కరోనా కట్టడి కోసం భారత్ తో సహా పలు దేశాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తోన్న సంగతి తెలసిిందే. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో లాక్ డౌన్ 4.0 తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే విధించిన మూడు లాక్ డౌన్ ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఘోరంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు వారిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని సూచిస్తున్నారు. మే 17తో లాక్ డౌన్ 3.0 గడువు ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ రేపు భేటీ కానున్నారు.
లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి…లాక్ డౌన్ ఎత్తివేయాలా…. కొనసాగించాలా అన్న అంశాలపై సీఎంలతో మోడీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. వలస కూలీల తరలింపు, రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడం వంటి అంశాలను కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.లాక్ డౌన్ విధించిన తర్వాత సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఐదోసారి.
ప్రతిసారి సీఎంల సలహాలు తీసుకునే మోడీ…వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రుల మాట మోడీ వినడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. గత వీడియో కాన్ఫరెన్స్ ల అనుభవాలను బట్టి సీఎంల మాట మోడీ వినడం లేదనిపిస్తోంది.
వలస కూలీల విషయంలో సీఎంలు చాలా సార్లు మొరపెట్టుకున్న తర్వాతే మోడీ ఓ నిర్ణయం తీసుకున్నారు. 40 రోజుల నరకయాతన అనుభవించిన తర్వాత వలస కూలీలకు మోక్షం లభించింది. అది కూడా వలస కూలీల విషయం అంతర్జాతీయంగా హైలైట్ అయింది. దీంతో, మోడీపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల తర్వాతే మోడీ స్పందించారన్న విమర్శలు వస్తున్నాయి.
వలస కార్మికుల విషయంలో మోడీ వ్యవహార శైలి వల్ల… ప్రపంచ వ్యాప్తంగా మోడీ ప్రతిష్ట మసక బారిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు, ఢిల్లీ-మర్కజ్ కాంటాక్టులు పట్టుకోవడంలో విఫలం కావడం….టెక్నాలజీ వాడటంలో విఫలం కావడం వంటివి మోడీకి ప్రతికూలంగా మారాయి. లాక్ డౌన్ సరైన సమయానికి విధించినా… అంతర్జాతీయ విమానాల విషయంలో మోడీ విఫలమయ్యారన్న వాదన వినిపిస్తోంది.
కేరళలో కేసులు నమోదవుతున్న సమయంలో..వుహాన్ నుంచి మెడికోలను క్వారంటైన్ లో పెట్టిన సమయంలోనే అంతర్జాతీయ విమానాలను ఆపి ఉంటే…కేసుల తీవ్రత ఇంత ఉండేది కాదన్న వాదన ఉంది. మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహానికి కారణం కూడా అదేనన్న ప్రచారం జరుగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతర్జాతీయ విమానాలను నిలిపివేయకుండా, లాక్ డౌన్ ల మీద లాక్ డౌన్ లు విధించడం వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయన్నది సీఎంల వాదన. మరి, ఈ సారైనా సీఎంల మొరను మోడీ సాబ్ ఆలకిస్తారో లేదో చూడాలి.
This post was last modified on May 10, 2020 5:25 pm
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…
దర్శకుడిగా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ.. దేవా కట్టాకు ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ‘వెన్నెల’…