరకు తారాస్ధాయికి చేరుకున్నది. సహనం కోల్పోయిన సైన్యం జరిపిన కాల్పుల్లో 114 మంది మరణించటం అంతర్జాతీయస్ధాయిలో సంచలనంగా మారింది. సైన్యం కాల్పుల్లో ఇంతమంది ఒకేరోజు చనిపోవటం బహుశా ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద హింసా ఘటనగా చెప్పుకుంటున్నారు.

చాలా కాలంగా మయున్మార్ సైనికపాలనలోన మగ్గుతోంది. జరిగిన ఎన్నికలను కూడా సైన్యాధికారులు లెక్కచేయలేదు. దాంతో మొత్తం దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టేసుకున్నారు. సైన్యం చర్యలకు వ్యతిరేకంగా, సైన్యంపాలనను నిరసిస్తు దేశవ్యాప్తంగా జనాలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇది హింసాత్మకంగా కూడా అవుతోంది. అయితే శనివారం 76వ సైనికదినోత్సవం జరిగింది.

కాబట్టి శనివారం జనాలు మరింతగా తిరగబడే ప్రమాదాన్ని ముందుగా ఊహించిన సైన్యాధికారులు జనాలను రోడ్లపైకి రావద్దని శుక్రవారమే తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. రోడ్లపైకి వస్తే కాల్చేస్తామని కూడా వార్నింగులిచ్చారు. అయినా జనాలు పట్టించుకోకుండా శనివారం ఉదయం నుండే రోడ్లపైకి వచ్చేశారు. పెద్దఎత్తున రోడ్లపైకి చేరుకుని సైన్యానికి వ్యతిరేకంగా ర్యాలీలు, నినాదాలు మొదలుపెట్టారు. దీంతో అక్కడక్కడ ప్రజలు-సైన్యానికి మధ్య ఘర్ణణలు జరిగాయి.

రోడ్లపైకి రావద్దని చెప్పినా వినకుండా రావటమే కాకుండా తమనే ఎదిరిస్తున్నారన్న కోపంతో సైన్యం రగిలిపోయి ఆందోళనకారులపై కాల్పులు మొదలుపెట్టింది. దేశంలోని 40 ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో అధికారికంగా 114 మంది చనిపోయారు. అయితే ఈ సంఖ్య సుమారు 400 దాకా ఉండచ్చని స్ధానిక మీడియా చెబుతోంది. బుల్లెట్ గాయాలతో కొన్ని వందలమంది పారిపోయారని వారంతా ఏమయ్యారో తెలీదని అంటున్నారు.

బుల్లెట్ గాయాలైన కొందరు మణిపూర్ సరిహద్దుల్లోకి వచ్చేసి భారత్ లోకి ప్రవేశించారు. వీరిని గుర్తించిన మనసైన్యాధికారులు వెంటనే ఆసుపత్రులకు తరలించారు. ఇలాంటి వాళ్ళు సరిహద్దుల్లో ఇంకెంతమందున్నారో ఎవరికీ తెలీటంలేదు. ఒకటిరెండు రోజులైతే కానీ గ్రౌండ్ రియాలిటి ఏమిటో బయటపడదని రెడ్ క్రాస్ లాంటి అంతర్జాతీయ సంస్ధలు అనుకుంటున్నాయి. మొత్తానిక సైన్యంకాల్పుల్లో మామూలు జనాలు చనిపోవటం బాధాకరమనే చెప్పాలి.

This post was last modified on March 28, 2021 11:22 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

59 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago