Political News

మోడీ గారు… మీకర్థమవుతోందా?

కరోనా కట్టడి కోసం భారత్ తో సహా పలు దేశాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తోన్న సంగతి తెలసిిందే. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో లాక్ డౌన్ 4.0 తప్పదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే విధించిన మూడు లాక్ డౌన్ ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, ప్రజల ఆర్థిక స్థితిగతులు ఘోరంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు వారిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని సూచిస్తున్నారు. మే 17తో లాక్ డౌన్ 3.0 గడువు ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ రేపు భేటీ కానున్నారు.

లాక్ డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి…లాక్ డౌన్ ఎత్తివేయాలా…. కొనసాగించాలా అన్న అంశాలపై సీఎంలతో మోడీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. వలస కూలీల తరలింపు, రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడం వంటి అంశాలను కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.లాక్ డౌన్ విధించిన తర్వాత సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఐదోసారి.

ప్రతిసారి సీఎంల సలహాలు తీసుకునే మోడీ…వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రుల మాట మోడీ వినడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. గత వీడియో కాన్ఫరెన్స్ ల అనుభవాలను బట్టి సీఎంల మాట మోడీ వినడం లేదనిపిస్తోంది.

వలస కూలీల విషయంలో సీఎంలు చాలా సార్లు మొరపెట్టుకున్న తర్వాతే మోడీ ఓ నిర్ణయం తీసుకున్నారు. 40 రోజుల నరకయాతన అనుభవించిన తర్వాత వలస కూలీలకు మోక్షం లభించింది. అది కూడా వలస కూలీల విషయం అంతర్జాతీయంగా హైలైట్ అయింది. దీంతో, మోడీపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల తర్వాతే మోడీ స్పందించారన్న విమర్శలు వస్తున్నాయి.

వలస కార్మికుల విషయంలో మోడీ వ్యవహార శైలి వల్ల… ప్రపంచ వ్యాప్తంగా మోడీ ప్రతిష్ట మసక బారిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు, ఢిల్లీ-మర్కజ్ కాంటాక్టులు పట్టుకోవడంలో విఫలం కావడం….టెక్నాలజీ వాడటంలో విఫలం కావడం వంటివి మోడీకి ప్రతికూలంగా మారాయి. లాక్ డౌన్ సరైన సమయానికి విధించినా… అంతర్జాతీయ విమానాల విషయంలో మోడీ విఫలమయ్యారన్న వాదన వినిపిస్తోంది.

కేరళలో కేసులు నమోదవుతున్న సమయంలో..వుహాన్ నుంచి మెడికోలను క్వారంటైన్ లో పెట్టిన సమయంలోనే అంతర్జాతీయ విమానాలను ఆపి ఉంటే…కేసుల తీవ్రత ఇంత ఉండేది కాదన్న వాదన ఉంది. మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహానికి కారణం కూడా అదేనన్న ప్రచారం జరుగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతర్జాతీయ విమానాలను నిలిపివేయకుండా, లాక్ డౌన్ ల మీద లాక్ డౌన్ లు విధించడం వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయన్నది సీఎంల వాదన. మరి, ఈ సారైనా సీఎంల మొరను మోడీ సాబ్ ఆలకిస్తారో లేదో చూడాలి.

This post was last modified on May 10, 2020 5:25 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

1 hour ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

1 hour ago

ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…

2 hours ago

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

3 hours ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

3 hours ago

ఎన్టీఆర్ పేరు చెప్పి బాబును టార్గెట్ చేస్తున్న నాని

గుడివాడ‌లో విజ‌యం కోసం నాని నానాపాట్లు ప‌డుతున్నారు. త‌న అనుచ‌రుల ఆగ‌డాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. కానీ…

4 hours ago