Political News

షాకుల మీద షాకులు ఇస్తున్న ఆ బీజేపీ సీఎం జనరల్ నాలెడ్జ్

నోటికి వచ్చినట్లుగా మాట్లాడి చులకన కావటం కొందరు ముఖ్యమంత్రులకు బాగా అలవాటు. ఇటీవల కాలంలో అవసరం ఉన్నా లేకున్నా.. ఏదో విషయాన్ని కెలికి వార్తల్లోకి రావటమే కాదు.. అందరి చేత మాట అనిపించుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఉత్తరాఖండ్ బీజేపీ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ ముందు ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఆయనకు ఏమైందో కానీ.. ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వార్తాంశాలుగా మారి.. బీజేపీ పరువురు బజారులో పెడుతున్నాయి.

మహిళలు చిరిగిపోయిన జీన్స్ వేసుకునే విధానంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసి.. అతివల ఆగ్రహానికి గురైన ఆయన.. తాజాగా తన జీకే (జనరల్ నాలెడ్జ్) ఎంతో చెప్పే ప్రయత్నం చేశారు తాజా వ్యాఖ్యలతో. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా పడుతున్న ఇబ్బందిని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో భారత్ గొప్పతనం.. ప్రధాని మోడీ సమర్థతనుచాటి చెప్పాలన్న తొందరలో తప్పులో కాలేశారు.

భారత్ ను అమెరికా 200 ఏళ్లు పాలించిందని.. ప్రపంచాన్నే పాలించిన అమెరికా ఇప్పుడు కొవిడ్ నియంత్రణకు తీవ్రంగా శ్రిమిస్తుందన్నారు. కోవిడ్ కట్టడిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ చాలా మెరుగ్గా ఉందన్నారు. ‘భారతీయుల్ని 200 ఏళ్ల పాటు బానిసలుగా చేసిన అమెరికా కూడా కొవిడ్ ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితి ఉంది. భారత్ లో మోడీ స్థానంలో మరొకరు ఉండి ఉంటే పరిస్థితులు ఘోరంగా ఉండేవి’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. కరోనా నుంచి ప్రతి ఒక్కరినీ మోడీ కాపాడారన్న ముఖ్యమంత్రి మాటలు ఇప్పుడు నవ్వులు పూయించేలా మారాయి. మోడీ ఘనతను కీర్తించేందుకు ఆయన కలిపిన పులిహోర దెబ్బకు కమలనాథులు కిందా మీదా పడుతున్నారు.

This post was last modified on March 22, 2021 11:20 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సంక్రాంతి కోసం నాగార్జున స్కెచ్

మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…

23 mins ago

సాయిపల్లవిని టార్గెట్ చేసుకుంటున్నారు

నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…

47 mins ago

సమంతా ఇంత మాస్ గా వుందేంటి

తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…

1 hour ago

రజని – కమల్ – చరణ్ ఒకే వేదికపై

కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…

2 hours ago

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

5 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

5 hours ago