Political News

షాకుల మీద షాకులు ఇస్తున్న ఆ బీజేపీ సీఎం జనరల్ నాలెడ్జ్

నోటికి వచ్చినట్లుగా మాట్లాడి చులకన కావటం కొందరు ముఖ్యమంత్రులకు బాగా అలవాటు. ఇటీవల కాలంలో అవసరం ఉన్నా లేకున్నా.. ఏదో విషయాన్ని కెలికి వార్తల్లోకి రావటమే కాదు.. అందరి చేత మాట అనిపించుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఉత్తరాఖండ్ బీజేపీ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ ముందు ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఆయనకు ఏమైందో కానీ.. ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వార్తాంశాలుగా మారి.. బీజేపీ పరువురు బజారులో పెడుతున్నాయి.

మహిళలు చిరిగిపోయిన జీన్స్ వేసుకునే విధానంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసి.. అతివల ఆగ్రహానికి గురైన ఆయన.. తాజాగా తన జీకే (జనరల్ నాలెడ్జ్) ఎంతో చెప్పే ప్రయత్నం చేశారు తాజా వ్యాఖ్యలతో. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా పడుతున్న ఇబ్బందిని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో భారత్ గొప్పతనం.. ప్రధాని మోడీ సమర్థతనుచాటి చెప్పాలన్న తొందరలో తప్పులో కాలేశారు.

భారత్ ను అమెరికా 200 ఏళ్లు పాలించిందని.. ప్రపంచాన్నే పాలించిన అమెరికా ఇప్పుడు కొవిడ్ నియంత్రణకు తీవ్రంగా శ్రిమిస్తుందన్నారు. కోవిడ్ కట్టడిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ చాలా మెరుగ్గా ఉందన్నారు. ‘భారతీయుల్ని 200 ఏళ్ల పాటు బానిసలుగా చేసిన అమెరికా కూడా కొవిడ్ ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితి ఉంది. భారత్ లో మోడీ స్థానంలో మరొకరు ఉండి ఉంటే పరిస్థితులు ఘోరంగా ఉండేవి’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. కరోనా నుంచి ప్రతి ఒక్కరినీ మోడీ కాపాడారన్న ముఖ్యమంత్రి మాటలు ఇప్పుడు నవ్వులు పూయించేలా మారాయి. మోడీ ఘనతను కీర్తించేందుకు ఆయన కలిపిన పులిహోర దెబ్బకు కమలనాథులు కిందా మీదా పడుతున్నారు.

This post was last modified on March 22, 2021 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago