Political News

సోమవారం సభలో కేసీఆర్ నోటి నుంచి కీలక ప్రకటనలు ఇవేనా?

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సోమవారం నాటి సభ వేదికగా మారుతుందని చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ బడ్జెట్ మీద మాట్లాడనున్నారు. అదే సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా తాను చేయాలనుకున్నపలు ప్రకటనల్ని అప్పుడే చేస్తారని చెబుతున్నారు. దీనికి తోడు.. అప్పటికి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.

గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన పీఆర్సీలకు సంబంధించిన ఫిట్ మెంట్ శాతాన్ని ప్రకటించటంతో పాటు.. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు.. సంక్షేమ హాస్టల్స్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎనిమిదో తరగతి వరకు స్కూళ్లు బంద్ చేసే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో.. విద్యార్థుల్ని వచ్చే సంవత్సరానికి ఎలా ప్రమోట్ చేయాలన్న అంశంపైనా స్పష్టత ఇచ్చేస్తారని చెబుతున్నారు.

మరి.. పీఆర్సీ పై ప్రభుత్వం ప్రకటన చేస్తే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోడ్ కు ఉల్లంఘించినట్లు కాదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వదని చెబుతున్నారు. సాగర్ ఉప ఎన్నిక కోడ్ నల్గొండ జిల్లా పరిధిలో మాత్రమే అమల్లో ఉంటుందని.. రాష్ట్రం మొత్తానికి అమల్లో ఉండదని.. అందుకే.. ప్రభుత్వం చేసే ప్రకటనలకు అడ్డంకి కాదన్న మాటను అధికారులు చెబుతున్నారు. ఏమైనా.. మరో మూడు రోజుల్లో కేసీఆర్ నోట కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని చెప్పాలి.

This post was last modified on March 21, 2021 8:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

35 minutes ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

2 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

3 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 hours ago