ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సోమవారం నాటి సభ వేదికగా మారుతుందని చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ బడ్జెట్ మీద మాట్లాడనున్నారు. అదే సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా తాను చేయాలనుకున్నపలు ప్రకటనల్ని అప్పుడే చేస్తారని చెబుతున్నారు. దీనికి తోడు.. అప్పటికి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన పీఆర్సీలకు సంబంధించిన ఫిట్ మెంట్ శాతాన్ని ప్రకటించటంతో పాటు.. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు.. సంక్షేమ హాస్టల్స్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎనిమిదో తరగతి వరకు స్కూళ్లు బంద్ చేసే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో.. విద్యార్థుల్ని వచ్చే సంవత్సరానికి ఎలా ప్రమోట్ చేయాలన్న అంశంపైనా స్పష్టత ఇచ్చేస్తారని చెబుతున్నారు.
మరి.. పీఆర్సీ పై ప్రభుత్వం ప్రకటన చేస్తే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోడ్ కు ఉల్లంఘించినట్లు కాదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వదని చెబుతున్నారు. సాగర్ ఉప ఎన్నిక కోడ్ నల్గొండ జిల్లా పరిధిలో మాత్రమే అమల్లో ఉంటుందని.. రాష్ట్రం మొత్తానికి అమల్లో ఉండదని.. అందుకే.. ప్రభుత్వం చేసే ప్రకటనలకు అడ్డంకి కాదన్న మాటను అధికారులు చెబుతున్నారు. ఏమైనా.. మరో మూడు రోజుల్లో కేసీఆర్ నోట కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని చెప్పాలి.
This post was last modified on March 21, 2021 8:53 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…