Political News

విశాఖ టీడీపీను ఖాళీ చేసిన వైసీపీ

విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో విచిత్రమైన పరిస్దితి తలెత్తింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఇంకా పదిరోజులు కూడా కాలేదు. అప్పుడు టీడీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లలో ఏడుగురు వైసీపీ ఎంఎల్ఏతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. భేటి విషయం బయటపడగానే పార్టీ ఏడుగురు కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో టీడీపీ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే జీవిఎంసి పరిధిలోని గాజువాక నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలో ఎనిమిది చోట్ల టీడీపీ గెలిచింది. మరి ఏమయ్యిందో ఏమో ఎనిమిది మందిలో ఏడుగురు గాజువాక వైసీపీ ఎంఎల్ఏ తిప్పలనాగిరెడ్డితో భేటి అయ్యారు. భేటి సందర్భంగా ఎంఎల్ఏకి పూలబొకే ఇచ్చి మేయర్ స్ధానాన్ని పార్టీ గెలుచుకోవటం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేశారు.

ఎంఎల్ఏతో భేటిఅయిన కార్పొరేటర్లలో పల్లా శ్రీనివాస్, పులి లక్ష్మీబాయి, గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, లేళ్ళ కోటేశ్వరరావు, బొండా జగన్నాధం, మొల్లి ముత్యాలనాయుడున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లు అధికారపార్టీ ఎంఎల్ఏతో భేటిఅయిన విషయం తెలియగానే పార్టీలో సంచలనంగా మారింది. అధికారపార్టీ ఎంఎల్ఏని ఎందుకు కలవాల్సొచ్చింది ? ఇందుకు పార్టీ అధ్యక్షుని అనుమతుందా అనే విషయాలు తెలుసుకునేందుకు వీళ్ళు ఏడుగురికి షోకాజ్ నోటీసిచ్చారు.

రెండు రోజుల్లో షోకాజ్ నోటీసుకు బదులివ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా అందులో హెచ్చరించారు. దాంతో విషయం ముదిరి పాకానపడుతోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత ధైర్యం పార్టీ నాయకత్వం చేస్తుందా అనేది సందేహమే. ఒకవేళ వీళ్ళంతా టీడీపీలో నుండి వైసీపీలోకి ఫిరాయిస్తే చేయగలిగేది కూడా ఏమీలేదు. ఫలితాలు వచ్చిన వారంలోపే వీళ్ళంతా అధికారపార్టీ ఎంఎల్ఏని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తానికి జీవిఎంసి టీడీపీలో ముసలం మొదలయ్యేట్లే ఉంది.

This post was last modified on March 20, 2021 3:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…

8 minutes ago

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…

42 minutes ago

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

2 hours ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

5 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

5 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

6 hours ago